breaking news
lanuch
-
ఐఫోన్ 16 వచ్చిందోచ్ (ఫొటోలు)
-
మరో బిజినెస్లోకి గౌరీ ఖాన్ : గ్రాండ్ లాంచింగ్, స్టార్ల సందడి
ప్రముఖ ఇంటీరీయర్ డిజైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ కొత్త బిజినెస్ షురూ చేశారు. ముంబైలోని తొలి రెస్టారెంట్ ‘టోరీ’ ని మంగళవారం రాత్రి ఘనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు, ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనర్లు ఈ వేడుకలో సందడి చేశారు. నిర్మాత కరణ్ జోహార్, భావనా పాండే, నటులు సంజయ్ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, నీలం కొఠారి,సీమా సజ్దేహ్ తదితరులు మెరిసారు. ముఖ్యంగా సుస్సానే ఖాన్ తన ప్రియుడు, నటుడు అర్స్లాన్ గోనితో కలిసి లాంచ్కి హాజరై స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. కాగాఇంటీరీయర్ డిజైనర్గా వ్యాపార రంగంలో సక్సెస్ఫుల్గా రాణిస్తూ, అనేక మంది సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది గౌరీ ఖాన్. అలాగే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గౌరీఖాన్. ఇపుడికముంబైలోని విలాసవంతమైన ఏరియాలో లగ్జరీ హెటెల్తో హాస్పిటాలిటీ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. -
స్మార్ట్ఫోన్ల జాతర.. వరుస కట్టిన కొత్త ఫోన్లు
పండగ సీజన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీలు రెడీ అయ్యాయి. దసరా మొదలు న్యూ ఇయర్ వరకు ఉన్న ఫెస్టివ్ సీజన్లో వరుసబెట్టి ఫోన్లు రిలీజ్ చేసేందుకు స్పెషల్ ఈవెంట్లను వేదికగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఫోన్ల ధర ఎంత, వాటిలో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి గ్యాడ్జెట్ లవర్స్లో పెరిగిపోతుంది. యాపిల్తో మొదలు స్మార్ట్ఫోన్ ప్రపంచలో యాపిల్ది ప్రత్యేక స్థానం, మెటల్బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాప్స్టోర్, టాప్నాచ్ ఇలా ఒక్కటేమిటీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫీచర్లలో సగానికి సగం యాపిల్ పరిచయం చేసినవి లేదా యాపిల్ వల్ల పాపులర్ అయినవే ఉన్నాయి. అందువల్లే యాపిల్ ఈవెంట్ అంటే ప్రపంచమంతటా ప్రత్యేక ఆసక్తి. మొబైల్ టెక్నాలజీలో కొత్తగా ఏం పరిచయం చేయబోతున్నారనే కుతూహలం నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా అక్టోబరు 18న యాపిల్ ఆన్లీషెడ్ ఈవెంట్ జరగనుంది. గూగుల్ సైతం ప్రపంచంలో ఎనభై శాతం స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫార్మ్ మీదనే రన్ అవుతున్నా.. మార్కెట్ లీడర్ అనదగ్గ ఒక్క ఫోన్ రిలీజ్ చేయలేదనే వెలితి గూగుల్ని పట్టి పీడిస్తోంది. నెక్సస్, మోటో, పిక్సెల్ తదితర బ్రాండ్ నేమ్లతో పదేళ్లుగా గూగుల్ మొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అక్టోబరు 19న పిక్సెల్ 6 మొబైల్ని రిలీజ్ చేయనుంది. ఇందులో కొత్తగా టెన్సర్ చిప్సెట్ని ఉపయోగిస్తోంది గూగుల్. ఈసారైనా ఈ టెక్ దిగ్గజ కంపెనీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. మరో సిరీస్లో వన్ప్లస్ హైఎండ్ ఫీచర్లు అతి తక్కువ ధరలో అనే కాన్సెప్టుతో వచ్చి శామ్సంగ్, యాపిల్కు చుక్కలు చూపించింది వన్ ప్లస్ బ్రాండ్. కేవలం దీని వల్లే హై ఎండ్బ్రాండ్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ పరంపరలో 9 సిరీస్కి సంబంధించిన వివరాలు అక్టోబరు 19న వెల్లడించనుంది వన్ప్లస్. మేము వస్తున్నాం యాపిల్, గూగుల్లకి పోటీగా అన్ ప్యాకెడ్ ఈవెంట్ని ప్రకటించింది శామ్సంగ్. అక్టోబరు 20న జరగబోయే ఈ సమావేశంలో తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కి సంబంధించి గ్యాడ్జెట్లను శామ్సంగ్ పరిచయం చేయనుంది. మళ్లీ వస్తోన్నఎక్స్పీరియా అక్టోబరులోనే కొత్త ఎక్స్పీరియా ఫోన్ని పరిచయం చేసేందుకు సోనీ రెడీ అవుతోంది. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లో చెలరేగిన సోని.. గత ఐదేళ్లుగా గప్చుప్గా ఉంది. కాగా మరోసారి ఇండియన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా అక్టోబరు 26న ఎక్స్పీరియా ఈవెంట్ నిర్వహిస్తోంది. సోనితో పాటే ఇదే నెలలో ఒప్పో, ఆనర్, హువావే, ఐక్యూ కంపెనీలు సైతం కొత్త ఫోన్లు మార్కెట్లోకి తేబోతున్నాయి. ఏడాది చివరినాటికి బడ్జెట్ ఫోన్లతో దేశంలో సగం మార్కెట్ని ఆక్రమించిన రెడ్మీ, రియల్మీ సంస్థలు సైతం రాబోయే నెలల్లో కొత్త ఫోన్లు తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు వీటి సబ్సిడరీ కంపెనీలైన ఆనర్, పోకోలు ధరల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు కొత్త మోడళ్లతో మార్కెట్ను ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. చదవండి:6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన మోదీ
హరిద్వార్: పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ నిర్మించిన పరిశోధన కేంద్రం పతంజలి యోగ్పీఠ్ ను ఉత్తరాఖండ్ హరిద్వార్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్కి ప్రధాని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యోగా ప్రాచుర్యానికి, ఆయుర్వేద వైద్యానికి, ఔషధాలకు విశిష్టతను కల్పించారని భారత ఆయుర్వేద ఉత్పతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్పుంజుకుందని ప్రధాని చెప్పారు. అయితే ఈ ఉత్పత్తులు వారికి చేరడం లేదని, పతంజలి పరిశోధన ద్వారా వచ్చే ఉత్పత్తులు వారికి చేరువ కావాలన్నారు. దేశానికి గర్వకారణమైన చారిత్రక, వారసత్వ సంపదను విస్మరించకూడదని ప్రధాని సూచించారు. పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ బృందం రూపొందించిన ప్రపంచ హెర్బల్ ఎన్సైకిలో పీడియాను మోదీ విడుదల చేశారు. అలాగే రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అహ్మాదాబాద్లో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా యోగాను పాపులర్ చేయనున్నామని ప్రధాని ప్రకటించారు. ఈ ఉత్సవంలో సాధ్యమైనంతమంది పాల్గొనాలని పిలుపునిచ్చారు.