-
సావిత్రికి ‘చిత్రకళా’ నివాళి
విజయనగర్కాలనీ: మహానటి సావిత్రికి లలిత కళల విద్యార్థులు వినూత్న రీతిలో నివాళులు అర్పించారు. మాసబ్ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో గురువారం క్రియేటివ్ మల్టీ మీడియా కాలేజ్ ఆఫ్ ఫైనార్ట్స్ చిత్రకళా విభాగం విద్యార్థులు ఏర్పాటు చేసిన దివంగత నటి సావిత్రి చిత్ర కళాఖండాలను ‘మహానటి’ డైరెక్టర్ నాగఅశ్విన్, నిర్మాత ప్రియాంకదత్లు ప్రారంభించారు. సావిత్రి పెన్సిల్ స్కెచ్లు, పెయింటింగ్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నాగఅశ్విన్, ప్రియాంకదత్లు నిర్మాత మాట్లాడుతూ.. మహానటి చిత్రానికి తాము ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన మహానటి సావిత్రి చిత్రాలు విద్యార్థుల ప్రతిభకు దర్పణం పడుతున్నాయన్నారు. ఈ చిత్రాలు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని ‘మా’ అసోసియేషన్కు అందజేయనున్నట్లు క్రియేటివ్ మల్టీ మీడియా కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ బి.రాజశేఖర్ తెలిపారు. ప్రదర్శనలో జూన్ 2 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిత్రాలను తిలకించవచ్చని సమన్వయకర్త వెంకట్ చౌదరి తెలిపారు. కార్యక్రమంలో ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎన్.వికాస్, పెయింటింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రీతి సంయుక్తలతో పాటు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఏప్రిల్7,8న సాహితీ పండుగ
- కర్నూలులో జాతీయ తెలుగు రచయితల మహాసభలు – నవలా, కథా, నాటకం, కవిత్వంపై చర్చా గోష్టులు – ముగింపు రోజున కవి సమ్మేళనం – హాజరుకానున్న సుప్రసిద్ధ రచయితలు రాచపాలెం, సింగమనేని, తెలకపల్లి తదితరులు కర్నూలు (కల్చరల్) : లలిత కళా సమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 7,8 తేదీల్లో కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో జాతీయ తెలుగు రచయితల మహా సభలు నిర్వహించనున్నామని లలిత కళా సమితి అధ్యక్షుడు, మహా సభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పత్తిఓబులయ్య తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటలకు జరిగే తెలుగు రచయితల ప్రారంభోత్సవంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డా.రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి, డా.పాపినేని శివశంకర్, సుప్రసిద్ధ రచయిత సింగమనేని నారాయణ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. అదే రోజున పుస్తక ప్రదర్శనను అతిథులు ప్రారంభిస్తారన్నారు. తొలి రోజున ‘తెలుగు కవిత్వ ధోరణులు ఒక పరిశీలన’ అనే అంశంపై, తెలుగు నాటకం, విభిన్న రీతులు అనే అంశంపై, తెలుగు నవల ఆధునిక పోకడలు అనే అంశంపై చర్చా కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్ మియా ఆధ్వర్యంలో తెలుగు గాన విభావరి కార్యక్రమం ఉంటుందన్నారు. 8న ఉదయం 10.30 గంటలకు తెలుగు కథా పరిణామం అనే అంశంపై, 12 గంటలకు స్త్రీ వాద సాహిత్యం సమాలోచనలు అనే అంశంపై, మధ్యాహ్నం 3 గంటలకు తెలుగు సాహిత్యం, విమర్శ అనే అంశంపై చర్చ ఉంటుందన్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి ఆసక్తి కలిగిన కవులు తమ కవితలను లలిత కళా సమితి, సీ.క్యాంపు కర్నూలు అనే చిరునామాకు తమ కవితలు పంపవచ్చన్నారు. సభల నిర్వహణకు ప్రత్యేక ఆహ్వాన కమిటీ కర్నూలు నగరంలో 20ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతీయ స్థాయి తెలుగు రచయితల మహాసభలకు కన్వీనర్గా ప్రముఖ కథా రచయిత ఇనాయతుల్లా వ్యవహరిస్తారని, కమిటీలో ప్రముఖ నవలా రచయిత ఎస్డీవీ అజీజ్, రచయితలు జంధ్యాల రఘుబాబు, డా.విజయ్కుమార్, కెంగార మోహన్, డా.మధుసూదనాచార్యులు, కళ్యాణదుర్గం స్వర్ణలత, దండెబోయిన పార్వతి, డా.వి.పోతన తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ మహా సభల్లో జిల్లా వ్యాప్తంగా కవులు, రచయితలు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మహాసభల కన్వీనర్, కథా రచయిత ఇనాయతుల్లా, లలిత కళా సమితి కార్యదర్శి మహమ్మద్మియా, కోశాధికారి బాలవెంకటేశ్వర్లు, మహా సభల కో కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement