-
గొడవలతో భర్తకు దూరం.. గోపితో ప్రేమ, పెళ్లి కోసం ఆందోళన..
చీరాల రూరల్: మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి రైలుకిందపడి బలవన్మరణం చెందింది. ఈఘటన బుధవారం రాత్రి చీరాల–జాండ్రపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (30)చీరాలలోని వైకుంఠపురం విఠల్నగర్ సచివాలయంలో శానిటేషన్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు గతంలోనే వివాహం జరగగా కుటుంబ కలహాల నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఈమె విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో మృతురాలు లక్ష్మీప్రసన్న, గోపి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి వివాహం విషయంలో కొంత కాలంగా ఆమె ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎరుకుల హక్కుల పోరాట సమితి ధర్నా.. మృతురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తండ్రి వారి బంధువులు ఎరుకుల హక్కుల పోరాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్కుమార్ ధర్మతో కలసి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. ఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ప్రధానితో ‘మంచు’ కుటుంబం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, హోం శాఖ కార్యదర్శి ఎ.కె.భల్లాతో ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో మోహన్ బాబు, ఆయన కూతురు, నటి మంచు లక్ష్మీప్రసన్న, ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు, కోడలు వెరోనిక సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్షాతో 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అలాగే కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను కలిశారు. అనంతరం మోహన్బాబు మీడియాతో మాట్లాడా రు. ఇవాళ ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశానని, రా ష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వాడిననాన్నరు. వైఎస్ జగన్ మంచే చేస్తున్నారు.. ‘జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఆరు మాసాలైంది. నాకు తెలిసినంత వరకు మంచే చేస్తున్నారు. వారిని కాదని నేనేమీ ఇక్కడికి రాలేదు. మోదీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. క్లిష్ట పరిస్థితుల్లో భారత దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోదీ. హోం మంత్రి అంటే ఆ పదవికి వన్నె తెచ్చిన నేత అమిత్ షా. ఇలాంటి నాయకులు దేశానికి కావాలని అందరూ కోరుకుంటున్నారు..’ అని మోహన్బాబు పేర్కొన్నారు. మీ భేటీ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించగా.. ‘ఒక నటుడిగా వచ్చి గొప్ప ప్రధానిని కలిశా. వారి గొప్ప కార్యక్రమాలను అభినందించడానికి వచ్చా. ప్రధాని మోదీ ఆప్యాయంగా పల కరించారు. ప్రేమగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి..’ అని పేర్కొన్నారు. బీజేపీలోకి మిమ్మల్ని ఆహ్వానించారని వచ్చిన వార్తలపై ఏమంటారని అడగ్గా.. ‘2014లో కూడా కలిశాను. ఆయన ఆప్యాయత, నవ్వు, పలకరింపు కంటే ఏం కావాలి..’ అని అన్నారు. హోం కార్యదర్శిని కలవడంపై మాట్లాడు తూ.. ‘ఒక మంచి వ్యక్తిని కలవడంలో తప్పేముంది.. ఎప్పుడొచ్చినా అందరినీ కలుస్తాం..’ అని పేర్కొన్నారు. విద్యాసంస్థలను సందర్శించాలని ఆహ్వానించాం.. ‘మీరు బాలీవుడ్ నటులను కలిశారు.. సౌత్ వాళ్లని కలవలేదని కొంత అసంతృప్తి ఉంది’ అని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ప్రధాన మంత్రి స్పందించారని మంచు విష్ణు తెలిపారు. బాలీవుడ్ నటులతో అవకాశం వచ్చింది కాబట్టి కలిశానని, దక్షిణాది నటులను కూడా త్వరలోనే కలుస్తానని చెప్పారన్నారు. స్వ యంగా తానే చొరవ తీసుకుంటానని కూడా చెప్పార ని విష్ణు వివరించారు. ‘మా విద్యాసంస్థలను సంద ర్శించాలని గతంలో ఓసారి ఆహ్వానించాం. గతంలో నే రావాల్సి ఉంది. తప్పకుండా వస్తానని ప్రధాని చెప్పారు..’ అన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘ఇండియా అంటే ..ఇది అని చాటి చెప్పిన ప్రధాని మన మోదీ. నేను పుట్టిన తర్వాత ఇలాంటి గొప్ప వ్యక్తుల ను చూడలేదు. దేశం కోసం ఎలా సహాయం చేయ మంటారని మోదీని అడిగాను. అవన్నీ త్వరలో పాయింట్ టు పాయింట్ విడుదల చేస్తా’ అన్నారు. -
మెట్రో గర్ల్
పుట్టి పెరిగిన ఊరిలో సైకిల్పై బయటికి వెళ్లేందుకే భయపడిన అమ్మాయి హైదరాబాద్కే మణికిరీటం లాంటి మెట్రో రైలును ధైర్యంగా నడిపిస్తోంది! ఒంటరిగా చౌరస్తా వరకు వెళ్లే సాహసం చేయని ఆ యువతి.. రోజుకు వేలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తోంది. ఏడాది క్రితం హైద్రాబాద్లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాగా అందులో పైలట్గా ఎంపికైన వారిలో హన్మకొండలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల లక్ష్మీప్రసన్న ఒకరు. అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న మెట్రో రైలునే ఏడాదిగా మచ్చలేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు లక్ష్మిప్రసన్న. హన్మకొండ పట్టణంలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల నాగరాజు, శోభారాణిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురైన లక్ష్మీప్రసన్న పదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న సెయింట్ జోసెఫ్ (తోటబడి)లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వాగ్దేవి కళాశాలలో చదివారు. ఆ తర్వాత 2016లో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటివద్దే పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. సంతోషంగా ఉంది సాధారణ మధ్య తరగతి కుటుంబంలో నుంచి మెట్రో రైలు పైలట్గా విధులు నిర్వహించే అరుదైన గౌరవం దక్కడం నాకు సంతోషంగా ఉంది. రోజుకు 6నుంచి 8గంటల పాటు మెట్రో రైలు నడుపుతుంటాను. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సరైన సమయానికి చేరుస్తున్నానని చెప్పేందుకు గర్విస్తున్నాను. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న నేటి సమాజంలో నా ఆకాంక్షలను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రుల గొప్ప మనసు ముందు నాది చాలా చిన్న ఉద్యోగమే అనిపిస్తుంది. – లక్ష్మీప్రసన్న, పైలట్ మొదటి బ్యాచ్లోనే! స్నేహితుల సమాచారంతో హైదరాబాద్లో త్వరలో ప్రారంభమయ్యే మెట్రో రైలు సంస్థలో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుసుకున్న లక్ష్మీప్రసన్న మెట్రోరైలులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంస్థ నిర్వహించిన రాతపరీక్షకు హాజరై అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు. 2017 జూన్ 12న మెట్రో పైలట్గా ఉద్యోగ నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో మొదటి బ్యాచ్లో పైలట్గా ఎంపికైన సుమారు నలభై మంది అమ్మాయిల్లో లక్ష్మి ప్రసన్న ఒకరు. ఐదు నెలల శిక్షణ మెట్రో రైలు సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన లక్ష్మి ప్రసన్న సహచరులతో కలిసి హైద్రాబాద్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లో ఐదు నెలల పాటు శిక్షణ పొందారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే మెట్రో రైలు నిర్వహణపై కియోలిస్ కంపెనీ అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017 నవంబర్ 29న ప్రారంభమైన మెట్రోరైలు సేవల్లో నాటి నుంచి నేటివరకు దిగ్విజయంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎల్బినగర్– మియాపూర్ మధ్య మెట్రో రైలును నడిపిస్తున్నారు. – గజ్జి రమేష్, సాక్షి, హన్మకొండ -
ఎస్కేయూ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం జిల్లా /ఎస్కేయూ: శ్రీకృష్ణ విద్యాలయం (ఎస్కేయూ) హాస్టల్లో లక్ష్మీప్రసన్న (23) అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఇందుకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. వివరాలిలా ఉన్నాయి. గోరంట్లకు చెందిన నాగరాజు, జయమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీప్రసన్న ఎస్కేయూ సైన్స్ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ (జువాలజీ) చదువుతోంది. గోదావరి హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఉదయం 11 గంటలకు తరగతి గది నుంచి హాస్టల్ గదికి వచ్చింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు వచ్చి తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. వెంటనే వారు హాస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు పోలీసుల సాయంతో తలుపులు పగులగొట్టారు. లోనికెళ్లి చూడగా లక్ష్మీప్రసన్న ఫ్యాన్కు ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు తేజోనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ అబ్దుల్ కరీం తెలిపారు. తోటి విద్యార్థులను, స్నేహితులను ఆరా తీస్తున్నారు. లైంగిక వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిందా అనే అంశంపై లక్ష్మీ ప్రసన్న కాల్ డేటా దర్యాప్తునకు కీలకం కానుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. దురదృష్టకరం ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు గోదావరి హాస్టల్ను సందర్శించారు. లక్ష్మీప్రసన్న ఉరి వేసుకొన్న ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కొట్టొచ్చిన భద్రతా వైఫల్యం.. విద్యార్థులకు రక్షణ కల్పించే విషయంలో వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి హాస్టల్లోనూ సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను గాలికొదిలేశారు. హాస్టల్ అధికారుల పర్యవేక్షణే గనుక ఉండి ఉంటే నేడు విద్యార్థినిని కోల్పోవాల్సి వచ్చేది కాదని తోటి విద్యార్థులు వాపోతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. అదనపు బాధ్యతలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన డిప్యూటీ వార్డెన్ పోస్టులను భర్తీ చేస్తే.. ఇలాంటి ఘటనలను ముందుగా పసిగట్టే అవకాశం ఉంటుందనే భావన వ్యకతమవుతోంది. నేడు ఎస్కే యూనివర్సిటీ బంద్ ఎమ్మెస్సీ విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతికి సంతాప సూచికంగా మంగళవారం ఎస్కే యూనివర్సిటీని బంద్ చేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు వెలికితీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడతామని పేర్కొంది. ఆత్మహత్య చేసుకునే సమస్యలు లేవు లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మా కుటుంబంలో లేవు. జువాలజీ విభాగంలో ఒక ఫ్యాకల్టీ మెంబర్ కారణంగా తరచూ భయపడేది. ఇందులో హాస్టల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. చనిపోయిన విషయం మాకు తెలపకుండానే మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. – మీడియాతో లక్ష్మీ ప్రసన్న సోదరుడు తేజోనాథ్. అన్ని కోణాల్లో దర్యాప్తు విద్యార్థిని మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తాం. హాస్టల్లో ఉన్న సమస్యలతో పాటు అనుమానాస్పద మృతి అని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటాం. – వెంకట్రావు, అనంతపురం డీఎస్పీ -
ఈ చిన్నారులెవరో గుర్తుపట్టారా..?
బాలల దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరో ఆసక్తికరమైన ఫొటోలతో తన ఫ్యాన్స్ను అలరించారు. అదే బాటలో యంగ్ హీరో మంచు మనోజ్ ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేశాడు. చిన్నతనంలో అక్క లక్ష్మీ ప్రసన్న, అన్న విష్ణులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మనోజ్, ‘మీలోని ప్రేమ, ఆనందాన్ని వ్యక్తీకరించండి, మీలోని బాల్యాన్ని సజీవంగా, ఆనందంగా ఉంచండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్, నటుడిగా మంచి మార్కులు సాధించాడు. మరో హీరో విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. Express your joy, love and laughter. Keep that inner child in you alive and happy! Happy #ChildrensDay everyone! ❤️ pic.twitter.com/HlmDzKMXel — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 14 November 2017
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement