-
నిబద్ధతకు చిరునామా సీఎం జగన్
సాక్షి, ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): నిబద్ధతకు నిలువుటద్దంగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిలుస్తారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఏయూ టీఎల్ఎన్ సభా మందిరంలో డాక్టర్ జీకేడీ ప్రసాద్ వ్యాస సంకలనం ‘జనం కంటిరెప్ప జగన్’ పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పుస్తక రచయిత జీకేడీని అభినందించారు. అధికార భాషా సంఘం సభ్యుడు, ఏయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ రెండేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలనపై విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనంగా పుస్తకం తీసుకురావడం మంచి పరిణామమన్నారు. ఏయూ పాలక మండలి సభ్యురాలు గిరిజా అగస్టీన్ మాట్లాడుతూ.. వారి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేఘం వర్షాన్ని, విత్తు పంటని, వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ మోహన రెడ్డిని మనకు ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ పరిపాలన అందిస్తున్నారన్నారు. పుస్తక రచయిత డాక్టర్ జీకేడీ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పరిపాలనపై ప్రత్యేక కవితా సంపుటిని త్వరలో తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలపై కవితలు ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తమ కవితలకు నగదు పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. సంబంధిత పోస్టర్ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ డెమొక్రసీ పబ్లికేషన్ చైర్మన్ కె.వెస్లీ, ఏయూ హెచ్ఆర్డీసీ సంచాలకులు ఆచార్య ఎన్ఏడీ పాల్, న్యాయ కళాశాల ఆచార్యులు డి.సూర్యప్రకాశ రావు, పుస్తక ప్రచురణకర్త, బీహెచ్.ఎస్.ఆర్ అండ్ వి.ఎల్ డిగ్రీ కళాశాల సెక్రటరీ–కరస్పాండెంట్ డి.సువర్ణరాజు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
ఏలూరు సిటీ : పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు హాజరయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.లక్ష్మీప్రసాద్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తులు స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బీసీ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ .2 లక్షలలోపు కలిగి ఉండాలని, జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వివరాలకు ఏలూరు గవరవరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం 08812–232477, 99667 76077లో సంప్రదించాలని సూచించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement