breaking news
krnataka
-
'జై బజరంగబలి' మా వెంటే ఉన్నాడు!: కాంగ్రెస్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు జై బజరంగబలి అంటూ హనుమంతుని వేషధారణలో కనిపించారు. బజరంగబలి బీజేపీ వెంట లేడని కాంగ్రెస్ వెంటే ఉన్నాడని సెటైర్లు వేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. అంతేగాదు జై బజరంగబలి(హనుమంతుడు) బీజేపికి గట్టి జరిమానా విధించాడు అని హనుమంతుని వేషధారణలో ఉన్న కార్యకర్త అన్నారు. కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న బజరంగ దళ్ వంటి మితవాద సముహాలను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆసమయంలో అంశం పెను రాజకీయ వివాదాస్పద దుమారానికి దారితీసింది కూడా. దీంతో కాంగ్రెస్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ..తాము తమ వాగ్దానాన్ని నిలబెట్టుకునే తరుణం ఆసన్నమైందంటూ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాజ్యంగం, చట్టం చాలా పవిత్రమైనవని, బజరంగ్దళ్, పీఎప్ఐ వంటి సంస్థలు మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం, లేదా ద్వేషాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, తన కర్ణాటకలోని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ..బజరంగ్ దళ్ పేరుతో తరుచుగా హింస, అప్రమత్తత, నైతిక పోలీసింగ్ వంటి వాటితో ముడిపడి ఉందని, ఇది నిషేధిత ఇస్లామిక గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సమానం అని కాంగ్రెస్ తన మ్యానిపెస్టోలో పేర్కొంది. ఐతే ఆ సమయంలో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవ్వడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. పైగా బీజేపీ కూడా దీన్నే ఎన్నికల్లో కీలక అంశంగా కాంగ్రెస్పై విమర్శులు ఎక్కుపెట్టింది. ప్రచార ర్యాలీల్లో సైతం కాంగ్రెస్ హనుమంతుణ్ణి అవమానించిందని అందువల్ల మీరంతా ఓటేసేటప్పుడూ జై బజరంబలీ అని ఓటు వేయాలని ప్రధానితో సహా బీజేపీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు కూడా. మన సంస్కృతిని దుర్వినియోగం చేసేవారిని మీ ఓట్లతో తగిన విధంగా బుద్ధి చెప్పి శిక్షించాలని కోరారు. కానీ నేడు కాంగ్రెస్ అదే బజరబలీ వేషదారణలో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే గాక హనుమంతుడు మావైపే ఉన్నాడని కాంగ్రెస్ గట్టిగా నినదించి చెప్పడం గమనార్హం. (చదవండి: బలవంతులపై పేదల శక్తి గెలిచింది.. ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్) -
పాదయాత్ర భక్తులకు పెచ్చెర్వులో మెరుగైన వసతులు
శ్రీశైలం: ఉగాది ఉత్సవాలకు కర్ణాటక నుంచి పాదయాత్రగా శ్రీశైలం వస్తున్న భక్తులకు మార్గమధ్యంలో పెచ్చెర్వు వద్ద మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. పెచ్చుర్వు వద్ద భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఈఈ రామిరెడ్డి తదితరులతో కలిసి ఈఓ ఆదివారం పెచ్చెర్వును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి 30 వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో పాదయాత్రతో శ్రీశైలానికి వస్తున్నారన్నారు. అటవీ మార్గంలో వచ్చే పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పెచ్చెర్వులో బోరుబావుల నుంచి నీటిని దామర్లకుంట ఎగువ ప్రాంత వరకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భక్తులు సేద తీరేందుకు నాగలూటి, పెచ్చెర్వు తదితర చోట్ల షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జనరేటర్ ద్వారా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో అన్నదానం చేసే స్వచ్ఛందం సంస్థలకు దేవస్థానం తగిన సహాయ సహకారాలను అందజేస్తుందన్నారు. కర్ణాటక నుంచి పాదయాత్రగా వస్తున్న భక్తులతో ఈఓ మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆయన వెంట శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్కుమార్, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.