breaking news
krisnarao
-
భూపంపిణీ లక్ష్యం పూర్తి
ఖమ్మంసిటీ, న్యూస్లైన్: జిల్లాలో ఏడోవిడత భూపంపిణీ లక్ష్యాన్ని నూరుశాతం సాధిం చినట్టు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తెలిపారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, భూసంబంధిత కేసులు తదితరాంశాలపై భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూపంపిణీ లక్ష్యాల సాధన తదితరాంశాలను కలెక్టర్ వివరించారు. ప్రధాన కమిషనర్ ఐవైఆర్.కృష్ణారావు మాట్లాడు తూ.. ఈ నెల 10వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని రెవెన్యూ సదస్సులను వాయిదా వేసినట్టు చెప్పారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారంటూ కలెక్టర్ను అభినందించారు. ఈ-పాస్ పుస్తకాల జారీపై అవగాహన కల్పిం చాలని, పాత పాస్ పుస్తకాలను వాపస్ తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించేం దుకుగాను తహశీల్దారులకు ల్యాప్టాప్లు ఇస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, ట్రైనీ కలెక్టర్ మల్లికార్జున్, జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీని వాస్, ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ
హసన్పర్తి, న్యూస్లైన్ : తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకంపై హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ తరగతులు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తొమ్మిది రోజులపాటు ఉంటాయని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారు శిక్షణ పొందేందుకు అర్హులని, శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ఆసక్తి గలవారు బయోడేటా, నాలుగు పాస్ఫొటోలు, రేషన్కార్డు జిరాక్స్తో హసన్పర్తిలోని సంస్కృతీ విహార్లో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 0870-2564766, 98493 07873 నంబర్లలో సంప్రదించాలని కోరారు.