-
మెరీనా క్యాంపస్ మూగబోయింది
మద్రాసులో మరో తెలుగు దివ్వె కనుమరుగైంది. మూల ద్రావిడ భాషల్లో బహువచన ప్రత్యయమే లేదని పరిశోధనాత్మకంగా తేల్చిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య జీవీయస్సార్ కృష్ణమూర్తి మరణంతో ప్రతిష్ఠాత్మక మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా క్యాంపస్ తెలుగు శాఖ చిన్నబోయింది. తొంభై నాలుగేళ్ళ ఆ శాఖతో దాదాపు సగం కాలం అనుబంధం, అధ్యాపకత్వం మాస్టారివి. ఇన్నేళ్ళుగా మద్రాసులో తెలుగు భాషా పరిశోధనకూ, విద్యార్థులకూ పెద్దదిక్కుగా నిలి చిన మంచి మనిషిగా... మూల ద్రావిడ పదాలను ఎలా గుర్తించాలి, ఆ పదాల అర్థాలు, అర్థవిపరిణామానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన అరుదైన భాషావేత్తగా... జీవీయస్సార్ ఓ కొండగుర్తు. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ముప్పాళ్ళలో బతికిచెడ్డ కుటుంబంలో పుట్టిన జీవీయస్సార్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తూమాటి దొణప్ప వద్ద భాషాశాస్త్ర అధ్యయనం చేశారు. ‘ద్రావిడ భాషల్లో సమాన పదజాలం’పై పరిశోధించారు. అది ఆయనను పాండిత్యంలో సానబెట్టింది. చెన్నపురికి చేర్చింది. 1978 నుంచి ఇప్పటి దాకా మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖకు ఊపిరిగా నిలి పింది. ఆ శాఖలో దశాబ్దాల క్రితమే తెలుగు సాహితీ అధ్యయనాన్ని ప్రాయోగికంగా మారుస్తూ, జర్నలిజమ్ పేపర్ను ప్రవేశపెట్టడంలో కీలక భాగస్వామి ఆయన. భాషావికాసం - జర్నలిజాల బోధన, ద్రావిడభాషా పరిశోధన–రెండూ చివరి దాకా ఆయనకు రెండు కళ్ళు. జీవనపోరాటంలో కష్టనష్టాలెన్నో చూసిన అనుభవం ఆయనది. అందుకే, సుదూరం నుంచి వచ్చిన విద్యార్థుల ఈతిబాధలు మాస్టారికి తెలుసు. అలా 4 దశాబ్దాల్లో కొన్ని వందల మంది తెలుగు పిల్లలకు ఆయన గురువే కాదు, తల్లి- తండ్రి- ఆత్మబంధువయ్యారు. అవస రానికి సలహాల నుంచి అడిగిందే తడవుగా ఆర్థికసాయాల దాకా అన్నీ చూసే స్నేహితుడయ్యారు. ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనంలో కొన్ని పదుల మంది పరిశోధకులకు మార్గదర్శకులయ్యారు. కోరాడ రామకృష్ణయ్య, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వెంకటరావుల పరంపరలో ఆచార్య గంధం అప్పారావు, రామచంద్ర చౌదరి, అక్కిరెడ్డి తర్వాత తెలుగుశాఖకు అధ్యక్షులయ్యారు. ఏ హోదాలో ఉన్నా సరే చదువుకోవడానికొచ్చే పిల్లలతో అదే ఆత్మీయత. అదే వాత్సల్యం. రిటైరైన తరువాత కూడా రెండు దశాబ్దాలు రోజూ తెలుగు శాఖకు వచ్చి, విద్యార్థులను తీర్చిదిద్దిన నిష్కామకర్మ, నిబద్ధత జీవీ యస్సార్వి. ఎనిమిది పదులకు దగ్గరవుతున్నా... రోజూ ఉదయాన్నే వచ్చేదీ, పొద్దుపోయాకెప్పుడో రాత్రి ఆఖరున వెళ్ళేదీ ఆయనే. అనేక సార్లు ఆగుతూ వచ్చిన చదువును కొనసాగిస్తూ, సైన్స్ చదివి, ఎమ్మేలో లెక్కలు వేసి, జీవనోపాధికి అనేకానేక చిరు ఉద్యోగాలు చేసి, ఆనక తెలుగులో పరిశోధన రాసి ఆచార్యుడైన జీవీయస్సార్కు జీవితంలోని డబ్బు లెక్కలు తెలియవు. అడిగినవారికి లేదనకుండా, కష్టంలో ఉన్న విద్యార్థికి కన్నీరు విడవకుండా ఆయన చేసిన సాయాలు, దానాలు, చెప్పిన సలహాలు కొల్లలు. కానీ, తనకంటూ అవసరమున్నా ఎవరినీ అర్థించని ఆత్మాభిమాని. అనర్గళంగా ఆయన భాషాశాస్త్ర పాఠం చెబుతుంటే అది వినముచ్చట. పాఠంలో, పరిశోధనలో సీరియస్గా అనిపించే మనిషి... కిందకు దిగి, క్యాంటీన్లో కుర్రకారుతో కలసి సర దాగా కబుర్లాడుతుంటే అదో చూడముచ్చట. ఆచార్యుడైనా, శాఖాధ్య క్షుడైనా, ఆఖరుకు ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఉపకులపతి పదవి ఆఖరి క్షణంలో అందకుండా పోయినా– ఆయన మాత్రం అంతే సాదా సీదాగా గడిపేయడం ఓ అరుదైన ముచ్చట. నిన్నటి దాకా స్లెట్, యూజీసీ నెట్ నుంచి ఐఏఎస్ దాకా ఏ తెలుగు పరీక్షాపత్రం సిద్ధం చేయాలన్నా మాస్టారి చేయి పడాల్సిందే! భద్రిరాజు కృష్ణమూర్తి, పీఎస్ సుబ్రహ్మణ్యం, దొణప్పల తరువాతి తరంలో భాషాశాస్త్రంలో అవిరళ కృషి చేసిన జీవీయస్సార్ ఎక్కు వగా ఇంగ్లీషులోనే పరిశోధనలన్నీ రాశారు. వాటిని కనీసం పుస్తకంగా నైనా వేయలేదు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే వెళ్ళిపోవడంతో తెలుగు సమాజానికి ఆయన కృషి పూర్తిగా తెలియలేదు. సంపదనూ, సమ యాన్నీ, పరిశోధనా మేధనూ స్వీయప్రతిష్ఠ కోసం కాకుండా విద్యా ర్థుల కోసం వెచ్చించడం గురువుగా ఆయనలోని అరుదైన లక్షణం. ఆయన దగ్గర చదువుకొని కొందరు సినీ రచయితలయ్యారు. ఇంకొం దరు సాహితీవేత్తలయ్యారు. మరికొందరు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో ఆచార్యులయ్యారు. శాఖలో ఆయన ప్రత్యక్ష శిష్యులు మాడభూషి సంపత్ కుమార్ కూడా అదే శాఖకు అధ్యక్షులవడం సాక్షాత్ గురుకృప. చెన్నపట్నంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేసిన మైలాపూర్ భవనంతో, ఆ సొసైటీతో, అభ్యుదయ రచయితల సంఘంతో, ప్రపంచ తెలుగు సమాఖ్య - బీఎస్సార్కృష్ణ ‘రచన’ లాంటి సంస్థలతో జీవీయస్సార్ సాన్నిహిత్యం, వాటిల్లో ఆయన క్రియాశీలక కృషి చిరకాల జ్ఞాపకాలు. మల్లిక్, ఆచార్య కాసల నాగభూషణంతో కలసి ‘అరసం’ మద్రాసు శాఖ అధ్యక్షుడిగా ఆయన జరిపిన కార్యక్రమాలు వందలు. ‘నిండు మనంబు నవ్య నవనీత సమంబు... పల్కు దారుణ శస్త్ర ఖండనా తుల్యంబు...’ అన్న నన్నయ భారత చిత్రణ... సాహితీ పరిశో ధకుల మౌఖిక పరీక్షా సందర్భంలో మాస్టారికి సరిగ్గా సరిపోలుతుంది. సెమినార్లలో ఎవరు మాట్లాడినా, పరిశోధకులు ఏ తప్పు రాసినా ఆయన ఆత్మీయతను వదిలేసి, సత్యవాదిగా వాదనకు దిగేవారు. కొందరు సన్నిహితులకు సైతం రుచించకపోయినా, అది జీవీయస్సార్ జీవలక్షణం. భాషాశాస్త్రంలో çపట్టుసడలని పరిశోధనా దృష్టి, తెలుగు శాఖాభివృద్ధిలో పట్టువదలని కార్యదీక్ష, ఏదైనా సరే పట్టుకున్నది నెరవేరేలా చూసే వ్యవహార దక్షత, ఏటికి ఎదురీదే సాహసం, ఆప దలో పడితే తార్కికంగా చక్రం అడ్డువేసే శిష్యవాత్సల్యం, అవసరంలో ఉన్నవారికి సాయపడే సద్గుణం - ఇదీ ఆయన వ్యక్తిత్వం. అవన్నీ ఇకపై ప్రతి సందర్భంలోనూ చెన్నై తెలుగు వేదికపై ఆయన లేని లోటును పదే పదే గుర్తుచేస్తాయి. పదిమందీ గుర్తించేలా చేస్తాయి. అభ్యుదయ పరంపరాగత ఆత్మీయ గురువులకు అశ్రునివాళి. - డాక్టర్ రెంటాల జయదేవ -
విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తమిళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ అవార్డు గ్రహీత, ఆర్ట్ చిత్రాల దర్శకుడు పి. కృష్ణమూర్తి(77) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య కారణల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. భారతీయ, ఇమ్సాయ్ అరసన్ 23 ఆమ్ పులికేసి వంటి తమిళ చిత్రాలకు పని చేసినందుకు గాను వరుసగా ఐదుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు కృష్ణమూర్తి. ఇక ఆయన అంత్యక్రియలు చెన్నైలోని నివాసం మడిపక్కంలో సోమవారం మధ్యాహ్నం జరగనున్నాయి. తీరప్రాంత పట్టణం పూంపూహార్లో జన్మించిన కృష్ణమూర్తి 1975 లో జీవీ అయ్యర్స్ ‘హంసా గీత’ కన్నడ చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 18 వ శతాబ్దపు కర్ణాటక సంగీతకారుడు భైరవి వెంకటసుబ్బయ్య జీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను అందుకుంది. కృష్ణమూర్తికి మొదటి జాతీయ పురస్కారం జీవీ అయ్యర్ దర్శకత్వం వహించిన ‘మాధ్వాచార్య’ చిత్రం వల్ల దక్కింది. ఇక వీరిద్దరూ ‘ఆది శంకరాచార్య ’(1983), ‘మాద్వాచార్య’ (1986), ‘రామానుజచార్య’ (1989) వంటి చిత్రాల్లో పనిచేశారు. కృష్ణమూర్తికి చిన్నతనం నుంచి కూడా నటన అంటే అమితమైన ఆసక్తి. అతను మద్రాసులోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో శిక్షణ పొందారు. ఆ తరువాత సినిమాల్లోకి ప్రవేశించే ముందు థియేటర్ నాటకాలు, నృత్య ప్రదర్శనల కోసం సెట్ల రూపకల్పన పని చేశారు. రచయితలు జయకాంతన్, అశోకమిత్రన్, నాటక రచయిత, నటుడు గిరీష్ కర్నాడ్, థియేటర్ పర్సనాలిటీ బి.వి.కరాంత్, గాయకుడు బాలమురళి కృష్ణ వంటి వ్యక్తుల కృష్ణమూర్తిని సినిమాలకు పరిచయం చేశారు. 40 సంవత్సరాల కాలంలో, కృష్ణమూర్తి సంస్కృతం, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళం, మలయాళం, ఫ్రెంచ్, ఆంగ్ల చిత్రాలకు పని చేశారు. (చదవండి: కరోనా వైరస్ గురించి అతనికి ముందే తెలుసా?) కృష్ణమూర్తి తమిళంలో ఇందిరా, సంగమం, తెనాలి, కుట్టి, పాండవర్ భూమి, అజాగి, భారతి, జూలీ గణపతి, ఇమ్సాయ్ అరసన్ 23 ఆమ్ పులికేసి, నాన్ కడావుల్ ఉన్నాయి. మలయాళంలో స్వాతి తిరునాల్ (1987), వైసాలి (1988), ఓరు వడక్కన్ వీరగథ (1989), పెరుమ్తట్చన్ (1991) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా, భారతి చిత్రానికి గాను ఆయన రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఇక 2014లో విడుదలైన రామానుజన్ అతని చివరి తమిళ చిత్రం. కృష్ణమూర్తి ఎం నైట్ శ్యామలన్ (ప్రేయింగ్ విత్ యాంగర్), జగ్ ముంధ్రా (పెర్ఫ్యూమ్డ్ గార్డెన్) వంటి దర్శకులతో కూడా పనిచేశారు. ఆయన మరణవార్త తెలియడతో దర్శకులు భారతీరాజా, చింబు దేవన్ వంటి వారు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. -
నేడు భీమవరంలో ఎస్పీ బాలుకు సన్మానం
పశ్చిమగోదావరి: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో సన్మానం జరగనుంది. డీఎన్ఆర్ ఆర్ట్స్ కళాశాలలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటిక పోటీలు శనివారం నుంచి జరగనున్నాయి. వీటిలో భాగంగా సాయంత్రం 6 గంటలకు ఎస్పీ బాలును ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా సన్మానించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే, గాయని సునీతకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నామని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎస్పీ బాలు దంపతులు శుక్రవారమే భీమవరం చేరుకున్నారు. స్థానికంగా మావూళ్లమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
Advertisement