breaking news
krishna river area
-
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరదసూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,57,779, అవుట్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 167.94 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 31.89 టీఎంసీలుగా కొనసాగుతోంది. -
నేటి నుంచి ‘కృష్ణా’ బోర్డు సభ్యుల పర్యటన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తా శనివారం నుంచి కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. ఈ నెల 8న కృష్ణా బోర్డు మార్గదర్శకాల తయారీపై ఇరు రాష్ట్రాలతో ఉమ్మడిగా సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా అంతకుముందుగానే రెండు రాష్ట్రాల ప్రాజెక్టుల పరిధుల్లో పర్యటించనున్నారు. శనివారం కృష్ణా డెల్టాలో పర్యటించిన అనంతరం శ్రీశైలం ఎడమ, కుడి గట్టు కాలువ, సాగర్ కుడి, ఎడమ కాలువల కింద సైతం పర్యటనలు జరిపి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల కింద ఉన్న నిర్ణీత ఆయకట్టు, వాస్తవ నీటి లభ్యత, వినియోగం తదితరాలను పరిశీలించనున్నారు.