నెట్బాల్ స్టేట్ చాంప్ కృష్ణా
విజయవాడ స్పోర్ట్స్: స్థానిక శాతవాహన కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 3వ సీనియర్ ఏపీ స్టేట్ నెట్బాల్ చాంపియన్షిప్ విజేతగా మహిళా, పురుష రెండు విభాగాల్లోనూ కృష్ణా జిల్లా జట్లు విజేతగా నిలిచాయి. పురుషుల విభాగంలో కృష్ణా జిల్లా తరువాతి స్థానాలను వరుసగా ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లా జట్లు సాధించాయి. మహిళా విభాగంలో పశ్చిమగోదావరి ద్వితీయ స్థానం సాధించగా, నెల్లూరు, ప్రకాశం జట్లు సంయుక్తంగా తృతీయ స్థానాన్ని పొందాయి. పోటీల అనంతరం జరిగిన కార్యక్రమానికి శాతవాహన కళాశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి రవి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఉత్తరభారత దేశంలో నెట్బాల్ మంచి క్రేజి ఉన్న ఆటన్నారు. తమ కళాశాల చదువుతోపాటు ఆటలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ క్రమంలో నెట్బాల్ టోర్నీ ఎప్పుడు జరిగినా ప్రోత్సహిస్తున్నామన్నారు. శాతవాహన కళాశాల నెట్బాల్ జట్టు కేయూ యూనివర్సిటీ స్థాయిలో కూడా చక్కటి ప్రతిభకనపరుస్తుందన్నారు. కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా జిల్లాలో నెట్బాల్ను అభివృద్థి చేసిన ఘనత ఏపీ నెట్బాల్ సంఘ కార్యదర్శి బూదోటి శివరామ్కే దక్కుతుందన్నారు. ఎంతో మంది నెట్బాల్ క్రీడాకారులనుతయారు చేయడమే కాకుండా జాతీయ స్థాయిలో టోర్నీ నిర్వహించారన్నారు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నీల్లో పాల్గొనే జట్లకు శివరామ్ శిక్షణ ఇచ్చారన్నారు. ముగింపు కార్యక్రమంలో శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నాగేశ్వరశర్మ, కళాశాల పీడీ బీసీహెచ్ సంగీతరావు, ఏపీ నెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బూదోటి శివరామ్, కోశా«ధికారి ఎ.విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.