breaking news
Kovvuru Police division
-
'ఏపీ మంత్రి నుంచి నన్ను రక్షించండి'
-
ఏపీ మంత్రిపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు
సాక్షి, కొవ్వూరు : ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి కె.జవహర్పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ మంత్రి జవహర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు టీడీపీ ఫేస్బుక్ పేజీలో జెడ్పీటీసీ విక్రమాదిత్య వర్గానికి చెందిన కార్యకర్తలు కామెంట్స్ పెట్టారు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన మంత్రి మాట్లాడుదామని ఇంటికి పిలిచి చేయి చేసుకున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యేంద్రప్రసాద్ అనే కార్యకర్త మంత్రి జవహర్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీలోని అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పుడుతున్నారని, అనవసర కేసుల్లో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రిగారు తనపై చేయి చేసుకోవడమే కాకుండా చంపుతానని బెదిరించాడని సత్యేంద్రప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
మైనరే ముఠా నాయకుడు
ఏలూరు(ఆర్ఆర్ పేట) న్యూస్లైన్: ఏలూరు, కొవ్వూరు పోలీస్ సబ్డివిజన్ల పరిధిలో ఇటీవల జరిగిన వరుస గొలుసు దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను పట్టుకోగా వారిలో ముగ్గురు మైనర్లు కావడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. వివరాలను ఎస్పీ ఎం.రమేష్ శని వారం స్థానిక పోలీస్ సమావేశ మం దిరంలో విలే కరులకు వెల్లడించారు. ఏలూరు, కొవ్వూరు పోలీస్ సబ్ డివి జన్ల పరిధిలో ఇటీవల చెయిన్ స్నాచిం గ్లు ఎక్కువ కావడంతో ఎస్పీ ఆదేశా ల మేరకు పోలీసు అధికారులు ప్రత్యే క నిఘా వేశారు. ఏలూరు టూటౌన్ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబుకు శనివారం ఉదయం అందిన సమాచారం మేరకు టూటౌన్ క్రైం ఎస్సై ఎం.కోటేశ్వరరావుతో కలిసి స్థానిక పాత బస్టాండు వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న గొలుసు దొంగలు వీరిని చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఉన్న 37.5 కాసుల బరువైన 10 గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా తాడేపల్లిగూడెం సర్కిల్ పరిధిలో 5, భీమవరం సర్కిల్ పరిధిలో 2, ఏలూరు టౌన్ సర్కిల్ పరిధిలో 3, కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్ పరిధిలో ఒక దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుల్లో స్థానిక తూర్పు వీధికి చెందిన పాత నేరస్తులు యర్రవరపు ఫణిరాజా(19), మారగాని రవికుమార్ (19)తోపాటు ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ముఠాకు నాయకుడూ మైనరే కావటం మరో విశేషం. వీరంతా ఏలూరు రామకృష్ణాపురంలో బైక్ దొంగిలించి, దాని నంబరు మార్చి ఆ వాహనంపై వెళుతూ చెయిన్ స్నాచింగ్లకు పాల్పడ్డారని వివరించారు. నిందితులను పట్టుకోవటంలో కృతకృత్యులైన హెడ్కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రవికుమార్, బాజీలకు ఆయన రివార్డులు అందచేశారు. సమావేశంలో డీఎస్పీ ఎం.రజని, ఏలూరు టూటౌన్ సీఐ కె.విజయపాల్ పాల్గొన్నారు. ఛేదించాల్సిన కేసులు చాలా ఉన్నాయి : ఎస్పీ జిల్లాలో ఛేదించాల్సిన కేసులు అనేకం ఉన్నాయని, వాటిని కూడా ఛే దించి నేరాలను అదుపు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. గొలుసు దొంగతనాలకు పాల్పడేవారు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని చెప్పారు. వీధుల్లో పోలీసు గస్తీ ఎక్కువగా ఉండడంతో చిరునామాలు తెలుసుకునే నెపంతోనో, ఇల్లు అద్దెకు కావాలనే వంకతోనో ఇళ్లలోకి వెళ్లి మహిళల మెడల్లో గొలుసులు తెంపుకుపోతున్నారని వివరించారు. ఇటువంటి వారి పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.