breaking news
Kotpalli
-
కరోనాతో యువ వైద్యుడు మృతి
కోటపల్లి (చెన్నూర్): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన యువ వైద్యుడు రావుల రాజేశ్ (30) గురువారం కరోనా వైరస్తో మృతిచెందాడు. రాజేశ్ కరోనా బారిన పడి తొమ్మిది రోజులుగా హన్మకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి రాజేశ్ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రాజేశ్ ఫాండీ అనే ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును పూర్తి చేసి హన్మకొండలో స్థిరపడ్డాడు. నాలుగేళ్లుగా అక్కడే మాక్స్కేర్ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతను వ్యాక్సిన్ వేసుకుని ఉంటే వ్యాధి తీవ్రత ఇంతగా ఉండేది కాదని బంధువులు పేర్కొన్నారు. రాజేశ్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు చదవండి: ఢిల్లీకి ‘ఊపిరి’: ఆక్సిజన్పై కీలక ప్రకటన -
కోట్పల్లి ప్రజల కల నెరవేర్చండి
కోట్పల్లి మండలంగా ప్రకటించండి డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి పెద్దేముల్: ‘పదవులు.. నిధులు.. అడగటం లేదు.. 30 ఏళ్లుగా కోట్పల్లి గ్రామ ప్రజలు కల నెరవేర్చండి.. మండలంగా ప్రకటించండి..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కోట్పల్లి మండలంగా ప్రకటించాలని కోరుతూ ఆ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటితో 9వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షల్లో డ్వాక్రా మహిళలు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలకు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్ మహరాజ్, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరి స్వరూప, సీసీఐ రాములు, వెంకటచారి, శ్రీనివాస్చారి, నర్సింలు, లక్ష్మన్, గయాజ్, ముజీబ్ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోట్పల్లిని మండల కేంద్రంగా ప్రకటించకపోతే జిల్లా మంత్రి మహేందర్రెడ్డిని అడ్డుకుంటామని, కలెక్టరేట్ను ముట్టడిస్తామమన్నారు. 1983లో కోట్పల్లి మండల కేంద్రంగా ప్రకటించాల్సి ఉండగా.. రాజకీయ ఒత్తిళ్లతో బంట్వారాన్ని మండల కేంద్రంగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్పల్లి గ్రామ ప్రజలు తొమ్మిది రోజుల నుంచి రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నా ప్రభుత్వానికి ఎందుకు చలనం రాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి మహేందర్రెడ్డి చొరవ తీసుకుని కోట్పల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోట్పల్లిని మండల కేంద్రంగా చేయకపోవడం ఇది రాజకీయ నాయకుల కుట్ర అని, తాండూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాజుగౌడ్ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఇన్చార్జి ఎల్లారెడ్డి, ప్రవీణ్ పటేల్, యాలాల మండల ఇన్చార్జి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.