breaking news
Konda Venkata Rajendra
-
‘లోపలికి రా చెప్తా’ మూవీ రివ్యూ
టైటిల్: లోపలికి రా చెప్తానటీనటులు: కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా తదితరులునిర్మాతలు: లక్ష్మీ గణేష్ చేదెళ్ళ, కొండ వెంకట రాజేంద్రకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా వెంకట రాజేంద్రసంగీతం: దేవ్ జాండ్సినిమాటోగ్రఫీ:రేవంత్ లేవాక, అరవింద్ గణేష్విడుదల తేది: జులై 5, 2025కొండా వెంకట రాజేంద్ర కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ‘లోపలికి రా చెప్తా’(Lopaliki Ra Chepta Review). మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ గణేశ్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(జులై 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డెలివరీ బాయ్ రామ్ (కొండా వెంకట రాజేంద్ర), ప్రియ(సుస్మిత ఆనాల)కి పెళ్లి జరుగుతుంది. శోభనం రోజు గదిలోకి వెళ్లిన తర్వాత ప్రియ దెయ్యంలా మారి..రామ్ని భయపెట్టి, ముద్దు కూడా పెట్టుకోనియకుండా బయటకు పంపుతుంది. స్నేహితుడు ఇచ్చిన సలహాతో చేతికి తాయత్తు కట్టుకొని వెళితే.. రెండో రాత్రి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దీంతో ఓ మంత్రగాడి(వంశీ) దగ్గరకు వెళ్తారు. ఆ మంత్రగాడు రామ్ నేపథ్యం గురించి అడగడంతో కథ ప్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. డెలివరీ బాయ్ రామ్కి రోడ్డుపై ఓ అమ్మాయి(సాంచిరాయ్) పరిచయం అవుతుంది. ఆమెనే నెంబర్ ఇచ్చి.. రాత్రికి తన అపార్ట్మెంట్కి రమ్మని కబురు పంపుతుంది. అక్కడి వెళ్లిన రామ్.. విల్లా నెంబర్ తప్పుగా చెప్పి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లా నెంబర్ 91లో ఉన్నది ఎవరు? నైనిక (మనీషా జష్ణాని) ఎవరు? ఆమెతో రామ్కి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ(అజయ్ కార్తిక్) ఎవరు? రామ్ ఫస్ట్ నైట్ జరగకుండా అడ్డుకుంటున్న దెయ్యం ఎవరు? దాని కోరిక ఏంటి? చివరకు రామ్ శోభనం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.(Lopaliki Ra Chepta Review)ఎలా ఉందంటే..హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలు ఈ జానర్లో చిత్రాలు వచ్చాయి. లోపలికి రా చెప్తా కూడా ఆ కోవలోకి చెందిన సినిమానే. హారర్ కామెడీకి రొమాన్స్ని యాడ్ చేసి యూత్పుల్ ఎంటర్టైనింగ్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర. హారర్ కంటే ఎక్కువ కామెడీ, రొమాంటిక్ సీన్లపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్నైట్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. భార్య వింతగా ప్రవర్తిండంతో కథ హారర్ జోన్లోకి వెళ్తుంది. అయితే దర్శకుడు అక్కడ కూడా ఎక్కువగా భయపెట్టకుండా..కామెడీపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. మంత్రగాడి దగ్గరకు వెళ్లడం.. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గానే ఉంటాయి. ప్లాష్బ్యాక్లోకి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తికరంగా సాగుతుంది. అమ్మాయి నెంబర్ ఇవ్వడం.. అపార్ట్మెంట్లోకి వెళ్లడం.. ఇద్దరి మధ్య రొమాన్స్.. ఇవన్నీ యూత్ని ఆకట్టుకుంటాయి. నైనిక ఎపిసోడ్ కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ని బాగా ప్లాన్ చేశారు. ఇక సెకండాఫ్ మొత్తం దెయ్యం చుట్టునే కథనం తిరుతుంది. దెయ్యంతో శోభనం సీన్ నవ్వులు పూయిస్తుంది. ఓ మంచి సందేశంతో సినిమా ముగుస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఒక రొమాంటిక్ సీన్ లేదా పాటనో పెట్టి బోర్ కొట్టకుండా చేశాడు. అయితే కొన్ని చోట్ల మోతాదుకు మించిన రొమాన్స్ ఉండడం, డబుల్ మీనింగ్ పాట ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ‘లోపలికి రా చెప్తా’ కోసం థియేటర్ లోపలికి వెళితే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారెంటీ.ఈ సినిమాకు కొండా వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించడంతో పాటు హీరోగాను నటించాడు. రెండింటికి తగిన న్యాయం చేశాడు. తెరపై చాలా ఎనర్జిటిక్గా కనిపించాడు. నైనిక పాత్రలో నటించిన మనీషా జష్ణాని తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శించింది. ఎమోషనల్ సీన్లలో చక్కగానే నటించింది. ఇక దెయ్యం పట్టిన భార్య ప్రియగా సుస్మిత ఉన్నంతలో బాగానే చేసింది. అయితే హారర్ సీన్లను బలంగా రాసుకోలేకపోవడంతో..ఆమె భయపెట్టిన ప్రతిసారి థియేటర్స్లో నవ్వులే పూసాయి తప్ప భయం పుట్టలేదు. సాంచిరాయ్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ‘టిక్ టాక్ చేద్దామా’ పాటలో అందాలను ఆరబోసి యూత్ని ఆకట్టుకుంది. అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవ్ జాండ్ సంగీతం బాగుంది. టిక్ టాక్ చేద్దామా పాట యూత్ని ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే సుదిలోనా దారం పాట థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
టిక్ టాక్ చేద్దామా.. లిప్లాక్ చేద్దామా..!
కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించిన ఈ కామెడీ హారర్ మూవీ జులై 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'టిక్ టాక్ చేద్దామా..'అనే పాటను టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన ఈ పాట యూత్ని ఆకట్టుకునేలా ఉంది. రీసెంట్ గా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన "లోపలికి రా చెప్తా" ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉందని చిత్ర బృందం పేర్కొంది. -
హారర్ కామెడీగా ‘లోపలికి రా చెప్తా’
కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘లోపలికి రా చెప్తా’. మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ కీలక పాత్రలు పోషించారు. హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, పోస్టర్స్ అన్నింటినీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలుపుతూ.. చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ.. ‘‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే చిత్రంలోని మొదటి సాంగ్ను ఓ డెలివరీ బాయ్తో విడుదల చేయించాం. ఆ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. జూలై 5 న గ్రాండ్గా థియేటర్లలోకి సినిమాను తీసుకు రానున్నాం. ప్రతిష్టాత్మకమైన సరిగమ ఆడియో కంపెనీ ఈ చిత్ర ఆడియో హక్కులు దక్కించుకుంది. అవుట్ ఫుట్ చూసి టీమంతా ఎంతో హ్యాపీగా ఉన్నాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించే సినిమాగా ‘లోపలికి రా చెప్తా’ నిలుస్తుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుసుకుందాం’’ అని అన్నారు.