breaking news
King Vajiralongkorn
-
27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా?
బ్యాంకాక్: థాయ్ మహారాజు వజిరాలాంగ్కార్న్(71) రెండో కుమారుడు యువరాజు వచరేసార్న్ వైవాచారవాంగ్సే(42) సుమారు 27 ఏళ్ల తర్వాత రాజయానికి తిరిగొచ్చారు. ఆయనకు రాకను పురస్కరించుకుని స్వాగతం పలికేందుకు బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా శ్రేయోభిలాషులు తరలి వచ్చారు. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn who has been living in New York, has reportedly returned to Thailand. This was a video posted and widely shared on social media. pic.twitter.com/vYPNOdUBjs — Thai Enquirer (@ThaiEnquirer) August 6, 2023 న్యూయార్క్ లో ఒక న్యాయ సంస్థలో పనిచేస్తున్న వచరేసార్న్ వైవాచారవాంగ్సే చాలా కాలం తర్వాత తిరిగి రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతేడాది డిసెంబరులో థాయ్ మహారాజు పెద్ద కుమార్తె యువరాణి బజ్రకితీయాబా మహిడాల్(44)మైకో ప్లాసం ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కోమాలో ఉన్నారు. ఆమెను పరామర్శించడానికి వచ్చారా లేక రాజా కుటుంబం వారసత్వాన్ని కొనసాగించడానికి వచ్చారా అన్నదే అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. Vacharaesorn Vivacharawongse, a son of His Royal Highness King Vajiralongkorn, expressed during his visit to the 2infamily Foundation, a foundation for child care in Khlong Toei, that returning to #Thailand after 27 years of living abroad was like a dream come true. He stated… pic.twitter.com/lZ4h4WLCIV — Thai Enquirer (@ThaiEnquirer) August 8, 2023 ఇదిలా ఉండగా యువరాజు థాయ్లాండ్ వస్తూనే ఓ స్వచ్చంద కార్యక్రమంలో పాల్గొని నిర్భాగ్యులైన పిల్లలను, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మరుసటి రోజున ఆయన దేశం(రాజ్యం)లోని ఎమరాల్డ్ బుద్ధుడి దేవాలయం తోపాటు అనేక దేవాలయాలను సందర్శించారు. రాత్రి ఒక ఆటో రిక్షాలో ప్రయాణిస్తూ ఫోటో తీసుకున్న ఆయన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కింద 'బ్యాంకాక్ టుక్ టుక్' అని క్యాప్షన్ కూడా రాశారు. థాయ్లాండ్ మహారాజు వజిరాలాంగ్కార్న్ కు నలుగురు భార్యలు ఏడుగురు సంతానం. 2016లో పట్టాభిషక్తుడైన ఆయన రెండో భార్య సుజరిణీ వైవాచారవాంగ్సేకు కలిగిన కుమారుడే వచరేసార్న్ వైవాచారవాంగ్సే. యువరాణి చాలాకాలంగా కోమాలో ఉండటంతో దుఃఖసాగరంలో ఉన్న రాజకుటుంబంలో యువరాజు రాకతో ఒక్కసారిగా సంతోషాలు వెల్లివిరిశాయి. ఇది కూడా చదవండి: భారత్లో జరిగే జీ-20 సదస్సులో అదే హాట్ టాపిక్ -
రాజాధిరాజ.. రాజ మార్తాండ..
రాజుగారు వెళ్తున్నారంటే మరి మాటలా.. రాజాధిరాజ దండకాలు.. విచ్చేస్తున్నారహో అంటూ సైనికుల గర్జనలు.. అన్నీ కామనేగా.. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో ఆదివారం దాదాపు అలాంటి సీనే రిపీటైంది. మూడ్రోజుల మహాపట్టాభిషేక మహోత్సవంలో భాగంగా థాయ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ సమీపంలోని ప్రముఖ బౌద్ధాలయాల్లో పూజలు చేయడానికి గ్రాండ్ ప్యాలెస్ నుంచి తన పరివారంతో ఇలా పల్లకీలో అంగరంగ వైభవంగా తరలివెళ్లారు. దీంతో రాజుగారిని చూడ్డానికి జనం వీధివీధినా పోటెత్తారు. శనివారం మహా వజిరా అధికారికంగా థాయ్ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. 70 ఏళ్ల క్రితం మహా వజిరా తండ్రికి పట్టాభిషేకం జరిగింది. చాన్నాళ్ల తర్వాత దేశంలో ఈ వేడుక జరుగుతుండటంతో థాయ్లాండ్లో పండుగ వాతావరణం నెలకొంది. -
ఈ రాజు లక్షన్నరమంది ఖైదీలను ఏం చేస్తారో?
బ్యాంకాక్: థాయిలాండ్ కొత్త రాజు మహా వజ్రలాంకార్న్ దయామయుడిగా మారబోతున్నారు. ఆయన దాదాపు లక్షన్నర మంది నేరస్తులకు క్షమా భిక్ష పెట్టనున్నారు. శిక్షల స్థాయిని తగ్గించడమో, మొత్తానికే రద్దు చేయడమో వంటి చర్యలకు దిగబోతున్నారు. ఈ నేరస్తుల్లో రాజద్రోహానికి పాల్పడిన వారు, అత్యంత కఠినమైన చట్టాల కింద అరెస్టయిన వారు కూడా ఉన్నారు. రాజుగా వజ్రలాంకార్న్ ఈ నెల(డిసెంబర్) 1న కిరీటం ధరించారు. తండ్రి భూమిబోల్ అదుల్యాదేజ్ గత అక్టోబర్ 13న కన్నుమూయడంతో ఆయన స్థానంలో రాజుగా వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరస్తుల విషయంలో ఆయన ముందుకు వచ్చిన అతిపెద్ద అవకాశం ఇదేనని రాయల్ గెజిట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొత్తం లక్షన్నరమంది ఖైదీల జాబితా సిద్ధంగా ఉందని, వీరు విడుదలకావడమో, లేక శిక్షా కాలాన్ని తగ్గించడమోనన్న నిర్ణయం రాజు చూపించే దయపైనే ఆధారపడి ఉందని ఆ ప్రకటన పేర్కొంది. అయితే, వారు ఇప్పటికే అనుభవించిన శిక్షా కాలం, ప్రవర్తన, వయసు ఆధారంగానే రాజు తుది నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిపింది.