breaking news
khila
-
భువనగిరి ఖిలాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: భువనగిరి ఖిల్లాపై ఆదివారం పలువురు యువతీ, యువకులకు రాక్క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పలు కంపెనీలకు చెందిన 50 మందికి కోచ్ శేఖర్బాబు రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు వారు తాళ్ల సాయంతో కోటపైకి ఎక్కి కొద్ది సేపు సేదతీరారు. -
ఖిలాపై పర్యాటకుల సందడి
భువనగిరి టౌన్ : భువనగిరి ఖిలాకు రోజురోజుకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సెలవు దినం వస్తే ఖిలా మొత్తం పర్యాటకులతో సందడిగా మారుతుంది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పలు కళాశాలలు, పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ఖిలాను సందర్శన కోసం క్యూ కట్టారు. ఖిలాపై ఉన్న పురాతన కట్టడాలను చూసి ఉత్సాహంగా గడిపారు. ఈ ఒక్క రోజు సుమారు.1500 మందికి పైగా పర్యాటకులు సందర్శించినట్లు నిర్వాహకులు శేఖర్రెడ్డి తెలిపారు. -
భువనగిరి ఖిలాపై పర్యాటకులు సందడి
భువనగిరి టౌన్: భువనగిరి ఖిలా ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు జిల్లాలోని పలు మండల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష అనంతరం మధ్యాహ్నం కోటను సందర్శించారు. సుమారు 14 వందల మంది కోటను సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు ఖిలాపైన ఉన్న చారిత్రక కట్టడాల గురించి తెలుసుకోవడం పాటు, సెల్ఫీలు తీసుకున్నారు. -
కొనసాగుతున్న మట్టి తవ్వకాలు
భువనగిరి : పట్టణ శివారులోని సీతానగర్లో గల ఖిలా కోటగడ్డకు సంబంధించిన మట్టిలో వారం రోజులుగా జరుగుతుండగా ఆదివారం పురాతన కాలం నాటి దేవతా మూర్తుల విగ్రహాలు, రాతి స్తంభాలు బయటపడ్డాయి. ఇందులో నాగభైరవుడి విగ్రహం కూడాఉంది. జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా ఈ ఘటన వెలుగుచూసింది. పక్కనే ఉన్న వెంచర్లో మట్టి నింపడానికి ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ సమయంలో బయటపడ్డ పురాతన చరిత్రకు సంబంధించిన రాతి స్తంభాలను వెంచర్లకు తరలించారు. విషయం బయటకు పొక్కడంతో ట్రాక్టర్ ద్వారా మళ్లీ యథా స్థానంలోకి తెచ్చారు. తవ్వకాల్లో చిన్నచిన్న దేవాలయాలు ధ్వంసమైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నాగ భైరవుడి విగ్రహానికి పూజలు పాముల ఆ¿¶ రణాలతో అలంకరించబడి ఉన్న నాగభైరవుడి విగ్రహానికి చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ సుర్విలావణ్య, కౌన్సిలర్లు, రఘునాథ్, బోగవెంకటేష్, కాంగ్రెస్ నాయకులు దర్గాయి హరిప్రసాద్ తదితరులు పూజలు చేశారు. గుప్త నిధులు దొరికాయని ప్రచారం కోటగడ్డ తవ్వకాల్లో గుప్త నిధులు లభించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దేవాలయానికి సంబంధించిన రాతి స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు బయటపడినందున గుప్త నిధులు కూడా దొరికి ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాలు జరిపిన చోట పోలీసు నిఘా ఉంచాలని కోరుతున్నారు. ఆలయాన్ని పునర్నించాలి –తోట భానుప్రసాద్, వీహెచ్పీ జిల్లా కార్యదర్శి కోటగడ్డ మట్టి తవ్వకాల్లో ధ్వంసమైన ఆలయాన్ని పునర్నించాలి. ఆలయం ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. మూడు రోజులుగా జరుగుతున్న మట్టి తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని విగ్రహాలు తరలిపోయాయి. ఈ ఉదంతంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.