breaking news
kerala ban
-
కేరళను ఫాలో అవుతున్న కర్ణాటక!
బెంగళూరు: మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కేరళ రాష్ట్రాన్ని కర్ణాటక కూడా అనుసరిస్తోంది. కేరళతో సహా మొత్తం అయిదు రాష్ట్రాల్లో మ్యాగీపై నిషేధాన్ని విధించిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సైతం మ్యాగీ అమ్మకాలను నిషేధించే దిశగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ షాపింగ్ మాల్స్, దుకాణాల నుంచి మ్యాగీ శాంపిల్స్ను రాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధికారులు సేకరించి, పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల నివేదిక అందిన అనంతరం కర్ణాటకలో మ్యాగీ అమ్మకాలను కొనసాగించాలా లేక నిషేధించాలా అనే అంశంపై రాష్ట్రా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాగా కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. -
మ్యాగీ నూడుల్స్ను నిషేధించిన కేరళ
కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్కు సూచించారు. నూడుల్స్ నాణ్యత మీద ఒక స్పష్టత వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పైర సరఫరాల కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటివరకు అమ్ముడుపోకుండా మిగిలిన నిల్వలను నెస్లె కంపెనీకి తిప్పి పంపేస్తారు. కేరళ పౌరసరఫరాల కార్పొరేషన్కు ఆ రాష్ట్రంలో 1355 ఔట్లెట్లు ఉన్నాయి.