breaking news
Kavyasri
-
బిగ్బాస్ నుంచి ఢీ 13 వరకు: తాండూరు మెరికలు.. బుల్లి తెరపై మెరుపులు
తాండూరుకు చెందిన యువ కళాకారులు బుల్లితెరపై తళుక్కున మెరుస్తున్నారు. ప్రఖ్యాత టెలివిజన్ షోలల్లో సత్తాచాటుతూ జిల్లాకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. వీరిలో ఒకరు ఢీ– 13లో టైటిల్ సాధించగా, మరొకరు గతేడాది నిర్వహించిన బిగ్బాస్– 4లో టాప్– 5 ఫైనలిస్ట్ల్లో నిలిచారు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు. తాండూరు టౌన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన దువచర్ల మహేశ్– పద్మావతి దంపతుల కూతురు కావ్యశ్రీ ఇటీవల ముగిసిన ఢీ– 13 విన్నర్గా నిలిచింది. కావ్యశ్రీ తండ్రి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరికి నలుగురు ఆడపిల్లలు. అమ్మాయిలు ఇంటికే పరిమితం కావాలనే ధోరణి నుంచి వారికి నచ్చిన రంగాల్లో రాణించేలా పిల్లలను ప్రోత్సహించారు. దీంతో కావ్యశ్రీ తనకిష్టమైన డ్యాన్స్ను ఎంచుకుంది. ప్రస్తుతం తాండూరులోని భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కావ్యశ్రీ ఓ శుభకార్యంలో చేసిన డ్యాన్స్ను చూసిన మాస్టర్ ఆమెకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఢీ షో కోసం సైడ్ డ్యాన్సర్గా చేరింది. మాస్టర్ పల్టీ రవి ఆధ్వర్యంలో అక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. 2015లో ఢీ– జూనియర్స్ సీజన్– 2లో గ్రూప్ డ్యాన్సర్గా చేసింది. తల్లిదండ్రులతో కావ్యశ్రీ అనంతరం ఢీ– 13లో కంటెస్టెంట్గా వైల్డ్కార్డు ఎంట్రీతో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి వెనుకడుగు వేయకుండా తన డ్యాన్స్లతో అదరగొట్టి, ఫినాలేలోకి అడుగు పెట్టింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమె ఈనెల 8వ తేదీన నిర్వహించిన ఢీ–13 ఫైనల్లో విన్నర్గా నిలిచింది. సినీ హీరో అల్లు అర్జున్ చేతుల మీదుగా టైటిల్తో పాటు ప్రైజ్ మనీ అందుకుంది. } ఢీ–13లో స్టేజ్పై డ్యాన్స్ చేస్తున్న కావ్యశ్రీ మంచి కొరియోగ్రాఫర్ కావడమే లక్ష్యం చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. అదృష్టవశాత్తు ఢీ– 13లో అవకాశం దక్కింది. నన్ను ప్రోత్సహించిన డైరెక్టర్ శ్రీకాంత్, మాస్టర్లు శ్రీను, రాముకు రుణపడి ఉంటా. ఫైనల్లోకి ప్రవేశించి.. టైటిల్ సాధించడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మంచి కొరియోగ్రాఫర్గా రాణించాలనేదే నా లక్ష్యం. – కావ్యశ్రీ, ఢీ– 13 టైటిల్ విన్నర్ బిగ్బాస్ షోలో అదరగొట్టిన అరియానా గతేడాది జరిగిన బిగ్బాస్– 4 రియాల్టీ షోలో తాండూరు అమ్మాయి అరియానా గ్లోరీ మెరిసింది. 105 రోజుల పాటు కొనసాగిన ఈ పోటీలో టాప్– 5 పోటీదారుల్లో నిలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫైనల్ వరకు గట్టి పోటీ ఇచి్చంది. తాండూరు మండలం అంతారానికి చెందిన సత్యనారాయణ, శశికళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. సత్యనారాయణ ఫొటోగ్రాఫర్ కాగా శశికళ నర్స్గా పనిచేసి రిటైరయ్యారు. వీరి చిన్న కూతురు అరియానా ఇంటర్ వరకు తాండూరులో అభ్యసించింది. కూకట్పల్లిలోని ప్రగతి కళాశాలలో డిగ్రీ చదివింది. తాండూరులో అభిమానులకు అభివాదం చేస్తున్న అరియానా (ఫైల్) అల్లు అర్జున్ చేతుల మీదుగా క్యాష్ ప్రైజ్ తీసుకుంటున్న కావ్యశ్రీ చిన్ననాటి నుంచి చురుకైన అమ్మాయిగా పేరున్న అరియానా తనలోని ప్రతిభను చాటిచెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంది. స్టూడియో వన్, జెమినీ కామెడీ, కెవ్వు కేక, జింగ్ జింగ్ అమేజింగ్ తదితర టీవీ షోలకు వ్యాఖ్యాతగా పనిచేసింది. తన కళాత్మక దృష్టిని యూట్యూబ్ ద్వారా అందరికీ పరిచయం చేసింది. ఈ క్రమంలో బిగ్బాస్– 4 నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. తొలిరోజు నుంచి తన చురుకైన∙ప్రదర్శనలతో టాప్ ఫైవ్ అభ్యర్థుల్లో నిలిచింది. బిగ్బాస్లో వచ్చిన ప్రైజ్మనీతో ఇల్లు కట్టుకోవడంతో పాటు గ్రామంలోని రైతులకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం టీవీ కార్యక్రమాలకు యాంకర్గా చేస్తున్న అరియానా మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిద్దాం. -
ఆ పంటిని పీకిస్తే... పక్కనున్న పళ్లు కూడా కదులుతాయా?
నా వయసు 16. నా కుడి దవడలో ఒక పన్ను పుచ్చిపోయి, దుర్వాసన వస్తోంది. డాక్టర్ను కలిస్తే దాన్ని పీకేయడం మినహా మరో మార్గం లేదన్నారు. అయితే అలా చిన్నవయసులోనే పళ్లు పీకేయిస్తే, పక్కనున్న పళ్లు కూడా కదిలిపోతాయని మా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు మాత్రం ఈ సమస్యతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. నేను ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు. - కావ్యశ్రీ, ఆదిలాబాద్ పన్ను పుచ్చినప్పుడు లేదా పంటికి రంధ్రం పడినప్పుడు మనం తీసుకునే ఆహారం ఆ సందుల్లో ఇరుకుతుంది. దానికి చికిత్స చేయనప్పుడు అది కుళ్లిపోయి, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అవి సల్ఫర్ సంబంధిత వాయువులను విడుదల చేస్తూ చెడువాసనకు కారణమవుతాయి. కాబట్టి పన్ను పుచ్చితే వెంటనే దానికి చికిత్స చేయించాలి. మీ విషయంలో స్నేహితులు చెబుతున్న మాటలు తప్పు. పుచ్చుపన్ను పీకినప్పుడు పక్కన ఉన్న పళ్లు కదిలిపోవడం, కంటి నరాలు లేదా మెదడులోని నరాలు దెబ్బతింటాయనడం పూర్తిగా అపోహే. పిప్పిపంటికి చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల పక్కనున్న పళ్లు కూడా దెబ్బ తింటాయన్నది వాస్తవం. మీరు వెంటనే దంతవైద్యుని కలిసి వారి సలహా మేరకు రూట్కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవడమో లేదా దానిని పీకించడమో చేయాలి. ఒకవేళ పన్ను పీకిస్తే ఆ స్థానంలో శాశ్వత దంతాన్ని అమర్చుకోవచ్చు. నా వయసు 72. నా పైదవడలో కుడివైపున రెండుపళ్లు మినహా అన్నీ అరిగి విరిగిపోయాయి. మిగిలిన ముక్కలు చిగుళ్లలోనే ఉండిపోయాయి. కింది దవడలో ఉన్న మూడు పళ్లు కదులుతూ, ఎప్పుడైనా ఊడిపోయేలా తయారైనాయి. దాంతో నేను సరిగా నమిలి తినలేకపోతున్నాను. మాట కూడా స్పష్టంగా రావట్లేదు. ఈ వయసులో నేను కట్టుడుపళ్లు పెట్టించుకుంటే సరిగా పని చేస్తాయా? సలహా ఇవ్వండి. - వి.అవధాని, మచిలీపట్నం మీరు నోటిలో మిగిలిన పళ్లను కూడా పూర్తిగా పీకించేసి, వాటిస్థానంలో కొత్త పళ్ల సెట్ అమర్చుకోవడం ఉత్తమం. ఇందుకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా తీసి పెట్టుకోగలిగే పళ్ల సెట్ ఉంటుంది. అది ఇబ్బంది అనుకుంటే శాశ్వతంగా ఉండే డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చుకోవచ్చు. అయితే మీ దవడ కండరాలలో తగిన పటుత్వం ఉన్నప్పుడే వాటిని అమర్చగలగడం సాధ్యం అవుతుంది. పైగా ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న చికిత్స. మీరు ముందు మంచి డెంటిస్ట్ను కలిసి వారి సలహా మేరకు మీకు అనువైన చికిత్స తీసుకోండి. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్