breaking news
kanthanapally project
-
954.2 టీఎంసీలకూ లెక్క
గోదావరిలో నీటి వాటా వినియోగంపై రాష్ట్ర ప్రణాళిక కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డుకు వివరాలు సమర్పణ ఇప్పటికే ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీల వినియోగం కొత్త ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు వినియోగంలోకి 45.38 టీఎంసీల వినియోగానికి కొత్త ప్రాజెక్టులు దుర్గంగుట్ట (కంతనపల్లి) అందులో భాగమేనని వివరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరిలో హక్కుగా కలిగిన వాటా మేరకు నీటి వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపు ఇచ్చింది. హక్కుగా ఉన్న 954.2 టీఎంసీల వాటాలో ప్రతి నీటి చుక్కనూ ఒడిసి పట్టేందుకు చేపట్టనున్న ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే వినియోగంలో ఉన్న 433.04 టీఎంసీల వాటాపోనూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. ఈ వివరాలను రాష్ట్ర నీటిపారుదలశాఖ... కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు పంపింది. గోదావరిపై ప్రాజెక్టుల రీ-ఇంజనీరింగ్తోపాటు వివిధ దశల్లో ఉన్న కొత్త ప్రాజెక్టులన్నీ తమ వాటాలోంచి నీటిని తీసుకునేందుకు ఉద్దేశించినవేనని స్పష్టం చేసింది. ఏపీ ఫిర్యాదుతో కదిలిన రాష్ట్రం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరిలో మొత్తంగా 1,480 టీఎంసీల నీటి వాటా హక్కుగా ఉండగా విభజన అనంతరం తెలంగాణకు 954.23 టీఎంసీల వాటా దక్కింది. నీటిని సమర్థంగా వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం రీ ఇంజీనీరింగ్ పేరిట కంతనపల్లి వంటి ప్రాజెక్టుల వాటాను పెంచింది. ఇందిరా, రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను సమీకృతం చేసి మరింత నీటిని వినియోగంలోకి తేవాలని భావిస్తోంది. దీంతోపాటే అదనంగా గోదావరిపై వరుస బ్యారేజీల నిర్మాణం చేసి ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కంతనపల్లి ప్రాజెక్టుతో గిరిజన ప్రాంతాల ముంపును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా దుర్గంగుట్ట వద్ద బ్యారేజీ నిర్మాణానికి సర్వే చేయిస్తోంది. అయితే ప్రాజెక్టుల రీ-ఇంజినీరింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. దుర్గంగుట్ట బ్యారేజీకి అనుమతులు లేవంటూ రెండు నెలల కిందట కేంద్రానికి లేఖలు రాసింది. దీనిపై కదిలిన సీడబ్ల్యూసీ, బోర్డు... నీటి వాటాలపై వివరణ ఇవ్వాలని తెలంగాణను ఆదేశించింది. దీనికితోడు గోదావరిలో హక్కుగా ఉన్న 954 టీఎంసీల్లో నిర్మితమైన, నిర్మితమవుతున్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టుల్లో కలిపి మొత్తంగా 628.64 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోనున్నారని, మిగతావన్నీ మిగులు జలాలేనని జాతీయ జలాభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) తేల్చిచెబుతోంది. ఈ లెక్కలు తప్పని రాష్ట్రంలో మొత్తంగా 773 టీఎంసీల మేర నీటి వినియోగం ఉంటుందని రాష్ట్రం రెండు నెలల కిందటి వరకు చెబుతూ వచ్చింది. అయితే తాజాగా ఏపీ ఫిర్యాదు, కేంద్రం ఆదేశాల నేపథ్యంలో గోదావరిపై ఇప్పటికే ఉన్న, భవిష్యత్తులో వినియోగంలోకి తేనున్న నీటి వాటాలు హక్కుగా సంక్రమించిన వాటాకు సరిసమానమని స్పష్టం చేస్తూ నివేదిక సమర్పించింది. కొత్తగా 521.17 టీఎంసీల కోసం ప్రణాళిక... రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులతో మొత్తంగా 433.04 టీఎంసీల వినియోగం జరుగుతున్నట్లు అధికారుల నివేదిక చెబుతోంది. ఇందులో గోదావరి జీ-4 బేసిన్లో నిజాంసాగర్, సింగూర్, పోచారం, ఘనఫూర్ తదితర ప్రాజెక్టుల కింద 104.63 టీఎంసీలు వినియోగంలో ఉండగా జీ-5లో ఎస్సారెస్పీ-1, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, గుత్ప ప్రాజెక్టుల కింద 135.44 టీఎంసీలు, ఇదే బేసిన్లో ఎస్సారెస్పీ దిగువన ఉన్న ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ తదితర ప్రాజెక్టుల కింద 39.33 టీఎంసీలు, జీ-6లో దిగువ, ఎగువ మానేరు, శనిగరం ప్రాజెక్టుల కింద 60.88 టీఎంసీలు, జీ-7లో దిగువ పెన్గంగ, సాత్నాల వంటి మధ్య తరహా ప్రాజెక్టుల కింద 32.33 టీఎంసీలు, జీ-9లో పెద్దవాగు, నీల్వాయి వంటి ప్రాజెక్టుల కింద 11.54 టీఎంసీలు, జీ-10లో దేవాదుల సహా ఇతర ప్రాజెక్టుల కింద 51.77 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నట్లు లెక్కలు తేల్చారు. ఇక నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులతో మొత్తంగా 475.79 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేనున్నట్లు వివరించారు. ఇందులో ప్రధానంగా ఎస్సారెస్పీ-2 22.99 టీఎంసీలు, వరద కాల్వ-19.27, ఎల్లంపల్లి -60, ప్రాణహిత-160, కంతనపల్లి-100, దేవాదుల -60 టీఎంసీలతో చేపట్టినట్లు తెలిపారు. ఇక మరో 45.38 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో మోదికుంట వాగు-3.2 టీఎంసీలు, సంగంపల్లి-1.8, మందమర్రి 1.7, దిగువ పెన్గంగ-5.12 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టేవిగా చూపారు. నిర్మాణం పూర్తయిన వాటిని మినహాయిస్తే కొత్తగా 521.17 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళికలు వేసినట్లుగా నివేదిక ద్వారా తేల్చి చెప్పారు. -
గోదావరి నీటిపై కొత్త పేచీ!
* తెలంగాణలో ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు * నీటి లభ్యత లేని సమయాల్లో దిగువన పరిస్థితేంటని వాదన * గోదావరి బోర్డుకు నివేదించాలని నిర్ణయం.. 23న బోర్డు భేటీలో చర్చకు వచ్చే అవకాశం * గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి నీటిని ఎగువన తెలంగాణ రాష్ర్టమే పూర్తిగా వాడేసుకుంటే దిగువన ఉన్న తమ రాష్ర్ట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా గోదావరిలో నీటి లోటు ఉండే సమయాల్లో లభ్యమయ్యే నీటినంతా ఎగువ రాష్ర్టమే వినియోగిస్తే.. దిగువ రాష్ర్ట అవసరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో నీటి లోటు అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వచ్చే నీటిని తెలంగాణ ప్రాజెక్టుల నుంచి దిగువకు వదలకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ రాష్ర్ట ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో లోటు సమయాల్లో నీటి కేటాయింపులు ఎలాగన్న దానిపై ముందుగా తేల్చాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆశ్రయించేందుకు ఏపీ సిద్ధమవుతోంది. ఈ నెల 23న జరిగే గోదావరి బోర్డు సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నదిలో నికరంగా ఏటా 1,200 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుండగా 900 టీఎంసీల మేర తెలంగాణ, మరో 300 టీఎంసీలను ఏపీ వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ మొత్తం నీటిలో ప్రాణహిత-చేవెళ్లకు 160 టీఎంసీల కేటాయింపులు ఉండగా, కంతనపల్లి ప్రాజెక్టుకు మరో 50 టీఎంసీలను కేటాయించారు. ప్రాణహితతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గోదావరి నికర, మిగులు జలాలు వాడుకునేందుకు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 22.5 టీఎంసీల నీటి నిల్వకు సంకల్పించారు. దీని ద్వారా తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో 7.50 లక్షల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముంది. అయితే గోదావరి నదీప్రవాహం ప్రాణహిత, కంతనపల్లిని దాటి దిగువన ఏపీ నిర్మిస్తున్న పోలవరానికి రావాల్సి ఉంది. కంతనపల్లికి ఎగువన ఛత్తీస్గఢ్లో ఉన్న ఇంద్రావతిలో 300 టీఎం సీల మేర మిగులు జలాలు ఉండగా అవన్నీ కాళేశ్వరం వద్ద గోదావరిలోనే కలుస్తాయి. ఈ మిగులు జలాలను ఆధారం చేసుకొంటే.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కంటే ఎక్కువే దక్కుతాయని ఏపీ వాది స్తోంది. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ గోదావరి బోర్డుకు నివేదించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి గట్టి జవాబివ్వాలని తెలంగాణ నిర్ణయించింది. సీలేరు, శబరిల్లో భారీ ప్రవాహాలు ఉంటాయని, గోదావరిలో లభించే నీటితో పోలిస్తే దిగువనే ఎక్కువ నీరు లభిస్తుందని, ఈ దృష్ట్యా ఏపీకి నష్టమేమీ లేదని తెలంగాణ వాదిస్తోంది.