breaking news
kailasnath
-
కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం
ఎల్లోరా గుహలు గురించి చాలామంది ఎన్నోసార్లు విని ఉంటారు, ఒకటి – రెండు సార్లయినా చూసి ఉంటారు కూడా. ఆ గుహల్లో ఒక శిలాగ్రంథం ఉంది. ఇది శివుడికి అంకితం చేసిన కైలాస్నాథ్ ఆలయం. కానీ రామాయణ, మహాభారత గ్రంథాలకు శిల్పరూపం ఈ ఆలయం. ఎల్లోరా గుహల్లో చెక్కిన ఏకరాతి ఆలయమే ఈ కైలాసనాథ్ ఆలయం.నంబర్ 16... కట్టిపడేసే గుహఎల్లోరా గుహలను ఏ కొండల్లో చెక్కారు? సమాధానం కొంచెం కష్టమే. ఎందుకంటే అవి మనకు ఎల్లోరా గుహలుగానే తెలుసు. ఆ గుహలను చరణాద్రి కొండల్లో చెక్కారు. సహ్యాద్రి శ్రేణుల్లో ఒక భాగం చరణాద్రి కొండలు. మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఎల్లోరా గుహలనగానే బౌద్ధ చైత్య, విహారాలే గుర్తొస్తాయి. కానీ ఈ గుహలు బౌద్ధ, హిందూ, జైన మతాల విశ్వాసాలకు ప్రతీకలు. ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు, 13 నుంచి 29 వరకు హిందూ గుహలు, 30 నుంచి వరకు 34 జైన గుహలు. కైలాస్నాథ్ ఆలయం 16వ గుహలో ఉంది. ఇవన్నీ ఏకకాలంలో చెక్కినవి కాదు.ఎల్లోరా గుహలు వందకు పైగా ఉన్నాయి. కానీ పర్యాటకులకు అనుమతి 34 వరకే. ఇవన్నీ ఒకేసారి చెక్కినవి కాదు. 8, 9,10 శతాబ్దాల్లో చెక్కిన గుహలు. కైలాస్నాథ్ గుహాలయాన్ని మాత్రం రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుని కాలంలో క్రీ.శ 756 – 773 మధ్యకాలంలో చెక్కారు. రాజు తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు రాణి ఆయన ఆరోగ్యం కోసం శివుడిని ప్రార్థించిందని, కైలాసాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కిందని చెబుతారు. రాజు ఆరోగ్యవంతుడైన తర్వాత కోకస శిల్పి పర్యవేక్షణలో కైలాస్నాథ్ ఆలయం రూపుదిద్దుకుంది. ఎల్లోరా పర్యాటకులు 33 గుహలకు కేటాయించినంత సమయం 16వ గుహలో గడుపుతారు. ఉత్తరాది ఆలయాలను చూసిన కళ్లకు ద్రవిడ శైలిలో చెక్కిన ఈ ఆలయం కనువిందు చేస్తుంది..గ్రంథాలకు శిల్పరూపంప్రత్యేకించి ఈ ఆలయం పొడవు 164 అడుగులు, వెడల్పు 109 అడుగులు, ఎత్తు 98 అడుగులు. ఏకరాతి ఆలయం అంటే చిన్నదో లేదా ఒక మోస్తరు ఆలయమో అనుకుంటాం. కానీ ఈ ఆలయాన్ని పూర్తిగా శిల్పసౌందర్యాన్ని ఆస్వాదిస్తూ తిలకించడానికి మూడు గంటలు కేటాయించాలి. భారతీయ శిల్పచాతుర్యానికి గీటురాయి ఇది. ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. ఒక్కో ΄పార్శ్వంలో ఒక్కో ΄పౌరాణిక గ్రంథాన్ని చూడవచ్చు. 14 కాండల రామాయణం ఒక గోడలో, 18 పర్వాల మహాభారతం మరో గోడలో శిల్పాల రూపంలో ఒదిగిపోయాయి. ఇన్ని ప్రత్యేకతలున్నప్పుడు యునెస్కో గుర్తించకుండా ఉంటుందా? ఎల్లోరాను 1983లోనే గుర్తించింది..ఈ సెలవుల్లో వెళ్లాలి!శిరిడీ, ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు సాధారణంగా వేసవి సెలవుల టూర్ ప్లాన్లో ఉంటాయి. కానీ వేసవిలో గుహల్లో పర్యటన కష్టం. గుహలోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ బయటకు రాగానే భరించలేనంత వేడితో సతమతమవుతాం. కాబట్టి దక్కనులో గుహల పర్యటనకు ఈ సీజన్ బాగుంటుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కొత్త రాజధాని బెజవాడే బెస్ట్
ఆరు దశాబ్దాల క్రితమే చెప్పిన వాంఛూ కమిటీ మళ్లీ చర్చనీయాంశమైన ఆ నివేదిక అన్ని విధాలా అనువైన ప్రాంతంగా తేల్చిన వాంఛూ ఆనాటి కుటిల రాజకీయాలే మళ్లీ పునరావృతమవుతాయా? సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన ఘట్టం ముగియడంతో సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఎక్కడ అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఐదారు ప్రాంతాల వారు తమ జిల్లాల్లోనే రాజధాని ఏర్పాటుచేయాలనే డిమాండు ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో చర్రిత పుటల్లోకి తొంగిచూస్తే 1952, 53ల్లో నెలకొన్న పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమైనట్లు అనిపిస్తుంది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారు విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన రోజులవి. ఇప్పటి మాదిరిగానే అప్పుడు రాజధాని ఎక్కడ అనే చర్చ సాగింది. చాలామంది వాల్తేరు-విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆహ్లాదకరమైన వాతావరణం, రాజధానికి కావలసిన హంగులు, వివిధ కార్యాలయాలు నెలకొల్పుకోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలే ఆ అభిప్రాయం వ్యక్తం కావడానికి కారణం. ఇందుకు భిన్నంగా వాంఛూ కమిటీ తన నివేదిక అందజేసింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదికను జనం మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. నూతన ఆంధ్ర రాష్ట్రం- ఆర్థిక, ఇతర అంశాలపై వాంఛూ కమిటీ కేంద్రానికి సమగ్ర నివేదిక ఇచ్చింది. అలహాబాద్ చీఫ్ జస్టిస్ కైలాస్నాథ్ వాంఛూ నేతృత్వంలో నలుగురు సభ్యులతో ఈ కమిటీని 1952 డిసెంబరు19న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాయలసీమ, కోస్తాంధ్రలో రెండు నెలలపాటు విస్తృతంగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసి 1953 ఫిబ్రవరిలో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కమిటీ ఏం చెప్పిందంటే.. ఆరు దశాబ్దాల క్రితమే ఈ కమిటీ.. ఆంధ్ర రాష్ట్ర రాజధాని విజయవాడ- గుంటూరు మధ్య ఏర్పాటుచేయాలని సూచించింది. ఇది అన్ని విధాలా హేతుబద్ధమైనదని, శాస్త్రీయమైనదని కూడా స్పష్టంచేసింది. భౌగోళికంగా, ఇతర వసతులు పరంగా ఈ ప్రాంతం అనువైనదని పేర్కొంది. కొత్త రాష్ట్రం మధ్య భాగంలో విజయవాడ-గుంటూరు ప్రాంతం ఉందని, రైల్వే జంక్షన్, వివిధ ప్రాంతాలతో రోడ్డు మార్గాల అనుసంధానం కలిగి ఉందని వెల్లడించింది. కృష్ణానది జలాల లభ్యతను కూడా ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. భూగర్భ, నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో కొత్త రాష్ట్ర రాజధానిగా ఈ ప్రాంతం ఎంపిక సశాస్త్రీయమని తేల్చింది. ఇదే ప్రాతిపదికలు నేడు కూడా వర్తిస్తాయనడంలో సందేహంలేదు. సీమాంధ్రలోని 13 జిల్లాలకు అన్ని విధాలా మధ్యస్థ ప్రాంతంగా బెజవాడ ఉంది. రైలు, రోడ్డు మార్గాలు అభివృద్ధి చెందాయి. గన్నవరం ఎయిర్పోర్టు అందుబాటులో ఉంది. దాన్ని విస్తరించుకోవడం సులువైన పని. అంతేకాదు, సచివాలయం, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీని ఖాళీ చేయిస్తే సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖలకు కావాల్సిన వసతి ఏర్పాటుచేసుకోవచ్చు. ఇలా ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్ర రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు బెజవాడకు ఉన్నాయి. కుటిల రాజకీయాలు ఆనాడు విజయవాడ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండడం, రాయలసీమ ప్రాంతవాసులు తమకే రాజధాని కావాలని డిమాండు చేయడంతో కర్నూలు రాజధానిగా ఏర్పాటుచేశారు. అయితే అక్కడ కనీస వసతులు లేక గుడారాలు వేసి కార్యాలయాలు పెట్టి నానా అవస్థలు పడిన చరిత్ర మరవలేనిది. ఆనాడు విజయవాడకు రాజధానిగా అవకాశం లేకుండా చేయడంలో నీలం సంజీవరెడ్డి, జవహర్లాల్ నెహ్రూ కీలకపాత్ర పోషించారనే వాదనలు ఉన్నాయి. రాజధానిగా కర్నూలు ఉండాలా.. విజయవాడ ఉండాలా అనే అంశంపై మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఈ ప్రాంత శాసనసభ్యుల మధ్య ఓటింగ్ జరిగింది. కేవలం ఒక ఓటు తేడాతో కర్నూలు ఎన్నుకునానరు. కర్నూలుకు అనుకూలంగా 80, విజయవాడకు 79 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా తొంటి రాజకీయమే జరిగింది. మద్రాసు రాష్ట్రానికి చెందిన ఐదుగురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతోపాటు ప్రకాశం పంతులు, ఎన్జీరంగా నేతృత్వంలో గుంటూరు ప్రాంతానికి చెందిన ఏడుగురు సభ్యులు కర్నూలుకు అనుకూలంగా ఓటు చేశారు. ఇలా విజయవాడకు చరిత్రలో తీరని అన్యాయం జరిగింది. అదే విజయవాడే రాజధాని అయి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా రాజధాని మారకుండా ఉండేదని, నేడు రాష్ట్ర విభజనకు ఆస్కారమే ఉండేది కాదనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అటువంటి రాజకీయాలే చోటుచేసుకుంటున్నాయి. కొందరు విశాఖపట్నం, మరికొందరు కర్నూలు లేదా ఒంగోలు జిల్లాలో రాజధాని ఉండాలనే వాదనలు తీసుకువస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా ఈసారి మరో పొరపాటు చేయకూడదని పలువురు మేధావులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వాణిజ్య, రవాణా రాజధానిగా ఉన్న విజయవాడను కొత్త రాష్ట్ర రాజధానిగా ఎంపికచేస్తే అన్ని విధాలా అభివృద్ధి ఊతంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు. -
మైనర్పై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
ఇంకొల్లు, న్యూస్లైన్ : పద్నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఇంకొల్లు పోలీసుస్టేషన్ పరిధిలోని తిమ్మసముద్రం ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 9వ తరగతి చదువుతోంది. బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బుర్రా వీరాస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే బాలిక తల్లి మృతి చెందటంతో అమ్మమ్మ,తాతయ్యల వద్దే ఉంటూ చదువుకుంటోంది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలిక ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా ఆటో డ్రైవర్ వీరాస్వామి వెళ్లి మంచినీరు అడిగాడు. తెలిసిన వ్యక్తి కావటంతో బాలిక వంటింట్లోకి వెళ్లింది. వెనక నుంచి ఇంట్లోకి వచ్చిన వీరాస్వామి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక పెద్దగా అరుస్తూ బయటకు వచ్చింది. అనంతరం పొలం నుంచి వచ్చిన అమ్మమ్మ,తాతయ్యలకు విషయం చెప్పింది. బాలిక తండ్రి గురువారం రాత్రి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ కైలాస్నాథ్ శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.