breaking news
K. Narayanana
-
హామీల అమలులో బీజేపీ విఫలం: నారాయణ
సాక్షి,హైదరాబాద్: బీజేపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు వివిధ అంశాలపై ఆత్మావలోకనం చేసుకోవడంలో ఆపార్టీ విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ప్రతీ కుటుంబానికి వారి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఏమైందని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నిం చారు. జీఎస్టీపై వ్యతిరేకత ఇటీవలి ఐదురాష్ట్రాల ఎన్నికల్లో కన్పించడంతో బీజేపీకి జ్ఞానోదయమైందన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం గోబెల్స్ గనుక వినుంటే ఆత్మహత్య చేసుకునేవాడని ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందంలో మోదీనే ఓ దళారిలా వ్యవహరించినప్పుడు ఇక మధ్యవర్తులతో ఎందుకని విమర్శించారు. శబరిమలలో మహిళలకు సమానహక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకించి బీజేపీ మహిళా వ్యతిరేకి అన్న ముద్ర వేసుకుందన్నారు. పౌరసత్వం గుర్తింపు అంశంలో ప్రభుత్వమే మత విభజనకు పూనుకుందన్నారు. న్యాయవ్యవస్థను బ్లాక్మెయిల్ చేయడమే లోక్సభ ఎన్నికలకు ముందే అయోధ్యలో రామాలయం కట్టి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ప్రకటించడం న్యాయవ్యవస్థను బ్లాక్మెయి ల్ చేయడమే అవుతుందని నారాయణ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ఈ నెలలోనే బాబ్రీమసీదు అంశం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ విధంగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. -
అదంతా కార్పొరేట్ మీడియా సృష్టే: నారాయణ
మదనపల్లె: ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని దేశమంతా సమర్థుడని కితాబునిస్తున్నారని, అయితే ఇదంతా కార్పొరేట్ మీడియా సృష్టించిన ప్రచారమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె. నారాయణ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలే మోడీకి ఎంతో దోహదపడ్డాయని చెప్పారు. మదనపల్లెకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉండగా రాజకీయాలు చేస్తూ ఇరు ప్రాంతాల్లో ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగానే సమస్యలను జఠిలం చేస్తూ ఉనికి కాపాడుకునేందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దివంగత సీపీఐ నేత చండ్రరాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను వచ్చేనెల 11వ తేదీ హైదరాబాదులో జరపనున్నట్టు నారాయణ తెలిపారు.