-
Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే..
కేవలం 14 రోజులు వర్క్ చేస్తే 9 లక్షల రూపాయలా..! ఫేక్ నోటిఫికేషన్ అని కొట్టిపారేస్తారేమో.. నిజమండీ! ఈ విధమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయీ జిందగీలో. ఉద్యోగవివరాలు ఇవే.. యూకే లోని ఎడిన్బర్గ్లో ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి తాజాగా విడుదలైంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు మొత్తం 14 రోజుల ఉద్యోగావకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏమిటంత ముఖ్యమైన జాబ్ అనే కదా అనుకుంటున్నారు..! చదవండి: ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ.. ఓ సంపన్న కుటుంబం క్రిస్టమస్ సెలవుల్లో పిల్లల్ని చూసుకోవడానికిగాను ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఐదేళ్ల కవల పిల్లల సంరక్షణకుగాను రోజుకు అక్షరాల 59 వేల రూపాయల జీతం చొప్పున.. మొత్తం 14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం ప్రకటించింది సదరు కుటుంబం. క్రిస్టమస్ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఫుడ్, బెడ్ అన్నీ అక్కడే. ఈ ఉద్యోగాంలో చేరిన ఆయా.. పిల్లలకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, వారితో ఆటలాడటం, నిద్ర పుచ్చడం.. వంటి పనులు చేయాలి. అంతేకాదు దరఖాస్తు దారులకు ఖచ్చితంగా పిల్లల సంరక్షణలో ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. వింతగా అనిపించినా.. పిల్లల సంరక్షణకు ఆ తల్లీదండ్రులు ఎంత కేర్ తీసుకుంటున్నారో కదా! చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
బంపర్ఆఫర్: కరోనా బ్యాచ్లకు టీసీఎస్లో ఉద్యోగాలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఫ్రెషర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రెష్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు వరంలాంటి వార్తను ప్రకటించింది. కరోనా కష్టకాలంలో ఉద్యోగార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది. కోవిడ్ కష్టాలు గత రెండేళ్లుగా ప్రపంచమంతా కరోనా నామజపంతో ఉలిక్కి పడుతోంది. కోవిడ్ 19 కారణంగా విద్యా సంస్థలు ఎక్కడివక్కడే మూత పడ్డాయి. రెగ్యులర్ క్లాసులు మూతపడి ఆన్లైన్ క్లాసులే వేదికయ్యాయి. జూమ్, గూగుల్ మీట్ తదితర యాప్ల ద్వారానే విద్యార్థులు పాఠాలు వినాల్సి వచ్చింది. ప్రాక్టికల్ తరగతులకు అవకాశమే లేకుండా పోయింది. కరోనా బ్యాచ్లు కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా చాలా కోర్సులకు సంబంధించి సిలబస్లు పూర్తి కాలేదు. సిలబస్ పూర్తి అనిపించుకున్న సబ్జెక్టులు, చాప్టర్లు కూడా అరకొరగానే జరిగాయనే అభిప్రాయం తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఉంది. మరికొన్ని కోర్సులకు, క్లాసులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే నెక్ట్స్ తరగతిగా ప్రమోట్ అయ్యారు. దీంతో 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్లకు కరోనా బ్యాచ్లుగా పేరు పడ్డాయి. భవిష్యత్తులో సాధారణ బ్యాచ్లతో పోల్చితే కరోనా బ్యాచ్ల పరిస్థితి ఏంటనే బెంగ చాల మందిలో నెలకొంది. టీసీఎస్ సంచలన నిర్ణయం కరోనా బ్యాచ్ విద్యార్థుల సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను పటాపంచలు చేస్తూ టీసీఎస్ సంస్థ సంచనల నిర్ణయం తీసుకుంది. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అవకాశం ప్రత్యేకించి 2019-20, 2020-21, 2021-22 బ్యాచ్లలో పాసవుట్ అయిన ఎంబీఏ గ్రాడ్యుయేట్స్కే కేటాయించింది. నవంబరు 9 వరకు ఉద్యోగార్థులు టీసీఎస్ పోర్టల్ ద్వారా ఎంబీఐ హైరింగ్లో భాగం కావచ్చు. నవంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 18 నుంచి 28 ఏళ్ల వరకు వయస్సు పరిమితిని విధించారు. ఉద్యోగార్థులు రెండేళ్ల ఎంబీఏ కోర్సును పూర్తి చేయడంతో పాటు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీలలో 60 శాతం మార్కులతో పాస్ కావాల్సి ఉంటుంది. బీటెక్ బ్యాక్గ్రౌండ్తో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు, 35,000ల మందికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వడపోసేందుకు టీసీఎస్ 90 నిమిషాల పరీక్షను నిర్వహించనుంది. వెర్బల్ అప్టిట్యూట్, క్వాంటిటేటివ్ అప్టిట్యూట్, బిజినెస్ అప్టిట్యూట్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ కింద దాదాపు 35,000ల మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని టీసీఎస్ హైర్ చేసుకోనుంది. చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! -
ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయండి
వైఎస్ జగన్కు ఏపీ నిరుద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఉద్యోగ ఖాళీల భర్తీకి కృషి చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏపీ నిరుద్యోగ విద్యార్థి కార్యాచరణ సమితి విజ్ఞప్తి చేసింది. సమితి అధ్యక్షుడు రెడ్డి వరప్రసాద్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం శుక్రవారం జగన్ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని వినతిపత్రం అందజేసింది. నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ ప్రకటన వెలువడలేదని, ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని నిరుద్యోగులు తెలిపారు. ఉద్యోగాల భర్తీ జరిగేలా చూడాలని.. ఈ మేరకు ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి ప్రతిపక్షం తరఫున లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement