breaking news
jetti rajashekar
-
‘లాఠీచార్జ్ నియంతృత్వానికి నిదర్శనం’
మహబూబ్నగర్ అర్బన్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులపై లాఠీచార్జి చేయడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ విమర్శించారు. సోమవారం న్యూటౌన్లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాడని అన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణలో 2013 చ ట్టాన్ని అమలు చేయకుండా తమను మోసం చేస్తున్నారని ప్ర శ్నించిన రైతులపై పోలీసులచే లాఠీచార్జి చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ సంఘట నను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. సమావేశంలో పార్టీ మైనార్టీ, దళిత విభాగాల జిల్లా అధ్యక్షులు మ హ్మద్ హైదర్అలీ, మిట్టమీది నాగరాజు, నేతలు షేక్ అబ్దుల్లా, మహ్మద్ సర్దార్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు జయశంకర్ తపించారు
మహబూబ్నగర్ అర్బన్: తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యమని పరితపించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ అన్నారు. స్థానిక న్యూటౌన్లో గల ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జయశంకర్ జయంతిని జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల గుప్పిట్లో నుంచి ఈ ప్రాంత నీళ్ళు, నిధులు, ఉద్యోగాలను దక్కించుకోవడం కోసం ఆయన తపించిన తీరు మరువరానిదని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పని చేస్తున్న సమయంలో అధిపత్యం కోసం రాజకీయ పార్టీల నాయకుల్లో విభేదాలు వచ్చినప్పుడు వారందరిని సమన్వయ పరచి ఆందోళనలను కొనసాగించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని సాధించుకున్న తరుణంలో ఆయన లేకపోవడం ఎవరూ పూడ్చలేని లోటని అన్నారు. ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ఆయన గడిపిన సాధారణ జీవితాన్ని అందరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జయశంకర్ ఆశయాలను నెరవేర్చిననప్పుడే ఆయన త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణకు సార్థకత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ మహ్మద్ వాజిద్, నాయకులు ఎల్.జస్వంత్రెడ్డి, కెటీ నర్సింహారెడ్డి, మహ్మద్ సర్దార్, అశోక్, విజయకుమార్ యాదవ్, నర్పింహారెడ్డి, రమేశ్, శ్రీనివాస్, యూనుస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.