-
మే 13 తర్వాత మాదే రాజ్యం
-
రాయచూరు లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ
రాయచూరు రూరల్ , న్యూస్లైన్: రాయచూరులో నేడు(గురువారం) జరిగే లోక్సభ ఎన్నికలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్యే గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీవీ నాయక్, బీజేపీ నుంచి శివనగౌడనాయక్, జేడీఎస్ నుంచి డీబీ నాయక్, బీఎస్పీ నుంచి తిమ్మప్పనాయక్, చిన్నయ్యనాయక్, సోమశేఖర్ , నాగరాజ, భగవంతప్ప రంగంలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బీజేపీ అభ్యర్థి ధన అధికార బలంతో గెలుపు తథ్యంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయక్ పాత వాడైనా గత ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వెంకటేష్నాయక్ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోయారనే విమర్శలున్నాయి. జేడీఎస్ అభ్యర్థి తన ఉనికిని చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాయచూరు లోకసభ నియోజకవర్గంలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర ఎడమ కాలువ, కృష్ణానదిపై నారాయణపూర్ కుడికాలువ, రాష్ట్రానికి 45 శాతం విద్యుత్ ఉత్పత్తి చేసే విద్యుత్ స్థావరాలు, బంగారు నిక్షేపాలు గల హట్టి ప్రాంతాలు ఉన్నా రాయచూరు లోకసభ నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉంది. ప్రస్తుతం 16వ లోకసభకు జరగనున్న ఎన్నికల్లో ప్రాంతీయ అసమానతల నివారణకు ఉద్దేశించిన నంజుండప్ప నివేదికలో తేటతెల్లమైంది. అత్యంత వెనకబడిన జిల్లాగా కీర్తి ఉంది. 60 ఏళ్ల పాలనలో అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయింది. ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వెనుకబడిన జాబితా నుంచి తొలగిస్తారో? లేదో? వేచి చూడాలి. 15 సార్లు జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 1967లో స్వతంత్ర అభ్యర్థి రాజా వెంకటప్పనాయక్ 1996లో రాజా రంగప్ప నాయక్ గెలిచారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగించొద్దు! హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- మళ్లీ హెడ్కోచ్గా రవిశాస్త్రి?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement