breaking news
Jayalalithaa assets case
-
జయలలిత కేసు విచారణ ఖర్చు ఎంతో తెలుసా ?
-
జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి
⇒ 2003 నుంచి ఇప్పటివరకు అయిన ఖర్చు రూ. 5 కోట్లుగా లెక్క తేల్చిన అధికారులు ⇒ జయ సొత్తు వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి ఖర్చులు రాబట్టుకోనున్న కర్ణాటక సాక్షి, బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చులను జయ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన సొమ్ము నుంచి కర్ణాటక తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం. జయ అక్రమాస్తుల కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ 2003 నవంబర్ 18న సుప్రీం కోర్టు తీర్చు చెప్పింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 27న కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేక కోర్టును, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. 2014 వరకు ఈ కోర్టులో విచారణ జరిగింది. ఈ పదేళ్లలో రూ. 2.86 కోట్లు ఖర్చయినట్లు లెక్కగట్టారు. ఈ కోర్టు, కార్యాలయం ఏర్పాటుకు రూ.4.81 లక్షలు, టెలిఫోన్ బిల్లులకు రూ.1.37 లక్షలు ఖర్చయినట్లు తేలింది. ప్రత్యేక కోర్టు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వేతనాలు ఇతర ఖర్చులే రూ.90.13 లక్షలయినట్లు తేలింది. తమిళ భాషలో ఉన్న వేలాది పేజీల దస్తావేజులను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడానికి రూ.6.51లక్షలు, వాటి జిరాక్స్కు రూ.2.17 లక్షలు ఖర్చయింది. తమిళనాడు సెషన్స్ కోర్టులోని దస్త్రాలను ఇక్కడికి తేవడానికి అయిన ఖర్చు రూ.8.63 లక్షలుగా తేల్చారు. ఇతరత్రా అన్ని ఖర్చులు మరో 1.70 కోట్లు అయిందని అధికారవర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా జయలలిత, శశికళ తదితరులు బెంగళూరుకు వచ్చినప్పుడు వారికి కల్పించిన భద్రతకే భారీగా ఖర్చయినట్లు సమాచారం. ప్రత్యేక కోర్టులో 2014లో విచారణ ముగిసింది. ఆ తర్వాత హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా జయలలిత, ఇతరులకు భద్రత, ఇతరత్రా ఖర్చులు, వారు జైలుకు వచ్చినప్పుడు అయిన ఖర్చులు కనీసం రూ. 2 కోట్లు అయ్యాయని అధికారులు వెల్లడించారు. జయ బృందం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్ములో ఈ ఖర్చులను కర్ణాటక ప్రభుత్వం రాబట్టుకొంటుందని సమాచారం. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
జయ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుకు సంబంధించి హై కోర్టు స్పెషల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడం సబబుగా ఉంటుందని కర్ణాటక ప్రభుత్వానికి న్యాయవాది బీ.వీ ఆచార్య గురువారం లేఖ రాశారు. తీర్పు ప్రతిలో అక్రమ ఆస్తులను లెక్కగట్టడంలో తప్పులు జరిగాయని ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆచార్య పేర్కొన్నారు. కాగా, బీ.వీ ఆచార్య కర్ణాటక తరఫున జయలలిత అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి స్పెషల్ పబ్లిక్ప్రాసిక్యూటర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లక పోతే కర్ణాటక హై కోర్టు స్పెషల్ బెంచ్ తీర్పును ప్రశ్నిస్తూ తానే దేశ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటీషన్ను జూన్ 1న దాఖలు చేస్తానని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి గురువారం ట్విట్ చేశారు.