-
జేఏఓ ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదించండి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ అకౌంట్స్ అధికారుల (జేఏఓ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంపై అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిపుణుల బృందానికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) ను హైకోర్టు ఆదేశించింది. నిపుణుల బృందం చేసే సిఫారసులకనుగుణంగా పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడంతో పాటుగా ‘కీ’పై వస్తున్న అభ్యంతరాలను కూడా ఈ బృందం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రశ్నలను ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థుల అభ్యంతరాలివి.. రాష్ట్రంలో 107 జూనియర్ అకౌంట్స్ అధికారుల పోస్టు భర్తీకి 2018 మే లో ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 35 ప్రశ్నలు అకౌంటెన్సీ, అడ్వాన్డŠస్ అకౌంటెన్సీ, 25 ప్రశ్నలు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, 20 ప్రశ్నలు ఆడిటింగ్, మిగిలిన 20 ప్రశ్నలు ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్కు సంబంధించి ఉంటా యన్నారు. జూలైలో రాతపరీక్ష నిర్వహించారు. అయితే...51 ప్రశ్నలు అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ నుంచి, 19 ప్రశ్నలు, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి, ఆడిటింగ్ నుంచి పది ప్రశ్నలు మాత్రమే ఇచ్చారని ఇది సరికాదంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్కుమార్ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బి.రచనారెడ్డి, భుజంగరావులు వాదనలు వినిపిస్తూ, నోటిఫికేషన్లో చెప్పిన విధానానికి, పరీక్ష నిర్వహించిన విధానానికి ఏ మాత్రం పొంతన లేదన్నారు. ఫలానా విభాగంలో ఇన్ని ప్రశ్నలు వస్తాయని పేర్కొనడం వల్ల అభ్యర్థులు అందుకనుగుణంగా ప్రాధాన్యతలను నిర్ణయించుకుని పరీక్షకు సన్నద్ధులయ్యారన్నారు. పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. వారికి ఆ హక్కులేదు.. ఈ వాదనలను ఎన్పీడీసీఎల్ తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ తోసిపుచ్చారు. ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత కూడా అభ్యర్థులు ఈ అభ్యంతరాలను లేవనెత్తలేదని, ఇప్పుడు ప్రశ్నలు ఫలానా విధంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు వారికి లేదని తెలిపారు. పరీక్ష పత్రం తయారు చేసిన జేఎన్టీయూ తరఫున ఏ.అభిషేక్రెడ్డి వాదనలు వినిపిస్తూ, అకౌంటెన్సీ, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ ఇవన్నీ కూడా పరస్పర సంబంధం ఉన్న సబ్జెక్టులేనన్నారు. అందువల్ల పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ప్రశ్నాపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదించే విషయం చర్చకు రాగా, ఎన్పీడీసీఎల్ న్యాయవాది అందుకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో న్యాయమూర్తి మొత్తం ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఈ నిపుణుల బృందం అన్నీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తగిన సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. -
బీఎస్ఎన్ఎల్లో జేఏవో ఉద్యోగాలు
జాబ్ పాయింట్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో 962 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (జేఏవో) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. రూ.16,400-రూ.40,500 వేతన స్కేలు, ఏటా 3 శాతం ఇంక్రిమెంట్, హెచ్ఆర్ఏ, మెడికల్ అలవెన్సు ఇలా ఆకర్షణీయ జీతభత్యాలకు నెలవైన జేఏవో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు.. రెండేళ్ల విరామం తర్వాత ప్రకటన వెలువడింది. గతంలో పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉండేది. ఇప్పుడు దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలోకి మార్చారు. ఖాళీల వివరాలు: కేటగిరీ ఉద్యోగాలు ఓసీ 389 ఓబీసీ 260 ఎస్సీ 195 ఎస్టీ 118 మొత్తం 962 ఆంధ్రప్రదేశ్ సర్కిల్: ఓసీ-46; ఓబీసీ-11; ఎస్సీ-22; ఎస్టీ-12. మొత్తం 91. అర్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్/మాస్టర్ ఆఫ్ కామర్స్. గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి 2014, డిసెంబర్ 31 నాటికి అర్హత సాధించి ఉండాలి. వయసు: 2015, జనవరి 1 నాటికి కనిష్ట వయసు 20 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎంపిక: అఖిల భారత స్థాయిలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతాయి. రాత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. పేపర్-1కు 150 మార్కులు, పేపర్-2కు 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్కు మూడు గంటలు కేటాయించారు. మెరిట్ జాబితాలో చోటుసంపాదించాలంటే సెక్షన్ వారీగా, మొత్తంమీద అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం: పేపర్ సబ్జెక్టు మార్కులు పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ 100 జనరల్ ఆప్టిట్యూడ్/అవేర్నెస్ 50 పేపర్-2 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్/ కాస్ట్ అకౌంటింగ్/ట్యాక్స్ అండ్ కమర్షియల్ లాస్ 300 సిలబస్: జనరల్ ఇంగ్లిష్: కాంప్రెహెన్షన్, గ్రామర్, వొకాబ్యులరీ. జనరల్ ఆప్టిట్యూడ్: జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు; భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ; జనరల్ మెంటల్ ఎబిలిటీ; రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్. ఫైనాన్షియల్, కమర్షియల్ అకౌంట్స్: అడ్వాన్స్డ్ అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు-ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక చట్టాలు. ముఖ్య అంశాలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ 1, 2014- డిసెంబర్ 31, 2014. ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులు మాత్రమే రూ.వెయ్యి ఆన్లైన్లో చెల్లించాలి. సర్కిల్ వారీగా: అభ్యర్థులు ఏవైనా ఐదు సర్కిళ్లను ప్రాధాన్యత వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మెరిట్, ఖాళీల వారీగా నియామకాలు ఉంటాయి. పరీక్ష కేంద్రం: హైదరాబాద్లో సెంటర్ అందుబాటులో ఉంది. టీఏ: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ప్రయాణ భత్యానికి అర్హులు. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 22, 2015. వెబ్సైట్: www.externalexam.bsnl.co.in ఉద్యోగానికి ఎంపికైన వారిని రెండేళ్ల పాటు ప్రొబేషన్లో ఉంచుతారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమించుకుంటారు. ప్రిపరేషన్: జనరల్ ఇంగ్లిష్లో మంచి మార్కులు సాధించేందుకు గ్రామర్లోని ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ పత్రికలు, ప్రామాణిక పుస్తకాల సహాయంతో వొకాబ్యులరీని మెరుగుపరుచుకోవాలి. రీజనింగ్ విభాగంలో సిరీస్, అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డెరైక్షన్స్ తదితర అంశాలను ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ టెక్నిక్కు సంబంధించి సూక్ష్మీకరణ, నిష్పత్తులు, శాతాలు, సరాసరి, అనుపాతం, క్లాక్స్, టైమ్ అండ్ వర్క్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పీజీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల ఆ కోణంలో సిద్ధమవ్వాలి. నమూనా ప్రశ్నలు: The SAARC Culture Minister Conference was held in september 2014? a) Kathmandu b) New Delhi c) Male d) Islamabad Ans: b The phase of accounting that deals with collecting and controlling the costs of producing a given product or service is called a) internal auditing b) bookkeeping c) cost accounting d) general accounting Ans: c - కె.వి. జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్, హైదరాబాద్. ఇండియన్ నేవీ సెయిలర్స్ ఇండియన్ నేవీ.. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి సీనియర్ సెకండరీ రిక్రూటర్స్ సెయిలర్స్ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్లతో 10+2/తత్సమానం. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: ఆగస్ట్ 1, 1994-జూలై 31, 1998 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నె స్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలను గుర్తించడానికి గంట సమయం కేటాయించారు. 10+2 స్థాయిలో ప్రశ్నల క్లిష్టత ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్/హిందీ భాషల్లో రూపొందిస్తారు. సిలబస్ను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. 20 సిట్ అప్స్, 10 పుష్ అప్స్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్ట్, 2015 నుంచి ఐఎన్ఎస్-చిల్కాలో 22 వారాలపాలు శిక్షణనిస్తారు. తర్వాత దేశంలోని వివిధ నేవల్ ఎస్టాబ్లిష్మెంట్లలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2014. {పింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 14, 2014. వివరాలకు: http://nausenabharti.nic.in ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ప్రింట్ అవుట్ పంపాల్సిన చిరునామా: పోస్ట్బాక్స్ నంబర్-488, గోలే డాక్ఖానా, జీపీవో, న్యూఢిల్లీ-110001.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement