breaking news
jagannatha ratha yathra
-
Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
Jagannath Yatra 2025 జగన్నాథ రథయాత్ర 2025 ఒడిశాలోని పూరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్రను ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారైనా చూసి తరించాలని భావించే ఆధ్యాత్మిక సందర్భం. దేశ, విదేశాల నుంచీ ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథ రథయాత్రను చూసి తరిస్తారు. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది.ఉత్సవ విగ్రహాలకు బదులుగా సాక్షాత్తు గర్భగుడిలో ఉండే విగ్రహమూర్తులేప్రత్యేకంగా తయారు చేసిన మూడురథాల్లో (జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్ర దేవి) యాత్ర ద్వారా ఒడిశాలోని పూరి వీధుల గుండా ఊరేగడం ఇక్కడి విశేషం. ఈ ఉత్సవంలో ఒవేలాది మంది భక్తులు లాగుతున్న మూడు భారీ చెక్క రథాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, గొప్ప రథయాత్ర. అందుకేబ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) జగన్నాథ రథయాత్ర చరిత్ర 5 వేల సంవత్సరాల నాటిదనీ, ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ రాజు ప్రస్తుత జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు రూపుదిద్దుకుందని చెబుతారు. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేయడం ఈ రథయాత్ర మరో ప్రత్యేకత. ఈ యాత్రలో రథం తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష రెండవ రోజు నుండి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర జూన్ 27 ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ముందు అనేక శుభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనాయి.. రథం నిర్మాణం నుండి స్నాన పూర్ణిమ వరకు, జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్రలను 108 కలశాలతో స్నానం చేస్తారు. దీని తరువాత, జూన్ 26న గుండిచ ఆలయం శుభ్రం చేయబడుతుంది. గుండిచ ఆలయం అనేది దేవుని అత్తగారిల్లు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన అత్త ఇంటికి వెళ్లి, ఆమరుసటి రోజు అంటే జూన్ 27న రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రోజున, భగవంతుడు శ్రీమందిర్ నుండి మూడు గొప్ప రథాలలో గుండిచ ఆలయానికి బయలుదేరుతాడు. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు కొనసాగిన తిరుగు ప్రయాణం, బహుద యాత్ర జూలై 5న సాగుతుంది. ఈ సందర్భంలో జగన్నాథుడు మళ్ళీ సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి శ్రీమందిర్కు బయలుదేరుతాడు.ప్రతి రథానికి ఒక ప్రాముఖ్యత ఉంది.నందిఘోష (జగన్నాథుని రథం)"విశ్వ ప్రభువు" అయిన జగన్నాథుడు మూడు రథాలలో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు. దాని పేరు సూచించినట్లుగా, అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది. మూడు రథాలు వరుసలో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడి వైపున ఉంచుతారు.తాళధ్వజ (బలభద్ర ప్రభువు రథం)జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు. "తలధ్వజ" అనే పేరు దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది. బలరాముడి రూపంగా పరిగణించబడే బలభద్రుడు ఈ రథంలో స్వారీ చేస్తాడు. అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడమ వైపున ఉంచుతారు.దర్పదలన (సుభద్రాదేవి రథం)అతి చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరించబడిన రథం జగన్నాథుడు మరియు బలభద్రుని సోదరి అయిన సుభద్ర దేవికి చెందినది. "దర్పదలన" అనే పేరుకు "గర్వాన్ని నాశనం చేసేది" అని అర్థం, దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో చూపిస్తుంది. పండుగ సమయంలో సుభద్ర దేవి రథాన్ని ఆమె సోదరుల రథాల మధ్య ఉంచుతారు. ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది . మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు.ప్రతి రథం కోసం దాదాపు 1,000 చెక్క ముక్కలను ఉపయోగిస్తారు. నిర్మాణానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. విశేషమేమిటంటే, ఈ భారీ నిర్మాణాలు ఎటువంటి లోహపు మేకులు లేదా ఫాస్టెనర్లు లేకుండా తయారు చేస్తారు. "మహారాణులు" అని పిలువబడే కళాకారుల తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. శ్రీ జగన్నాథునికి లేహ్య సేవఈ రథయాత్రకు సంబంధించిన రథాల తయారీ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే ఆ యాత్రంలోభాగంగా జన్నాథునికి లేహ్య సేవ ఘనంగా నిర్వహించారు. స్నాన పూర్ణిమనాడు భారీ స్నానం చేసిన తర్వాత శ్రీ జగన్నాథుడు, అతని తోబుట్టువులు అస్వస్థతకు గురయ్యారు. వారు త్వరగా కోలుకోవడానికి ఆలయ రాజ ఆయుర్వేద వైద్యుల మార్గదర్శకత్వంలో వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నారు. దేవతలు ప్రస్తుతం అనవసర మండపంపై కొలువు దీరి గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సేవల్లో ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలు, మూలికా ఔషధాలు వాడతారు. ఈ సమయంలో స్థానిక మూలికలు మరియు వేర్లతో తయారు చేసిన ఔషధాలు, పండ్ల రసాలు మూల విరాట్లకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ వారం ఒస్సా లగ్గి (తైల పూత) ఉపచారంతో సేవలు అందించారు. సుధ సువారో సేవక వర్గం తయారు చేసిన ఒస్సా అనే ప్రత్యేక వైద్యాన్ని దేవతలకు అందజేశారు. మంగళ వారం అపరాహ్న ధూపం తర్వాత దేవతలకు ఒస్సా లగ్గి నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. దైతపతి సేవకులు రాత్రి పూట ఈ చికిత్స నిర్వహించారు. -
వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్
సాక్షి, పాలకొండ(శ్రీకాకుళం) : ఉత్తరాంధ్రలోనే ప్రత్యేకత గాంచిన పాలకొండ జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 4 నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవా లు నిర్వహించడం ఆనవాయితీ. పూరి ఆలయ తరహాలో ఇక్కడి ఆలయం ఉండడం ప్రత్యేకం. స్వామి వారి విగ్రహాలను తరలించే రథం సుమారు 50 అడుగులు ఉంటుంది. ఆరువందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రథయాత్రకు మన రాష్ట్రంతో పా టు ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా దేవాదాయ శాఖ ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో చేపట్టడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాత్ర వివరాలు.. 4న మొదటి రథయాత్ర తొలిదశమి విగ్రహానికి సంప్రోక్షణం చేసి రథంపై ఉంచుతారు. 5న ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. 6 నుంచి స్వామి వారు పలు అవతారాల్లో భక్తులకు కనువిందు చేస్తారు. 6న మత్సా్యవతారం, 7న కూర్మావతారం, 8న హిరాపంచమి సందర్భంగా శ్రీ వరాహ–నరసింహస్వామి అవతారం, 9న వామన పరశురాం అవతారం, 10న రామ–బలరామ అవతారం, 11న కల్కి–జగన్మోహిని అవతారం, 12న మారుదశమి స్వామి వారి నిజరూప దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి తిరుగు రథయాత్ర 13న ప్రారంభమై 14న స్వామి విగ్రహాలను ప్రధాన ఆలయంలోనికి తీసుకువెళ్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు ఆలయ అర్చకులు మఠం విశ్వనాథ దాసు స్వామి చరిత్ర కథ రూపంలో భక్తులకు వివరిస్తారు. భక్తులకు తప్పని అవస్థలు ఇక్కడి రథయాత్రకు లక్షల్లోనే భక్తులు వస్తుంటారు. అయితే సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఏటా వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయం వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు రహదారి సదుపాయం లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికీ ఆలయ కమిటీ లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు యాత్రను తమ ఆధీనంలోకి తీసుకుని దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. రథం పూర్తిగా విరిగిపోయి భక్తుల పైకి వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. యాత్ర చూసేందుకు వచ్చే భక్తులు ఉండేందుకు కనీస సదుపాయాలు ఇక్కడ కనిపించడం లేదు. గత ఏడాది నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావు రహదారి నిర్మాణానికి రూ.6లక్షలు నిధులు కేటాయించి పనులు చేయించినా అందులో నాణ్యత కనిపించలేదు. దీంతో భక్తులు ఈ ఏడాది ఇబ్బంది పడాల్సి వస్తోంది. నిలిచిన నూతన రథం తయారీ పనులు ఇక్కడ ఏళ్ల నాటి రథం పూర్తిగా శిథిలం కావడంతో కొత్తగా రథం తయారు చేయాలని గత ఏడాది చర్యలు తీసుకున్నారు. ఇందుకు కావాల్సిన కలపను ఒడిశా నుంచి తెప్పించారు. ఇరుసులు తయారు చేపట్టిన రెండు రోజుల్లోనూ పనులు నిలిచిపోయాయి. అవసరం ఉన్న కలప లేకపోవడంతో పాటు నిధులు లేమి, పనివారు లేమి కారణాలతో ఈ ఏడాది రథం పనులు పూర్తి కాలేదు. ఉన్న కలప ప్రస్తుతం చెదలు పడుతోంది. అన్ని చర్యలు తీసుకుంటాం రథయాత్ర ఉత్సవాలకు సం బంధించి భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చాం. ప్రైవేటు వ్యక్తుల పెత్తనం లేకుండా ఈ ఏడాది చర్యలు చేపడతాం. రహదారిని సక్రమంగా తయారు చేయాలని పంచాయతీ అధికారులకు నివేదించాం. వర్షం పడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నాం. – ఎస్.రాజారావు, ఆలయ ఈవో -
పూరీ జగన్నాథ రథయాత్రకు లక్షలాదిమంది
పూరీ: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర శనివారం ఘనంగా ప్రారంభమైంది. దీనికి లక్షలాదిమంది భక్తులు హాజరయ్యారు. సాదారణంగా ప్రతి ఏడాది ఈ రథయాత్ర ఆషాడశుక్ల విదియ నాడు ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా జూన్, జూలై నెలల్లో జరుగుతుంది.