breaking news
Jab we Met
-
నా వల్లే భారతీయ రైల్వేస్కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
Kareena Kapoor Says Indian Railways Income Increased By Geet Role: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. ఆమెను అభిమానులంతా ముద్దుగా బెబో అని కూడా పిలుచుకుంటారు. కభీ ఖుషీ కభీ ఘమ్, జబ్ వి మెట్, ఉడ్తా పంజాబ్, తషాన్, భజరంగీ భాయిజాన్, 3 ఇడియట్స్, హీరోయిన్ వంటి చిత్రాలతో అలరించింది. సినిమాలకు చాలా దూరంగా ఉన్న ఈ భామ ఇటీవల అమీర్ ఖాన్కు జోడీగా లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్, వరుణ్ శర్మ లాయర్లుగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'కేస్తో బన్ తా హై'. ఈ షోలో పాల్గొన్న జబ్ వి మెట్ సినిమాలోని గీత్ అనే పాత్ర వల్లే రైల్వేస్కు ఆదాయం పెరిగిందని తెలిపింది. ''నేను చేసిన గీత్ పాత్ర వల్లే ప్యాంట్స్ అమ్మకాలు, భారతీయ రైల్వేలకు ఆదాయం పెరిగింది'' అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కాగా కరీనా కపూర్, షాహిద్ కపూర్ జోడిగా కలిసి నటించిన చిత్రం జబ్ వి మెట్. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీత్గా కరీనా కపూర్ అలరించింది. ఇదిలా ఉంటే కరీనా కపూర్ త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. సుజయ్ ఘోష్ డైరెక్షన్లో విజయ్ వర్మ, జైదీప్ అహ్లవత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
కావాలనే మాజీ లవర్తో ఫొటో దిగలేదు!
'ఉడ్తా పంజాబ్' సినిమాతో మళ్లీ వెండితెర మీద కనిపించబోతున్నారు షాహిద్ కపూర్, కరీనా కపూర్. చాలాకాలం కిందటే విడిపోయిన ఈ మాజీ ప్రేమజంట.. గతంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా విలేకరులు ఎంత కోరినా.. కలిసి ఫొటో దిగేందుకు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఏమిటంటే.. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వెల్లడించాడు. కావాలనే తామిద్దరం కలిసి ఫొటో దిగలేదని, ఒకవేళ ఫొటో దిగితే అప్పట్లో మీడియా మొత్తం దీనిపైనే మాట్లాడేదని, అందుకే మేం కలిసి ఫొటో దిగకూడదని తాను భావించానని షాహిద్ చెప్పాడు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత షాహిద్, కరీనా.. అభిషేక్ చుబే తెరకెక్కించిన 'ఉడ్తా పంజాబ్'లో నటించారు. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదట. అంతేకాకుండా మీ ఇద్దరు భవిష్యత్తులో కలిసి నటించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు వీరు సమాధానం దాటేశారు. సహ నటులు ఆలియా భట్, డైరెక్టర్ అభిషేక్ చుబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షాహిద్, కరీన చాలా ఇబ్బందిగా కనిపించారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై స్పందిస్తూ 'మేం ఇబ్బందిగా ఫీలైనట్టు మీరు ఎలా నిర్ణయిస్తారు? మేం అలా కనిపించామా? అలా ఎలా రాస్తారు?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
మాజీ లవర్స్ మాట దాటేశారు!!
ముంబై: షాహిద్ కపూర్, కరీనా కపూర్.. చాలాకాలం తర్వాత ఈ మాజీ ప్రేమజంట వెండితెరపై ఒకే సినిమాలో కనిపించబోతున్నది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో ఈ ఇద్దరూ కనిపించనున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో గాఢమైన ప్రేమపక్షులుగా పేరొందిన షాహిద్, కరీన ఆ తర్వాత వేరయ్యారు. ఎవరి తోడును వారు వెతుక్కున్నారు. ఈ ఇద్దరు కలిసి చివరిసారి నటించిన చిత్రం 'జబ్ వుయ్ మెట్'. ఆ సినిమా సమయంలోనే ఇద్దరికి బ్రేకప్ అయింది. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ మాజీ లవర్స్.. అభిషేక్ చుబే తీసిన 'ఉడ్తా పంజాబ్'లో దర్శనమివ్వబోతున్నారు. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఈ జంట ఒకే వేదికపై కనిపించింది. నిజానికి ఒకే సినిమాలో నటిస్తున్నారనే మాటే కానీ.. ఈ ఇద్దరు కలిసి కనిపించే సీన్ ఒక్కటి కూడా ఈ చిత్రంలో లేదు. ఈ విషయమై ప్రశ్నించగా షాహిద్, కరీన మాట దాటేశారు. భవిష్యత్లో మీరిద్దరూ కలిసి నటించే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా డొంక తిరుగుడు సమాధానమిచ్చారు. 'ఉడ్తా పంజాబ్' సినిమాలో మీరిద్దరు కలిసి నటించే దృశ్యం ఒక్కటి కూడా లేనందుకు బాధాపడ్డారా? అని ప్రశ్నించగా 'గతంలో జరిగిన దాని గురించి మీరు బాధపడుతున్నారా? అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న' అని షాహిద్ బదులిచ్చాడు. 'జబ్ వుయ్ మెట్' సినిమా డీవీడీలు ఉన్నాయిగా? ఇంక కలిసి నటించడమెందుకు? అన్న తరహాలో కరీన బదులిచ్చింది. అంటే 'జబ్ వుయ్ మెట్' సినిమా తరహాలో మీరిద్దరు కలిసి నటించే అవకాశం భవిష్యత్తులో లేదన్నమాట? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఆ విషయం ఇంతియాజ్ అలీ (ఆ చిత్ర డైరెక్టర్) చెప్తారు' అంటూ కరీన జవాబు దాటేసింది. 'జబ్ వుయ్ మెట్'కు సీక్వెల్ వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చేదని, ఇప్పుడు ఇంతియాజ్ ఆ సినిమా నుంచి ఎంతో ముందుకెళ్లిపోయారని షాహిద్ వివరణ ఇచ్చాడు. ఇక కలిసి ఫొటోలకు పోజు ఇవ్వొచ్చుగా అని విలేకరులు కోరినా.. ఈ జంట అందుకు సుమఖత వ్యక్తం చేయలేదు. సహ నటులు అలియా భట్, దిల్జిత్ దుసాంజ్లను తమమధ్యకు పిలిపించుకొని ఫొటొలు దిగారు కానీ, పక్కపక్కన ఉండి ఫొటోలు దిగేందుకు నిరాకరించారు. -
ఈ జోడీ పర్ఫెక్ట్!
దేడ్ కహానీ - జబ్ వియ్ మెట్ చేపపిల్ల... నీళ్లల్లో ఈదుతున్నంతసేపూ నోటి దవడలు ఆడిస్తూనే ఉంటుంది. నీళ్లు తాగకుండా ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియ అది. దాని జీవనాధారం. అలాగే ఓ చేప కళ్లున్న ఆడపిల్ల, చలాకీగా ఇరవై నాలుగ్గం టలూ తన పెదాలని ఆడిస్తూనే ఉంటుంది. ఎదుటి వాడి మనోభావాలతో సంబంధం లేదు. అలా మాట్లాడుతూనే ఉంటుంది. చివరికి నిద్రలో కూడా. ఆమే... గీత్ సింగ్. అమాయకమైన పల్లె టూరి అమ్మాయి. ముంబైలో ట్రైన్ ఎక్కుతుంది. పరిగెడుతున్న ట్రైన్ లోపల కెమెరా పెట్టి, ఖాళీ డోరు షాటు, కదులు తున్న ట్రైనుని చూపిస్తూ, గట్టిగా గీత్ గొంతు, మాటలు మాత్రమే వినపడేలా కొంత దూరం నడిపించి, తర్వాతే ఆమె రూపాన్ని ప్రేక్షకులకి పరిచయం చేస్తాడు దర్శకుడు. ఒక వాగుడుకాయ్ క్యారెక్టర్కి ఇంతకంటే అందమైన, అర్థవంతమైన పరిచయం వేరేది ఉండదు. ఇలా గీత్ని పరిచయం చేయడానికి ముందే ముంబైలో ఒక గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ వారసుడు ఆదిత్య కశ్యప్ని చాలా నిరాశగా, నిస్పృహగా, జీవితంలో ఓడిపోయి, అదీ తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోతే, ఆ రిఫ్లెక్షను తనని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద పడి, ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసేస్తే, మూగ బోయినవాడిగా చూపిస్తాడు దర్శకుడు. గమ్యం తెలీక, ఎలా ఉన్నవాడు అలా ఇల్లొదిలి రెలైక్కి కూర్చుంటాడు. అలాంటి వాడికి కో-ప్యాసింజర్ గీత్. అడిగినా అడక్కపోయినా, విసుక్కున్నా, లేచి వెళ్లి ఇంకో దగ్గర కూర్చున్నా ఆమె ధోరణి ఆమెదే. ఆ ఇద్దరూ కలిసి చేసే రైలు ప్రయాణం, దాని కొనసాగింపుగా చేసే జీవిత ప్రయాణమే ‘జబ్ వియ్ మెట్’ సినిమా మొదటి భాగం. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆదిత్యని తన సెలయేటి ప్రవాహం లాంటి మాటల నుంచి ప్రసరించిన తరంగాల కరెంటుతో చైతన్యవంతుణ్ని చేస్తుంది గీత్. అద్భుతమైన సీన్ ఏంటంటే, తండ్రి మరణానికి కారణం తన తల్లి వేరే వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోవడం అని, సమాజం తల్లి మీద వేసిన నిందని కొడుకుగా తనూ వేసి ఆమెపై కోపం పెంచుకున్న కశ్యప్కి గీత్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నేర్పిస్తుంది. తల్లి కూడా ఒక మనిషే అని, ఆమె ప్రేమలో తప్పు లేదని, కొడుకుగా ఆమెని అర్థం చేసుకోవాలే తప్ప, సమాజం దృష్టి నుంచి ఆమెని చూడకూడదని చెప్తుంది. ఇలాంటి తల్లుల్ని నిజ జీవితంలో చూసే ఉంటాం, సమాజంలాగ వాళ్లని చెడుగా తిట్టే ఉంటాం - గీత్లా వాళ్లని మనుషులుగా భావించమని చెప్పేవాళ్లు మనకుండకపోవచ్చు. జబ్ వియ్ మెట్ గీత్... వుయ్ లెర్న్ హౌ టు లీడ్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ అదర్స్. సరే, అలాంటి గీత్ని ఆమె ఇంట్లోంచి తెల్లారుఝామున తీసుకొచ్చి ఆమె ప్రేమించిన అన్షుమన్ దగ్గర వదిలి వెళ్లిపోతాడు కశ్యప్. ఆమె అడుగుతుంది - మా ఇంట్లోవాళ్లకి తెలీకుండా ఇలా వెళ్లిపోతున్నాను నన్ను క్షమిస్తారా అని! ఆదిత్య చెప్తాడు - మా అమ్మని నీవల్ల నేను అర్థం చేసుకున్నాను, నిన్ను కూడా మీవాళ్లు కొన్నాళ్లకి అర్థం చేసుకుంటారని. అన్షుమన్ని కలవకుండానే గీత్ని దింపేసి వెళ్లిపోతాడు కశ్యప్ - ఇక్కడ విశ్రాంతి. జీవితాన్ని ఎలా చూడాలో, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో గీత్ ఆదిత్యకే కాకుండా ఆడియెన్స్ అందరికీ చెప్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది. అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎక్కువ రాశాను. ద్వితీయార్ధంలో ఆదిత్య చాలా యాక్టివ్ అయిపోతాడు. కానీ గీత్ మాత్రం జీవితంలో ఓడిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి డీలా పడిపోతుంది. అది తెలిసి ఆమెలో తన చైతన్యంతో కరెంట్ ప్రవహించేట్టు చేసి ఆమెని మామూలుగా తన కుటుంబంతో కలిపే ప్రయత్నం చేస్తాడు ఆదిత్య. ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఒకటవ్వడమే కథ. ప్రథమార్ధంలో ఉత్తుంగ తరంగం లాంటి గీత్గా మెప్పించిన కరీనా కపూర్ నీరసించడం, నీరస పాత్రలో బాగా మెప్పించిన షాహిద్ కపూర్ ద్వితీయార్ధంలో ఉత్తుంగ తరంగంలా ఎగసి పడలేకపోవడం చూస్తే... సినిమాని కొంచెం పడేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ, గీత్ ప్రేమించిన అన్షుమన్ని కుటుంబ సభ్యులు స్నేహితుడనుకుని, ఆదిత్యని అల్లుడనుకునే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఆ ఇంటి సీన్లే సెకండ్ హాఫ్కి సేవింగ్ ఫ్యాక్టర్. ఒక విధంగా శ్రీను వైట్లగారి సినిమాల ఫార్మాట్ నుంచే ఈ చిత్ర రూపకల్పన జరిగినట్టు ఉంటుంది. ఆ ఇంటి సీన్లు తెలుగులో చాలా సినిమాలకి ముడి సరుకు. షాహిద్, కరీనాలు అప్పటికే ప్రేమికులుగా పాపులర్ అవ్వడం వల్ల కెమిస్ట్రీ మరింత బాగా పండినట్టు ఉంటుంది. కానీ, ఇదే ‘దిల్వాలే దుల్హనియా’ టైమ్లో షారుఖ్, కాజోల్ లాంటి జంట చేసుంటే... ఇది కూడా వాటిలాగే ఒక కల్ట్ ఫిల్మ్ అవ్వగలిగే కథ, కథనం ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సినిమా బాలీవుడ్లో కమర్షియల్ హిట్గా నిలిచింది. 2007 అక్టోబర్లో రిలీజైన ఈ సినిమా 2010లో హాలీవుడ్లో ‘లీప్ ఇయర్’ అనే సినిమాకి ప్రేరణ కావడం భారతీయ సినిమా గర్వించదగ్గ అంశమే. విచిత్రం ఏంటంటే ఈ చిత్రం చివరి షెడ్యూల్కి వచ్చేసరికి షాహిద్, కరీనాలు నిజ జీవితంలో విడిపోయారు. మీడియా అంతా అది ఈ చిత్రం తాలూకు పబ్లిసిటీ స్టంట్ అని అభివర్ణించింది. కానీ తర్వాత అది నిజమని రుజువైంది. ఈ సినిమా టైటిల్ని ‘పంజాబ్ మెయిల్’ అని పెట్టాలా, ‘ఇష్క్ వయా భటిండా’ అని పెట్టాలా ‘జబ్ వియ్ మెట్’ అని పెట్టాలా తేల్చుకోలేక పబ్లిక్ ఓటింగ్ పెడితే జబ్ వియ్ మెట్ గెలిచింది. అలాగే రిలీజయ్యాక ప్రేక్షకుల మన్ననలూ గెలిచింది. కాసుల వర్షమూ రూపాయికి మూడు రూపాయల చొప్పున గెలుచుకొంది. ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో ముఖ్య అంశం... ప్రీతమ్ సంగీతం. ఆసాంతం ఆకట్టుకొంటుంది. నటరాజన్ సుబ్రమణియన్ కెమెరా పనితనం కూడా చాలా బావుంటుంది. శ్రేయాఘోషల్కి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గాను, సరోజ్ఖాన్కి బెస్ట్ కొరియోగ్రాఫర్ గాను, నేషనల్ అవార్డులను తేవడంతో పాటు కరీనా కపూర్కి ఉత్తమ నటిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు అవార్డుల్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రం. దర్శకుడు ఇంతియాజ్ అలీ రెండో చిత్రం ఇది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చిన ఊపుతో తర్వాత చాలా మంచి చిత్రాలు తీశాడు. ఇంతియాజ్ కథ కన్నా పాత్రకి, పాత్రల రూపకల్పనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. వాటి ద్వారా జీవితాన్ని, భావోద్వేగాల్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. ప్రేమని చాలా సున్నితంగా ప్రస్తావిస్తాడు. సీన్స్ని సుతిమెత్తటి పూవుల్లా ప్యాంపర్ చేస్తాడు. అందుకే మంచి దర్శకుడిగా ఎదిగాడు. రైలు ప్రయాణం ఆధారంగా తీసిన ఈ చిత్రంతో కెరీర్లో, జీవితంలో సక్సెస్ అందుకున్నాడు. తిన్నగా హైవే ఎక్కేశాడు. ఇక పక్కదారి పట్టడనే భావిద్దాం. మరిన్ని మంచి సినిమాలు తీస్తాడని, మనకు చూపిస్తాడనీ ఆశిస్తాం. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు