breaking news
ISRA
-
సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ
‘‘నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను. రాయల్టీ రూపంలో ఏమీ సంపాదించలేదు. 2012లో రాయల్టీ గురించి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి ముందు నాకు వచ్చిందేమీ లేదు. ఇప్పుడు రాయల్టీ అనేది సింగర్స్ హక్కు. దీని కోసమే ‘ఇస్రా’ కృషి చేస్తోంది. అర్హులందరూ ఇందులో సభ్యులుగా చేరాలి’’ అని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్’ (ఇస్రా) ఆధ్వర్యంలో ప్రస్తుతం సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఈ సంస్థ బుధవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించింది. ముఖ్య అతిథి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ –‘‘ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2 వేలు చెల్లించి ‘ఇస్రా’లో సభ్యత్వం తీసుకోవచ్చు. ఇప్పటికి 410 మంది సభ్యులున్నారు. గాయనీగాయకులకు భాషతో సంబంధం లేదు. నన్ను, ఏసుదాస్గారిని ఏ భాషవాళ్లంటే ఏమని చెబుతారు? రాయల్టీ గురించి మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయేమోననే భయాలు వద్దు. రాయల్టీ వద్దని గతంలో ఎవరైనా సంతకాలు చేసినా అవి ఇప్పుడు చెల్లవు. సభ్యత్వం తీసుకుంటే జీవితాంతం రాయల్టీ రూపంలో ఎంతో కొంత వస్తూనే ఉంటుంది. సినిమా, జానపదాలు, గజల్, ఆధ్యాత్మిక, క్లాసికల్ పాటలు పాడిన వారందరూ రాయల్టీ పొందడానికి అర్హులే’’ అన్నారు. ‘ఇస్రా’ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్లో ఒకరైన సంజయ్ టాండన్ మాట్లాడుతూ– ‘‘ఇంతకు మునుపు ఉన్న ఐపీఆర్యస్కు.. ఇప్పుడు మేం పెట్టుకున్న ఇస్రాకు సంబంధం లేదు. మా సంస్థ వల్ల వారి ఆదాయానికి నష్టం ఉండదు. ప్రస్తుతం స్టేడియమ్లలో సీటుకు రూ. 1.60 చొప్పున వసూలు చేస్తున్నాం. డిమాండ్ని బట్టి భవిష్యత్తులో పెరగొచ్చు, తగ్గొచ్చు. రాయల్టీ విషయమై యు.యస్, యు.కె., బ్రెజిల్తో మాట్లాడాం. ఇటీవల బ్రెజిల్ నుంచే మాకు రూ.40 లక్షలు వచ్చాయంటే మన సంగీతానికి అక్కడున్న ఆదరణ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇప్పటిదాకా 2016లో రూ.51లక్షలు, 2017లో రూ. 1.2కోట్ల రాయల్టీ వసూలు చేసి అందజేశాం. సభ్యులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అందిస్తున్నాం. మృతిచెందిన గాయనీగాయకుల రాయల్టీని వారసులకు అందిస్తాం’’ అన్నారు. ఆర్.పి.పట్నాయక్, శ్రీలేఖ, వేణు, కౌసల్య, కేఎం రాధాకృష్ణన్, సింహా తదితర సింగర్స్ పాల్గొన్నారు. -
తక్కువ ఆదాయ వర్గాలపైనా గురి!
వంటగ్యాస్ సబ్సిడీ రద్దుకు ఇదే సరైన సమయమంటూ ఐసీఆర్ఏ నివేదిక జనవరి నుంచి 20 లక్షల మందిపై భారం ముంబై: వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ రద్దు నిర్ణయంతో ఏడాదికి ప్రభుత్వానికి రూ.500 కోట్లు ఆదా కానుంది. జనవరి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది రాయితీ కోల్పోనున్నారు. రాయితీ రద్దుతో అధిక ఆదాయ వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదని ఐసీఆర్ఏ(ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) తెలిపింది. అధికాదాయ వర్గాలకు సబ్సిడీ నిలిపివేతకు ఇదే సరైన సమయమని, ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ తగ్గుతూ వస్తుండడమే ఇందుకు కారణమని ఐసీఆర్ఏ ఒక నివేదికలో వెల్లడించింది. గత 3 నెలలుగా గ్యాస్పై దాదాపు రూ.150 నుంచి రూ.190 సబ్సిడీ ఇస్తున్నారు. అధికంగా వంట గ్యాస్ వినియోగిస్తున్న తక్కువ ఆదాయ వర్గాలకు కూడా సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వానికి ఇదే సరైన సమయమని ఐసీఆర్ఏ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల ప్రభుత్వం భారీగా ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ వర్గాలే ఎల్పీజీని ఎక్కువగా వినియోగిస్తున్నారని, రాయితీ లేని గ్యాస్ కొనగలిగే స్థితిలో వారు ఉన్నారని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఒక కుటుంబం 45 రోజులకు ఒక సిలెండర్ వినియోగిస్తున్నారని అంచనావేసింది. తక్కువ ఆదాయ వర్గాలకు సబ్సిడీ ఎత్తివేస్తే కుటుంబంపై నెలకు అదనంగా రూ.100 నుంచి రూ.125 భారం మాత్రమే పడుతుంది. ప్రస్తుతమున్న క్రూడాయిల్, ఎల్పీజీ ధరల ఆధారంగా ఈ లెక్కలు వేసింది.