సెన్సెక్స్ కు 259 పాయింట్ల నష్టం
హైదరాబాద్: ఇరాక్ లో నెలకొన్న పరిస్థితులు ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 259 పాయింట్ల పతనంతో 25329 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 7588 వద్ద ముగిసాయి.
శుక్రవారం ట్రేడింగ్ లో సెసాగోవా అత్యధికంగా 5.92 శాతం నష్టపోగా, డీఎల్ఎఫ్ 4.31, భెల్ 4.31, టాటా పవర్ 3.74, ఐడీఎఫ్ సీ 3.35 శాతం నష్టపోయాయి.
భారతీ ఎయిర్ టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్ సీఎల్ టెక్, ఐటీసీ, సిప్లా స్వల్పంగా లాభపడ్డాయి.