breaking news
Interview Students
-
ఒకేరోజు 2,500 మంది విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో మంగళవారం 2,500 మంది విద్యార్థులను ఇంటర్వ్యూలు చేసినట్టు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. స్టూడెంట్ వీసా ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్తోపాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతాల్లో తమ అధికారులు భారత విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నట్టు హైదరాబాద్ కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఇంటర్వ్యూల్లో వీసాలు పొందిన విద్యార్థులకు చార్జ్డీ అఫైర్స్ పాట్రీషియా లాసినా, కాన్సుల్ జనరల్స్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తూ అమెరికా–ఇండియా సంబంధాలను మరిం త విస్తృతం చేయాలని చార్జ్ డీ లాసినా ఆకాంక్షిం చారు. ఇప్పటికే అమెరికా–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో 75 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు లాసినా గుర్తు చేశారు. అమెరికాలో ఉన్నత విద్య నసభ్యసిస్తున్న వారిలో భారతీయ విద్యార్థుల వాటా 20% ఉం టుందని, సంఖ్యా పరంగా 2 లక్షల మం దికిపైగానే ఉన్నారని కాన్సులేట్ పేర్కొంది. ఈసారి రికార్డు బద్దలు గతం కంటే ఈ ఏడాది స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల్లో రికార్డు బద్దలు కొడతామని మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ కాన్సులర్ ఆఫైర్ డాన్ హెల్పిన్ స్పష్టం చేశారు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సెలర్ ఆంథోని మిరిండా మాట్లాడుతూ విద్యార్థులు యూఎస్ విద్యా విధానాన్ని ఉత్తమంగా ఎంచు కుంటున్నారని, ప్రపంచస్థాయిలో అత్యుత్తమ మౌలిక సద పాయాలను కల్పిస్తోందని అన్నారు. అమెరికా విద్యావ్యవస్థ 4వేలకుపైగా విద్యాసంస్థలు, వర్సిటీలకు అక్రిడేషన్ గుర్తింపు కల్పించిందన్నారు. విద్యార్థులు తదుపరి సందేహాల నివృత్తి, విద్యావిధానం సమాచారం కోసం educationusa.state.gov ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ తదితర మాధ్యమా లను సంప్రదించాలని సూచించారు. -
ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆదిత్య సంచలనం
బాలాజీచెరువు(కాకినాడ): తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఉద్యోగాల సాధనలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులదే పై చేయి అని మరోసారి రుజువు చేస్తూ అత్యధిక సంఖ్యలో ఎంపికై సత్తా చాటారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్. శేషారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో 163 మంది ఉద్యోగాలు సాధించడం వెనుక అపారమైన శ్రమ ఉందన్నారు. ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ విభాగం అధ్యాపకులను అభినందించారు. ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్రెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కష్ణదీపక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో సరికొత్త విధానాలను అమలుచేయడం, విద్యార్థులకు మరింత సమయాన్ని క్యాంపస్ ఇంటర్వ్యూల శిక్షణ కోసం వినియోగించడం తదితర అంశాలు ఉపయోగపడ్డాయన్నారు. నాయుడు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం నుంచే సాఫ్ట్స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంశాల పట్ల ప్రత్యేక దష్టి సారించి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, ప్రత్యేక శిక్షణను అందించామన్నారు. ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.2 లక్షల 20 వేలు వేతనంతోపాటు, ప్రముఖ విద్యాసంస్థలలో ఎం.ఎస్. చేసే అవకాశం కల్పిస్తారని డెరైక్టర్స్ ఎస్పీ గంగిరెడ్డి, శ్రీరాఘవరెడ్డి, ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల సమన్వయకర్త బీఈవీఎల్ నాయుడు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను ఇన్ఫోసిస్ క్యాంపస్ అనుసంధాన ప్రతినిధి డాక్టర్ కె.సుధీర్రెడ్డి, ప్రాజెక్టు నిర్వాహకులు నర్రా సురేష్, ఎంపిక ప్రతినినిధి సుందరం, ప్రోగ్రాం మేనేజర్ అనిల్, ప్రసాద్ నిర్వహించారు.