breaking news
integrated school
-
‘ఇంటిగ్రేటెడ్’లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
ఖమ్మం రూరల్: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న పాఠశాల నిర్మాణ పనులకు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 28 పాఠశాలలకు శంకుస్థాపన చేయగా.. పాలేరు నియోజకవర్గానికి స్థానం దక్కడం ఆనందంగా ఉందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 3 వేల మంది పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో శిక్షణ ఉంటుందన్నారు. పది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణమే.. విద్యారంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శమని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్లో పెట్టిన 22 వేల మంది ఉపాధ్యాయుల పదోన్నతులు, 34 వేల మంది బదిలీలను వివాదాలకు తావు లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మండలానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
రాయదుర్గం: రాష్ట్రంలో ప్రతీ మండలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఒక్కో పాఠశాలను 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్కు దీటుగా వీటిని అందుబాటులోకి తెస్తామని, వీటి ఏర్పాటుకు ఇప్పటికే బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని చెప్పారు. శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ‘మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు. వారి ఆశలను తీర్చేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వం మీపై పెట్టుకున్న కలలను నిజం చేయడానికి కష్టపడి చదువుకొని మీ లక్ష్యాలను సాధించండి’అని చెప్పారు. విద్యా, వైద్య రంగాల్లో సమూల ప్రక్షాళన విద్యా, వైద్యరంగాల్లో సమూల ప్రక్షాళన చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజల సమస్యలను ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గాలికి వదిలేయదన్నారు. సంక్షేమం, విద్యకు బడ్జెట్ సమస్య కాదని, ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆడంబరాలకు పోయే నాయకులకు భిన్నంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరాడంబరంగా విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, సహకార్యదర్శి సక్రూనాయక్, రీజినల్ కోఆర్డినేటర్ శారద పాల్గొన్నారు. ఘనంగా భట్టి జన్మదిన వేడుకలుసాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదినం సందర్భంగా శనివారం ఉదయం నుంచే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రజాభవన్కు తరలివచ్చారు. పోచమ్మ తల్లి ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సతీమణి నందినితో కలిసి అభిమానుల సమక్షంలో 50 కేజీల కేక్ను కట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్తోపాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ ఉద్యోగులు కేక్ కట్ చేయించి భట్టికి శుభాకాంక్షలు తెలియజేశారు. గాంధీభవన్లోనూ పార్టీ నేతలు కేక్ కట్ చేసి భట్టి జన్మదిన వేడుకలను నిర్వహించారు. రేవంత్ శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి భట్టికి సీఎం రేవంత్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింత సేవచేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పోస్ట్ చేశారు. -
'రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్'
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. ఆయన బుధవారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. రూ.26 కోట్లు వెచ్చించి నిర్మించే ఈ పాఠశాలలో కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తామని చెప్పారు. నిరుపేదల బాలల్లో డ్రాపౌవుట్స్ను నివారించేందుకు అన్ని వసతులను ఈ పాఠశాలలో కల్పిస్తామని తెలిపారు. అలాగే, తాడేపల్లిగూడెంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రంలో విద్యావంతులైన యువతీ యువకులకు భాష, వృత్తి పరమైన అంశాలపై నిపుణులచే శిక్షణ ఇస్తారని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు.