-
విద్యారంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు: బొత్స
-
AP: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, విజయవాడ: ఆర్జీయూకేటీ ఇంటిగ్రేటెడ్ కోర్సు అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 77 శాతం మంది ఆర్జీయూకేటీలో సీట్లు దక్కించుకున్నారు. తొలి 20 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూలు విద్యార్ధులే సాధించారు. చదవండి: విజయవాడ మీదుగా దసరా ప్రత్యేక రైళ్లు ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ, వైఎస్సార్ ప్రారంభించిన ఆర్జీయూకేటీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కొత్తగా ఒంగోలు క్యాంపస్ ప్రారంభించామన్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు చేట్టామన్నారు. ఈబీసీ కోటాలో 400 సీట్లు కేటాయించామన్నారు. -
ఇక కృత్రిమ మేధను చదివేయొచ్చు..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్ వంటి జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థలే కాదు.. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లోనూ ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. దీంతో జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు అందుకు ఓకే చెప్పాయి. వీటి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 4 కాలేజీలకు ఆమోదం తెలపగా, మరో రెండు కాలేజీలకు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం తెలపనుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా.. కేంద్ర విధాన నిర్ణయాల్లో భాగంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ వంటి కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు విద్యా సంస్థలు ముందుకు రావాలని సూచించింది. ఏఐ నైపుణ్యాలు కలిగిన వారికి మార్కెట్లో విపరీత డిమాండ్ ఉండగా, ఆ నైపుణ్యం ఉన్న వారు 2.5 శాతమే ఉన్నట్లు నేషనల్ ఎంప్లాయిబిలిటీ సర్వేలో తేలింది. 2016లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ 3.2 బిలియన్ డాలర్లు కాగా, 2025 నాటికి 89.86 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదట ఐఐటీ హైదరాబాద్ ముందుకు వచ్చి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు కూడా గత 8 నెలలుగా ఆయా కోర్సులపై కసరత్తు చేశాయి. కోర్సుల డిజైనింగ్, బోధన సిబ్బంది తదితరాలపై ప్రణాళికలు రూపొందించుకుని వర్సిటీల నుంచి ఆమోదం పొందాయి. ఏడు కాలేజీల్లో కొత్త కోర్సులు.. రాష్ట్రంలోని ఏడు కాలేజీల్లో ఆరు రకాల కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముందుకొచ్చాయి. ఏఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటి ప్రధాన అంశాలతో స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పేరుతో కొత్త కోర్సును రూపొందించింది. ఇక బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక కోర్సుగా సీవీఎస్ఆర్ కాలేజీ, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తోంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ను వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, కంప్యూటర్సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సీవీఆర్ కాలేజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (నెట్వర్క్స్)ను, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కోర్సులను కిట్స్ కాలేజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కోర్సును మల్లారెడ్డి కాలేజీలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ఇందులో సీవీఎస్ఆర్, విద్యాజ్యోతి, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మల్లారెడ్డి కాలేజీల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రెండుమూడు రోజుల్లో స్టాన్లీ, కిట్స్ కాలేజీల్లోనూ ప్రవేశాలకు అనుమతి లభించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రతి కాలేజీకి 60 సీట్లు.. మొదటిసారిగా కోర్సును ప్రవేశ పెడుతున్నందున 60 సీట్లకే వర్సిటీలు ఆమోదం తెలిపాయి. దీంతో మొత్తంగా ఆయా కాలేజీల్లోని ఆయా కోర్సు ల్లో 480 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వివిధ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్ల పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. 13 ఇంజనీరింగ్ కాలేజీల్లో 780 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇన్నాళ్లు బీటెక్ ఎంబీఏగా ఇంటిగ్రేటెడ్ కోర్సును రద్దు చేసి, ఆ సీట్లను బీటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కలిపింది. ఇందులో గతంలో 75 సీట్లు మాత్రమే ఉండగా, ఇ ప్పుడు వాటి సంఖ్య 150కి చేరుకోనుంది. బీటెక్తోపాటు ఎంటెక్ కలిగిన ఈ ఐదేళ్ల కోర్సుకు డిమాండ్ ఉండటంతో జేఎన్టీయూ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. -
బహుళ ప్రయోజనాలకు ఇంటిగ్రేటెడ్ కోర్సులు
ఒకప్పుడు డీగ్రీ తర్వాత పీజీ చేయాలంటే వేర్వేరు కాలేజీల్లో చేరడం తప్పనిసరి. ఆ మేరకు సంబంధిత నిబంధనలు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే అవకాశాన్ని కల్పించడానికి ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఆవిర్భవించాయి. జాతీయ స్థాయిలో పలు యూనివర్సిటీలతోపాటు రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాల యాలు, ఐఐఎస్సీ, ఐఐటీలు కూడా ఇంజనీరింగ్ నుంచి హ్యుమానిటీస్ అంశాల వరకు ఈ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు.. ఇంజనీరింగ్లోను.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు కేవలం సంప్రదాయ కోర్సులకే పరిమితం కాలేదు. ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ ఈ ఒరవడి కొనసాగుతోంది. ఐఐటీల విషయానికొస్తే..ఎంఎస్సీ, ఎంఎస్సీ టెక్, ఎంటెక్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల కాల వ్యవధి-ఐదేళ్లు. ఐఐటీ-ఖరగ్పూర్ ఎంఎస్సీ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఫిజిక్స్), ఐఐటీ-బాంబే ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఐఐటీ-రూర్కీ ఎంఎస్సీ (అప్లయిడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఐఎస్ఎం-ధన్బాద్ ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్), ఐఎస్ఎం-ధన్బాద్ ఎంఎస్సీ టెక్ (స్పెషలైజేషన్స్-అప్లయిడ్ జియాలజీ, అప్లయిడ్ జియోఫిజిక్స్). ఐఐటీ-రూర్కీ ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్), ఐఐటీ-వారణాసి ఎంటెక్ ( ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, జియోఫిజికల్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్) కోర్సులను అందిస్తున్నాయి. అంతేకాకుండా పలు రకాల స్పెషలైజేషన్స్తో బీటెక్+ఎంటెక్, ఎంఫార్మసీ డ్యూయల్ డిగ్రీ, బీఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జేఈఈ-అడ్వాన్స్డ్ ర్యాంక్ ఆధారంగా ఇందులో ప్రవేశం పొందొచ్చు. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) ఎంట్రెన్స్ ద్వారా ఎంఎస్సీ- పీహెచ్డీ, ఎంఎస్సీ- పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఐఐటీల్లో చదివే అవకాశం ఉంది. ఐఐఎస్సీ బీఎస్-ఎంఎస్, ఐఐఎం-ఇండోర్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ వంటి విభిన్న కోర్సులను కూడా అందిస్తున్నాయి. జేఎన్టీయూలో కూడా: జేఎన్టీయూ-హైదరాబాద్ కూడా డబుల్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. అవి.. బీటెక్+ఎంటెక్ (సివిల్ ఇంజనీరింగ్), బీటెక్ (సివిల్)+ఎంబీఏ , బీటెక్+ఎంటెక్ (మెకానికల్), బీటెక్ (మెకానికల్)+ఎంబీఏ, బీటెక్ (ఈఈఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈఈఈ), బీటెక్ (ఈసీఈ)+ఎంబీఏ, బీటెక్+ఎంటెక్ (ఈసీఈ), బీటెక్+ఎంటెక్ (సీఎస్ఈ), బీటెక్ (సీఎస్ఈ)+ఎంబీఏ. ఈ కోర్సుల్లో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అమెరికాలోని ఫ్లైట్ యూనివర్సిటీ, బ్యాంకాక్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సహకారంతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సుల్లో ఎంసెట్/జేఈఈ-మెయిన్ స్కోర్ ప్రామాణికంగా అడ్మిషన్లు నిర్వహిస్తారు. జేఎన్టీయూ-కాకినాడ, ఆంధ్రా యూనివర్సిటీలు కూడా డబుల్ డిగ్రీ ప్రోగ్రామ్లను అందజేస్తున్నాయి. సంప్రదాయ సబ్జెక్ట్లలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని పలు యూనివర్సిటీలు కూడా సంప్రదాయ సబ్జెక్ట్లలో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందజేస్తున్నాయి. అవి..ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంబీఏ, ఎంఏ (అప్లయిడ్ ఎకనామిక్స్), ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ (ఎకనామిక్స్), నాగార్జున యూనివర్సిటీ ఎంబీఏ, ఎంఎస్సీ (నానో టెక్నాలజీ). ఆయా యూనివర్సిటీలు నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇంటిగ్రేటెడ్ విభాగంలో ఎంఏ/ఎంఎస్సీ కోర్సులను బోధిస్తుంది. కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సులను సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారు. 10 సెమిస్టర్లు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్ సబ్జెక్ట్లను వర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఎంఏ విభాగంలో హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సులు, హ్యుమానిటీస్ కింద తెలుగు, హిందీ, ఉర్దూ భాషా కోర్సులు ఉన్నాయి. సోషల్ సెన్సైస్ కింద ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ.. సైన్స్ అభ్యర్థులకు డిగ్రీ అర్హతతో ఎంఎస్సీతోపాటు పీహెచ్డీ చేసే అవకాశాన్ని కొన్ని రకాల కోర్సులు క ల్పిస్తున్నాయి. ఈ కోర్సులను ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీకోర్సులుగా వ్యవహరిస్తారు. అటువంటి ఇన్స్టిట్యూట్లలో ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, బయలాజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ -బెంగళూరు, కూడా బయలాజికల్ సైన్స్, కెమికల్ సెన్సైస్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. అంతేకాకుండా పలు ఇన్స్టిట్యూట్లు కూడా ఇటువంటి కోర్సులను ప్రవేశపెట్టాయి. తద్వారా పీజీ, పీహెచ్డీ కోర్సులను ఒకే చోట పూర్తి చేసే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది. ప్రయోజనాలు ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఎంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఒకే చోట చదివే అవకాశం లభిస్తుంది. తద్వారా విలువైన సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. ఉదాహరణకు ఇంజనీరింగ్లో డిగ్రీని తీసుకుంటే.. బ్యాచిలర్ నాలుగేళ్లు, పీజీ రెండేళ్లు కలిపి మొత్తం ఆరేళ్లు. అదే ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఐదేళ్లలోనే కోర్సును పూర్తి చేయవచ్చు. సంబంధిత సబ్జెక్ట్తోపాటు ఇతర అంశాలపై కూడా మంచి అవగాహన వస్తుంది. అంతేకాకుండా మారుతున్న పరిస్థితులు, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్ను రూపొందిస్తారు. తద్వారా కెరీర్లో త్వరగా స్థిరపడొచ్చు. ఐఐఎం లక్నో: ఐపీఎంఎక్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-లక్నో, ఏడాది వ్యవధి గల ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కోర్సుకు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ కోర్సును నాలుగు టర్మ్లలో బోధిస్తారు. ప్రతి టర్మ్ తొమ్మిది వారాల పాటు ఉంటుంది. ఇందులో మేనేజీరియల్ ఎకనామిక్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, కార్పొరేట్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, జనరల్ మేనేజ్మెంట్ వంటి అంశాలను బోధిస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రవేశ విధానం: జీమ్యాట్ స్కోర్ (2011, జూలై 1-అక్టోబర్ 30, 2014 మధ్య స్కోర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు), అనుభవం ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్వ్యూలు డిసెంబర్లో ఉంటాయి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 31, 2014. -
ఇక అన్నీ ఇంటిగ్రేటెడ్ కోర్సులే!
' ఇంటర్తోనే ప్రవేశపెట్టేందుకు ఎన్సీటీఈ కసరత్తు ' ఐదారు రకాల కోర్సులపై అధ్యయనం ' నేడు బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్తోనే ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏడాది కోర్సులుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎంఈడీ) కోర్సులను వచ్చే విద్యా సంవత్సరంలో రెండేళ్ల కోర్సులుగా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ విద్యలో ఇంటిగ్రేటెడ్ కోర్సులనే ప్రవేశపెట్టే అంశంపైనా దృష్టి సారించింది. అంతేకాదు పక్కాగా కళాశాలల నియంత్రణకు చర్యలు చేపట్టాలని నిర్ణయిం చింది. ఈ అంశాలన్నింటిపై శనివారం బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల్లోని విద్యాశాఖ అధికారులు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తోంది. ఉపాధ్యాయ విద్యను బలోపేతం చేయాల్సిందేనన్న జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్సీటీఈ పలు కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ పూనమ్ బాత్రా, ప్రొఫెసన్ ఎన్కే జాన్గిరా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తమ నివేదికలను రెండు నెలల కిందట ఎన్సీటీఈకి అందజేశాయి. ఆ కమిటీలు ఉపాధ్యా య విద్య ప్రాధాన్యం, విద్యార్థులను తీర్చిదిద్దడంతో క్రియాశీల ంగా వ్యవహరించే ఉపాధ్యాయ పాత్ర, వారికి ఇచ్చే శిక్షణ ఎలా ఉండాలన్న వివిధ అంశాలను చర్చించారు. పలు సూచనలు, సలహాల కోసం దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, అధికారులు కళాశాలల యాజమాన్యాలతో ఎన్సీటీఈ సమావేశాలు నిర్వహిస్తోంది. కళాశాలలను కూడా పటిష్టం చేసే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ప్రతి కళాశాలలో 100 సీట్లు ఉంటే 50 సీట్లకు ఒక సెక్షన్ను ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. 1:15 రేషియోలో రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని పేర్కొంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బోధించేందుకు ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు ఉండగా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు అవసరమా? లేదా? అనే అంశాలపైనా చర్చించనుంది. ఎన్సీటీఈ ప్రణాళిక .. వివరాలు - రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ + గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (2+3+2) - నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2) - గ్రాడ్యుయేషన్ + రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+2+2) - గ్రాడ్యుయేషన్ + మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (3+3) - నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఏ/బీఎస్సీ బీఈడీ) + రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (4+2)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
విద్యుత్ శాఖకు రూ.20 లక్షల నష్టం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement