breaking news
Institute of Cost Accountants of India
-
జనవరిలో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో కాస్ట్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించనున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఎంఏఐ) ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ తెలిపారు. ఇదే థీమ్తో జనవరి 9 నుంచి 11 దాకా న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు బుధవారమిక్కడ విలేకరు లకు ఆయన వివరించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 2,000 మంది పైచిలుకు డెలిగేట్స్ దీనికి హాజరు కానున్నట్లు తెలిపారు. మరోవైపు, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానానికి సంబంధించి 3 ఏళ్లలో 3.5 లక్షల మంది ప్రొఫెషనల్స్కు శిక్షణనిచ్చేలా ప్రభుత్వం పథకం ప్రారంభిం చబోతోందని సింగ్ చెప్పారు. ఇందులో సుమారు 1 లక్ష మందికి ఐసీఎంఏఐ శిక్షణ నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆరు నెలల పాటు సాగే శిక్షణకు రూ. 3,000 ఫీజు ఉంటుందని తెలిపారు. -
కాస్ట్ అకౌంటింగ్తో మేకిన్ ఇండియాకు జోష్
‘సాక్షి’ ఇంటర్వ్యూ ఐసీఏఐ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించినప్పుడే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలం. అనవసర వ్యయాలను తగ్గించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంతో చైనాతో పోటీ పడాలంటే కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ్సను అమలు చేయాలంటున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రెసిడెంట్ ఎ.ఎస్. దుర్గా ప్రసాద్తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... కొత్త కంపెనీల చట్టంలో కాస్ట్ అకౌంటెంట్స్ పాత్రపై.. . కొంతకాలంగా కాస్ట్ అకౌంటింగ్పై ఉన్న అనిశ్చితికి తెరపడింది. ప్రపంచంలోనే ప్రత్యేకత కలిగిన ఇండియా కాస్ట్ అకౌంటింగ్ విధానానికి కొత్త కంపెనీల చట్టం 2013లో ప్రాధాన్యత తగ్గించిన మాట వాస్తవమే. మొన్నటి చట్ట సవరణ తర్వాత తిరిగి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. కొత్తగా కాస్ట్ అకౌంటింగ్ పరిధిలోకి హాస్పిటల్స్, విద్యా సంస్థలను తీసుకొచ్చినా ఆటోమొబైల్, ఆహార తయారీ, విత్తన తయారీ వంటి కొన్ని కీలక రంగాలను తప్పించారు. చట్ట సవరణలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి? కాస్ట్ ఆడిటింగ్ నిర్వహించాల్సిన రంగాలను రెగ్యులేటెడ్, నాన్ రెగ్యులేటెడ్గా విభజించారు. రెగ్యులేటెడ్ విభాగంలోకి వచ్చే టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, విద్యుత్ పంపిణీ సంస్థలు, పెట్రోలియం, ఔషధాలు, ఫార్మా, ఇండస్ట్రీ ఆల్కహాల్ కంపెనీల వార్షిక టర్నోవర్ రూ. 50 కోట్లు దాటితే, అదే నాన్ రెగ్యులేటెడ్ కంపెనీలు అయితే రూ. 100 కోట్ల టర్నోవర్ దాటితే విధిగా కాస్ట్ ఆడిటింగ్ నిర్వహించాలి. ఇది కాకుండా రూ. 35 కోట్ల టర్నోవర్ దాటిన ప్రతీ సంస్థ విధిగా కాస్ట్ అకౌంటింగ్ బుక్స్ను నిర్వహిస్తే సరిపోతుంది. కానీ ట్రస్టుల ద్వారా నిర్వహించే హాస్పిటల్స్, విద్యా సంస్థలను మాత్రమే కాస్టింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఎగుమతుల నుంచే ఆదాయంలో 70 శాతం ఆర్జించే ఫార్మా కంపెనీలను కాస్టింగ్ నుంచి తప్పించారు. అందుబాటు ధరలో వైద్యం, విద్య లభించాలంటే వ్యయ నియంత్రణ చాలా కీలకం. కాస్టింగ్లోకి విద్య, వైద్య రంగాలను పూర్తిగా తీసుకురావాలనే అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలవనున్నాం. ధరల విషయంలో అంతర్జాతీయ కంపెనీలతో పోటీ..! కాస్ట్ కాంపిటీటివ్నెస్లో ఇండియా చాలా వెనుకబడి ఉంది. మొదటి 60 దేశాలను తీసుకుంటే మనం ఎక్కడో 48 స్థానంలో ఉన్నాం. అనవసర వ్యయాలను తగ్గించుకొని అతి తక్కువ ధరలకే వస్తువులను అందించగలిగినప్పుడే విదేశాలతో మనం పోటీ పడగలం. ఈ దిశలో కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమలును తప్పనిసరి చేస్తూ చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రానున్న కాలంలో ఐసీఏఐ కార్యకలాపాలు... తొలిసారిగా కీలకమైన వైద్యం, విద్యా రంగాల్లో కొన్ని విభాగాలను ఈ పరిధిలోకి తీసుకురావడంతో అందుబాటు ధరలో వైద్యం, విద్య లభించే విధంగా వీటికి సంబంధించిన మాన్యువల్స్ను త్వరలోనే విడుదల చేయనున్నాం. ఇన్ఫ్రా రంగంలో కీలకమైన పీపీపీ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ రంగాలపై శ్వేతపత్రాలను తయారు చేస్తున్నాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. ఇందుకోసం అసోచామ్తో కలిసి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా వర్చువల్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వ్యయ నియంత్రణతో పాటు, ట్యాక్సేషన్, ఇతర సేవలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నాం. కొత్త నిబంధనలపై మా సభ్యులకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా సుమారు 50-60 శిక్షణా తరగతులను నిర్వహించనున్నాం. వ్యవసాయం, ఫార్మాలపై జాతీయ సదస్సులను నిర్వహించనున్నాం. కాస్ట్ అకౌంటెంట్స్కు డిమాండ్ ఏవిధంగా ఉంది? గత రెండు ఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. అలాగే ప్రాంగణ నియామకాల్లో సగటును రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 9.5 లక్షలు జీతాలు లభించాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఐటీ కంపెనీలతో పాటు ఆస్ట్రేలి యా, అమెరికా, కెనడాల వంటి పలు దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. గతంలో ఐసీడబ్ల్యూఏఐగా ఉన్న పేరును మార్చడంపై ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కదా? రెండు సంస్థల పేర్లు ఒకే విధంగా ఉండటంపై కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. తొలుత ఐసీఏఎంఐగా మార్చడాన్ని చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ వ్యతిరేకించింది. అటుతర్వాత మా సంస్థ పేరును ఐసీఏఐగా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది మరింత గందరగోళానికి దారితీయడంతో మేనేజ్మెంట్ అకౌంటెంట్స్గా మార్చుకోవడానికి ఈసారి చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అడ్డుచెప్పకపోవచ్చని భావిస్తున్నాం. ఇప్పటికే మా సభ్యులను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ)గా వ్యవహరిస్తున్నాం. దీంతో మా సంస్థ పేరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఎంఐ)గా మారడానికి ఇబ్బందులు ఉండకూదని అంచనా వేస్తున్నాం. -
ఐసీడబ్ల్యూఏ టాపర్ మనోడే
ఐసీడబ్ల్యూఏ టాపర్ మనోడే మాస్టర్మైండ్స్ విద్యార్థికి ప్రథమ ర్యాంక్ గుంటూరు, న్యూస్లైన్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ-సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థి కోట లీలా నాగకుమార్ అఖిలభారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. మాస్టర్మైండ్స్లో చదివిన ఈ విద్యార్థి గుంటూరులోని ఏటీ అగ్రహారం వాసి. తండ్రి సుబ్బారావు చిన్నతనంలోనే మరణించగా, తల్లి సుభాషిణికిళ్లీషాపు నడుపుతూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. పదో తరగతి వరకూ గుంటూరులోని వేణుగోపాల్ నగర్లోని మున్సిపల్ పాఠశాలలో చదివిన నాగకుమార్ చార్టర్డ్ అకౌంటెంట్గా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని మాస్టర్మైండ్స్ సంస్థలో చేరాడు. కాగా తమ విద్యార్థి అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల మాస్టర్మైండ్స్ సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ శుక్రవారం ఆనందం వెలిబుచ్చారు. మున్సిపల్ స్కూల్లో చదివిన విద్యార్థికి తాము జూనియర్ ఇంటర్ మొదలు ఎంఈసీ, సీఏ-సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ వరకూ ఉత్తమ శిక్షణతో క్వాలిఫైడ్ సీఏగా తీర్చిదిద్దామన్నారు. నాగకుమార్కు ఐసీఏఐ సంస్థ మూడు ప్రతిభా పురస్కారాలు ప్రకటించిందన్నారు. వి.శ్రీనివాసన్ స్మారక బంగారు పతకం, ఇందుమతి తలాటి రజత పతకం, సుభాష్ ఆధ్య స్మారక నగదు బహుమతులను ఏప్రిల్ 8న కోల్కతాలో బహూకరించనున్నారన్నారు. గతేడాది క్వాలిఫైడ్ సీఏగా బయటకు వెళ్లిన విద్యార్థి నాగకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో అకౌంటెంట్ ఇన్ ట్రైనీగా చేరాడన్నారు. శిక్షణ అనంతరం ఏడాదికి రూ. 6 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు.