breaking news
Infra companies
-
ఆరునెలల గరిష్ఠానికి చేరిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ల ఖర్చు
సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ల అంచనా వ్యయం సెప్టెంబర్లో ఆరునెలల గరిష్ఠాన్ని తాకినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం..సెప్టెంబర్లో ఇన్ఫ్రా ప్రాజెక్ట్లపై చేసే ఖర్చులు ఆరు నెలల గరిష్టానికి పెరిగాయి. సెంట్రల్ ప్రాజెక్ట్ల అంచనా వ్యయం సెప్టెంబర్లో అసలు వ్యయం కంటే 21.92% ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఇది 19.08%గా ఉంది. దాంతో కేంద్రం అదనంగా రూ.4.5 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్ఫ్రా ప్రాజెక్టులకు చేసే వ్యయం మొత్తం రూ.24.8 లక్షల కోట్లుగా ఉండనుంది. అయితే అవి పూర్తయ్యే సమయం కూడా అంతకు ముందు అంచనా వేసిన 36.96 నెలల నుంచి 38.63 నెలలకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టుతో పోలిస్తే ఆలస్యమవుతున్న ప్రాజెక్టుల సంఖ్య సెప్టెంబర్లో 830 నుంచి 823కు తగ్గాయి. కానీ అందులో 58శాతం రెండేళ్లుగా ఆలస్యమవుతున్న వాటి జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్లో 46 ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు నివేదికలో తెలిపారు. -
చేయాల్సిన పనులివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదిత నీటి పారుదల ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలను చైనాకు చెందిన ఇన్ఫ్రా కంపెనీలు పరిశీలించాయి. గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో చైనా ప్రతినిధుల బృందం కరీంనగర్లో పర్యటించింది. జిల్లాలోని ధర్మారం మండలంలోని బసంత్నగర్, చొప్పదండిలోని లక్ష్మీపూర్ గ్రామాల్లో కలియతిరిగింది. ఈ సందర్భంగా వారికి గోదావరి నుంచి మిడ్మానేరు వరకు నీటి తరలింపు కోసం తవ్వే సొరంగ మార్గాల గురించి నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్ వివరించారు. ఆ తర్వాత హైదరాబాద్కు చేరుకుని మూసీపై 42 కిలో మీటర్ల మేర నిర్మించతలపెట్టిన స్కైవేల (ఆకాశ మార్గం) ప్రతిపాదిత స్థలాన్ని బృందం పరిశీలించింది. వంతెన నిర్మాణ ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ వివరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న బృందం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో సమావేశమైంది. మూసీపై స్కైవేలు తక్కువ కాలంలో నిర్మిచాలని సీఎం వారికి సూచించారు.ఈ పనులకు సంబంధించి నెలలోగా నివేదిక ఇస్తామని ప్రతినిధులకు చెప్పారు. అలాగే హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ వద్ద నిర్మించే ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై కూడా వారు చర్చించారు. నిర్మాణ రంగంలో వస్తున్న నూతన మార్పులు, చైనాలో అవలంబిస్తున్న పద్ధతులను ప్రతినిధులు కేసీఆర్కు వివరించారు. ఒక్క రోజులోనే మూడు ఫ్లోర్ల వరకు భవనాలు నిర్మించే ‘ఫ్రీ కాస్టింగ్’ విధానం గురించి వివరించారు. హైదరాబాద్లో అత్యంత ఎత్తై టవర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సీఎం కోరా రు. సమావేశంలో అంజు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెరైక్టర్లు యోగేష్ వా, మనోజ్ గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ చైర్మన్ రాజ్ కుమార్, బ్రిడ్జి డిజైనింగ్ విభాగాధిపతి బీపీ సింగ్, ప్రతినిధులు మార్క్ వ్యూ, ఝాయ్, సీఎం ముఖ్య కార్యద ర్శి నర్సింగ్రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ఫ్రా సంస్థలకు వడ్డీ మోత
ఆస్తులు అమ్ముకున్నా తగ్గని వడ్డీభారం మిగిలిన ఆస్తులు అమ్ముదామన్నా కొనేవారు కరువుఆర్బీఐ రేట్ల తగ్గింపు ప్రభావం కనిపించడం లేదు లబోదిబోమంటున్న ఇన్ఫ్రా కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడచిన ఆరు నెలల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను ముప్పావు శాతం తగ్గించింది. అయినా.. ఇన్ఫ్రా కంపెనీల కష్టాలు తగ్గకపోగా మరింత పెరుగుతున్నాయి. కంపెనీల ఫలితాలను చూస్తే ఇదే అర్థమవుతోంది. వడ్డీరేట్లు తగ్గుతున్నా.. అప్పులు తగ్గించుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నా...వడ్డీభారం అంతకంటే వేగంగా కొండలా పెరిగిపోతోంది. గడచిన ఏడాది కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరు ప్రధాన ఇన్ఫ్రా కంపెనీలు రుణాలకు చెల్లిం చిన వడ్డీల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. ఈ ఆరు కంపెనీలు 2013-14లో వడ్డీల కింద రూ. 8,300 చెల్లిస్తే, గడచిన ఏడాది ఈ మొత్తం రూ. 10,000 కోట్లకు చేరింది. ఆర్బీఐ వడ్డీరేటు తగ్గించినా ఆ మొతాన్ని బ్యాంకులు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. చాలా బ్యాంకులు 25 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు మాత్రమే తగ్గించాయి. ఆర్బీఐ జనవరిలోనే వడ్డీరేట్లు తగ్గించినా ఆంధ్రాబ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు జూన్ వరకు పాత రుణాలపై వడ్డీరేట్లను తగ్గించలేదు. తెలుగు రాష్ట్రాల ఇన్ఫ్రా కంపెనీలకు ఆంధ్రాబ్యాంక్ పెద్ద మొత్తంలో రుణాలను ఇవ్వడంతో ఈ కంపెనీలు ఇంత వరకు వడ్డీరేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేకపోయాయి. ఐదేళ్ళ క్రితం రుణాలు ఏడు శాతం మీద తీసుకుంటే... ఇప్పుడు 14 శాతం మీద వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఒక ఇన్ఫ్రా కంపెనీ అధినేత వాపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిరేటును దాటేస్తుందన్న సర్వే నివేదికలు నమ్మి అప్పులు తీసుకొని భారీ ప్రాజెక్టులను మొదలు పెట్టామని, ఇప్పుడవి ఆగిపోగా.. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామన్నారు. ఆస్తులు అమ్మినా.. గడిచిన ఏడాది కాలంలో జీఎంఆర్, ల్యాంకో, ఐవీఆర్సీఎల్, ఎన్సీసీ కంపెనీలు గుదిబండగా మారిన ప్రాజెక్టులను విక్రయించుకోవడం ద్వారా రుణ భారం తగ్గించుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక రుణ భారం ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రా విషయాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు కొన్ని రోడ్డు ప్రాజెక్టుల్ని విక్రయించడం ద్వారా సుమారు రూ. 6,000 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకుంది. అయినా.. ఏడాది కాలంలో జీఎంఆర్ గ్రూపు చెల్లించిన వడ్డీ రూ. 2,972 కోట్ల నుంచి రూ. 3,572 కోట్లకు చేరిందంటే వడ్డీరేట్లు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ల్యాంకో ఇన్ఫ్రా రూ. 6,300 కోట్లకు ఉడిపి ప్లాంట్ను విక్రయించి రుణ భారాన్ని తగ్గించుకున్నా.. ఆ ప్రయోజనం పుస్తకాల్లో కనిపించడం లేదు. గణాంకాలను మార్చి ఆర్థిక వృద్ధిరేటు 4% నుంచి 7.3%కి పెంచినట్లు చూపిస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయని, మరికొన్ని ఆస్తులు అమ్ముకుందామన్నా కొనేవారే కనపడటంలేదని ఇన్ఫ్రా కంపెనీల ప్రతినిధులు వాపోతున్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి ఏడాదయినా.. ఆగిపోయిన ఒక్క భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టు మొదలు కాలేదని అంటున్నారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం భవిష్యత్తుపై ఆశలను చిగురింప చేస్తున్నాయని ఇన్ఫ్రా కంపెనీ అధినేత పేర్కొన్నారు. గ్యాస్, బొగ్గు సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు ఆగిపోగా, చాలా రహదారుల ప్రాజెక్టులు పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేక మధ్యలో ఆగిపోయాయి. దీంతో కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించేసుకున్నాయి. ఒకప్పుడు జీఎంఆర్ గ్రూపులో ఉద్యోగుల సంఖ్య 5,000కుపైగా ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1,500 లోపునకు పరిమితం కావడం దీనికి నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆగిపోయిన ప్రాజెక్టుల క్లియరెన్స్లపై దృష్టిసారించాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.