breaking news
Information & Public Relations
-
అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: అక్రిడేషన్ లేని మహిళా జర్నలిస్టులందరికీ మాస్టర్ హెల్త్ చెకప్లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా జర్నలిస్టులకు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం.. మాసాబ్ ట్యాంక్లోని సమాచార, పౌర సంబంధాల కార్యాలయంలో ప్రారంభించిన విషయం విదితమే. శ్రీరామ నవమి సందర్బంగా గురువారం సెలవు దినం కారణంగా ఈ హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించలేదని, రేపు(శుక్రవారం) నుండి తిరిగి యథావిధిగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు (ఏప్రిల్ 3 వతేదీ ఆదివారం మినహా) నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. చదవండి: నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..! ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించే ఈ మాస్టర్ హెల్త్ చెకప్లో రక్త పరీక్ష (C.B.P), బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, విటమిన్ B12, D3 మొదలైనవి, ECG, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు ఉంటాయి. స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, డెంటల్ పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు మొదలైనవి ఉంటాయని. ఈ పరీక్షల నివేదికలను అదే రోజున అందజేయనున్నట్టు అర్వింద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
'రఘువీరా నోరు అదుపులో పెట్టుకో'
విజయనగరం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఐటీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర సంక్షేమం కోసం సాయం చేయండని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరితే అభినందించాల్సింది పోయి... అడుక్కునే ముఖ్యమంత్రి మనకు వద్దని పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయబట్టే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదని ఆయన ఆరోపించారు. ఆంధ్ర ప్రజల శాపనార్థాలు ఆ పార్టీకి తగులుతాయని మండిపడ్డారు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు మద్యం సిండికేట్ నడిపిస్తున్నారనే ఆరోపణల గురించి ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డిని విలేకర్లు ప్రశ్నించగా... బెల్టుషాపులపై చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయించాలని.. అలాగే సిండికేట్ బాస్లు ఎవరైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో మంత్రి కె. మృణాళిని, జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు, ఎమ్మెల్యే నాయుడు తదితరులు పాల్గొన్నారు.