breaking news
industries establish
-
అన్ని చోట్లా పరిశ్రమలు
పటాన్చెరు: దిగుమతులకు చరమగీతం పాడేలా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం పది వేల ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఆల్ప్లా పరిశ్రమలో మౌల్డింగ్ కేంద్రం,డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదార్లకు భరోసా: గతంలో పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేశారని, ఇప్పుడు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదార్లకు భరోసాను కల్పిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించామన్నారు. గ్రీన్ (సాగు), వైట్ (క్షీర), బ్లూ (నీలి – మత్య్స), పింక్ (మాంసాహార), ఎల్లో (ఆయిల్ – వంటనూనె) విప్లవం కొనసాగుతుందని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, 25 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు (మొత్తం సాగు విస్తీర్ణంలో 15 శాతం) లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిన ఆల్ప్లా పరిశ్రమ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఆల్ప్లా గ్లోబల్ సీఈఓ ఫిలిప్ లెహనర్, సంస్థ ఇండియా ఎండీ వాగీశ్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు లేని పరిశ్రమలు
కొత్తూరు ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండానే వెలుస్తున్నాయి. ఏవైనా ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరిగే వరకు ఇలాంటి పరిశ్రమలు కొనసాగుతున్నాయనే విషయం ఉన్నతాధికారులకు తెలియడం లేదు. స్థానిక అధికారుల ఉదాసీనతతోనే ఇలాంటి పరిశ్రమలు వెలుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకోకపోవడంతో ప్రభుత్వానికి అయా పన్నుల రూపంలో రావాల్సిన లక్షల రూపాయలు కూడా రావడం లేదు. ప్రస్తుతం షాద్నగర్ నియోజకవర్గంలో 313 పరిశ్రమలు కొనసాగుతుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నట్లు పరిశ్రమల శాఖ లెక్కలు తెలుపుతున్నాయి. – కొత్తూరు కొత్తూరు: హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో భా గంగా నగర సమీపంలోని కాలుష్యకారక పరిశ్రమలను అక్కడి నుంచి తరలించాలని అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు నోటీసులు అందించారు. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులు షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, షాద్నగర్ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తూ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అయితే, వ్యవసాయ భూములను కొనుగోలు తర్వాత ప్రభుత్వానికి నిర్ణీత పన్నులు చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ, పదెకరాలు కొనుగోలు చేస్తే కేవలం రెండు, మూడెకరాలు మాత్రమే వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీతో పాటు అన్ని శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ మాత్రం బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం పొందేందుకు వీలుగా ఉండే అనుమతులు మాత్రమే పొందుతున్నారు. పరిశ్రమల నిర్మాణాలను సంబంధించిన పత్రాలను పంచాయతీకి అందిస్తే వారు ఆ నిర్మాణాల ఆధారంగా ప్రతి ఏడాది పన్నులు వసూలు చేస్తారు. కాగా నిర్వాహకులు పూర్తిసా ్థయి నిర్మాణ పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో పన్నులు తక్కువగా వసూలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతోన్న పరిశ్రమల్లో తదుపరి అవసరాల కోసం కొత్తగా చేపట్టే నిర్మాణాలకు అనుమతులు తీసుకోవడంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాము టీఎస్ ఐపాస్లో దరఖాస్తు చేసుకున్నాం.. అన్ని అనుమతులు ఉన్నాయని ప్రకటిస్తున్నప్పటికీ గేటు బయట పరిశ్రమల పేర్లను మాత్రం నమోదు చేయడం లేదు. పట్టించుకోని అధికారులు..... ప్రభుత్వ అనుమతులు లేకుండా చిన్న షెడ్డును నిర్మించిన వారిపై చర్యలు తీసుకునే సంబంధిత శాఖ అధికారులు ఏకంగా పరిశ్రమలను స్థాపించి అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్తూరు మండలంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న గోదాములు, పరిశ్రమలు, అప్పటికే కొనసాగుతున్న వాటి వివరాలు అధికారులకు తెలిసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు నివేదిస్తాం... అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసే పరిశ్రమలు, గోదాముల వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పరిశ్రమలపై మాకు సమాచారం లేదు. – సాధన, ఈవోపీఆర్డీ, కొత్తూరు. -
పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉంటే చాలు : కలెక్టర్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆసక్తి ఉంటే చాలు ఎలాంటి పరిశ్రమలైనా స్థాపించవచ్చని కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పరిశ్రమలు స్థాపించాలంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి అవసరం లేదన్నారు. జిల్లాలో 4 వేల చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ద్వారా దాదాపు 75 వేల మందికి ఉపాధి దొరుకుతోందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోందన్నారు. ఇటీవలే 61 మంది పారిశ్రామికవేత్తలకు రూ.5 కోట్ల ప్రోత్సాహకాలు అందించామన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్బాబు, మేయర్ స్వరూప, ఎల్డీఎం జయశంకర్, ఇతర బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.