breaking news
indra gandhi
-
చంపేస్తారని ముందే తెలుసు
సింగపూర్: మాజీ ప్రధాన మంత్రి, తన తండ్రి రాజీవ్ గాంధీని హత్యచేసిన వారిని తన కుటుంబం పూర్తిగా క్షమించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజలను ద్వేషించటం తమకు చాలా కష్టమైన పని అన్నారు. సింగపూర్లో ఐఐఎం పూర్వవిద్యార్థులతో సంభాషణలో రాహుల్.. పలు అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నందునే ఇందిర, రాజీవ్లు హత్యకు గురయ్యారన్నారు. ‘నాన్న, నానమ్మ చనిపోతారని మాకు ముందే తెలుసు. తనను చంపేస్తారని నానమ్మ నాతో చెప్పేది. నాన్నను కూడా చంపేస్తారంది. రాజకీయాల్లో దుష్టశక్తులతో పోరాటంలో.. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు చనిపోవటం ఖాయం. మేం (రాహుల్, ప్రియాంక) చాలారోజుల వరకు హంతకులపై ఆవేదనగా, కోపంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వారిని మేం పూర్తిగా క్షమించేశాం’అని రాహుల్ పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీటర్లో పోస్టు చేసింది. ‘చరిత్రలో భిన్న సిద్ధాంతాలు, భిన్న శక్తుల మధ్య పోరాటం జరిగినపుడు ఇలాంటి ఘటనలు సహజమే. మా నానమ్మను చంపిన వారితో నేను బ్యాడ్మింటన్ ఆడేవాణ్ణి. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ హతమైన విషయాన్ని టీవీలో చూస్తున్నపుడు.. ఆయన కుటుంబం, పిల్లలు ఎంత బాధపడి ఉంటారోనని అనిపించింది. ఎందుకంటే తండ్రిపోతే పిల్లలు ఎలా బాధపడతారో నాకు బాగా తెలుసు. వెంటనే ప్రియాంకకు ఫోన్ చేసి అతనే నాన్నను చంపాడని చెప్పా. దీనిపై నేను సంతోషపడాలి కానీ ఎందుకో సంతోషం అనిపించటం లేదన్నా. తను కూడా సంతోషంగా లేనని ప్రియాంక చెప్పింది’ అని రాహుల్ పేర్కొన్నారు. -
ప్రణబ్ వ్యాఖ్యలు సరికావు
-
ఫోర్త్ ఏస్టేట్ : యమ అర్జెన్సీ
-
మొదట 'చేయి' కామ్రేడ్లదే...!
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉన్న హస్తంను మొదటి సార్వతిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించారు. 1952లో కాంగ్రెస్ పార్టీది కాడెడ్ల గుర్తు. దీంతోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసింది. హైదరాబాద్ సంస్థానం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కంకికొడవలి గుర్తుపై పోటీ చేశాయి. హైదరాబాద్ సంస్థానంలో నిషేధం ఉండటంతో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరిట ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సంఘం పీడీఎఫ్ అభ్యర్థులకు హస్తం గుర్తును కేటాయించింది. 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కంకికొడవలి గుర్తే లభించింది. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. 1970లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇందిరాగాంధీ అభయహస్తం గుర్తును స్వీకరించారు. అప్పటి నుంచి అదే గుర్తును కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. తొలుత కమ్యూనిస్టులకు కేటాయించిన చెయ్యి గుర్తు కాలక్రమంలో కాంగ్రెస్కు శాశ్వత గుర్తుగా మిగిలింది.