breaking news
Indirect Fight
-
పాక్ ఆర్మీ చీఫ్పై ఇమ్రాన్ ఆరోపణలు
లాహోర్: పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష విమర్శలు చేశారు. తన పదవి పోయేందుకు కీలక స్థానాల్లో ఉన్న కొందరు కారణమని దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలనుద్దేశించి ‘ప్రతి సంస్థలో మనుషులుంటారు. అందులో ఒకరిద్దరు తప్పుడువారైనంత మాత్రాన మొత్తం సంస్థను బాధ్యురాలిగా చేయలేము. ఒకవేళ ఒకరు (జనరల్ బజ్వా) తప్పు చేస్తే అది మొత్తం సంస్థ తప్పు చేసినట్లు కాదు.’’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యానికి తమ పార్టీకి మధ్య సంబంధాలు గత కొద్ది నెలలుగా క్షీణించాయని పాక్ మాజీ మంత్రి ఫవాద్ చెప్పారు. ఐఎస్ఐ చీఫ్గా నదీమ్ అంజుమ్ నియామకాన్ని ఇమ్రాన్ గతేడాది తొలుత తిరస్కరించి తర్వాత ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయనకు సైన్యంతో చెడింది. దేశ చరిత్రలో గుర్తుండే ర్యాలీ నిర్వహణకు తన మద్దతుదారులంతా గురువారం మినార్ ఐ పాకిస్తాన్కు చేరాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. ఒకపక్క ఆర్మీ చీఫ్ను విమర్శిస్తూ మరోపక్క సైన్యాన్ని ఆయన ప్రశంసించారు. -
'బ్లేమ్ గేమ్' వద్దు.. చర్చలు ముద్దు...
ఇస్లామాబాద్: తీవ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తుందని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఖండించింది. మోడీ వ్యాఖ్యలను ఆధారరహిత వాక్పటిమగా కొట్టివేసింది. పరస్పర విమర్శలు మానుకోవాలని సూచించింది. 'బ్లేమ్ గేమ్' బదులు చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. భారత్పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని.. దేశంలో అమాయక ప్రజలను హతమారుస్తోందని జమ్మూకాశ్మీర్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంప్రదాయ యుద్ధానికి దిగే దమ్ము లేక పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని విమర్శించారు.