breaking news
India develops
-
ప్రగతి పథంలో ముందుకు
ఇండోర్: భారతీయ సంప్రదాయక విజ్ఞానాన్ని నమ్ముకున్న భారత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విజయపథంలో దూసుకుపోతోందని రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. గత ఐదు త్రైమాసికాలతో పోలిస్తే ఈ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రతి ఒక్కరి అంచనాలు పటాపంచలు చేస్తూ భారత్ ఏకంగా 7.80 శాతం వృద్ధిరేటును సాధించిన నేపథ్యంలో భారత పురోభివృద్ధిని భాగవత్ ప్రస్తావించడం గమనార్హం. ఆదివారం మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు చెందిన ‘పరిక్రమ కృపాసారం’పుస్తకాన్ని ఇండోర్లో ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో భాగవత్ మాట్లాడారు. ‘‘3,000 ఏళ్లపాటు భారత్ విశ్వశక్తిగా కొనసాగినన్నిరోజులు ప్రపంచంలో ఎలాంటి ఆధిపత్యపోరు, సంఘర్షణలు జరగలేదు. ఇప్పుడు ప్రపంచదేశాల్లో నెలకొన్న ఘర్షణలన్నీ స్వప్రయోజనాలకు సంబంధించినవే. ఇవే అన్ని సమస్యలకు మూలం. భారతీయుల పూర్వీకులు జ్ఞాన, కర్మ, భక్తి భావనలను ఎలా సమన్వయం చేసుకుని జీవించాలో మనకు బోధించారు. ఈ సంప్రదాయక తత్వాన్ని భారత్ మనసావాచా కర్మణా పాటిస్తోంది. అందుకే ప్రతి ఒక్కరి అంచనాలను తప్పు అని ప్రకటిస్తూ ప్రగతిపథంలో భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది’’అని అన్నారు. మాజీ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ చేసిన వ్యాఖ్యలను భాగవత్ ఉదహరిస్తూ.. ‘‘మేం(బ్రిటన్) మీకు (భారత్కు) స్వాతంత్య్రం ఇస్తే అంతర్గత వైషమ్యాలు, విబేధాలతో విడిపోతారు. కలిసి ఉండటం కల’అని వెక్కిరించారు. ఆయన అంచనాలు సైతం తప్పు అని భారత్ నిరూపించింది. ఐకమత్యాన్ని చాటింది. ఆర్థికాభివృద్ధితో పురోగమిస్తోంది. విడిపోదామని బ్రిటన్లోనే కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ విభజన దిశలో అడుగులేస్తోంది. కానీ భారత్ విడిపోదు. మనం ముందుకే వెళతాం. గతంలో మనం విభజనకు గురయ్యాం ఇప్పుడు మళ్లీ ఆ ఐక్యతను సుసాధ్యంచేద్దాం’’అని అన్నారు. విశ్వాసాలు, నమ్మకాల మీదనే ప్రపంచం ముందుకుపోతోంది. అలాంటి నమ్మికలకు భారత్ పుట్టినిల్లు. ఇక్కడి వాళ్లంతా కర్మసిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. గోవులు, నదీమతల్లులు, వృక్షాలను పూజిస్తూ తద్వారా ప్రకృతి ఉపాసనను భారతీయులు ఆచరిస్తారు. అలా ప్రకృతిలో జీవిస్తారు. అలాంటి ప్రకృతి సంబంధం కోసం నేటి సమాజం అర్రులుచాస్తోంది. కానీ గత 300–350 సంవత్సరాలుగా ప్రపంచంలో చాలా దేశాలు ఎవరి దారి వారిదే, బలవంతులే బతకాలి అనే తప్పుడు వాదనకు జైకొట్టాయి. దాంతో సమస్యలొస్తున్నాయని వాళ్లకు ఇప్పడు అర్థమైంది. జీవితనాటకంలో మనందరం పాత్రధారులం. నాటకం ముగిసినప్పుడే మనం ఎవరనేది మనకు బోధపడుతుంది’’అని ఆయన అన్నారు. -
కన్నుల పండువగా...
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’లో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన స్వాతంత్య్ర సమరయోధుల కలలు సాకారం చేయడానికి, ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి పౌరులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. → ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరు కావడానికంటే ముందు ప్రధాని మోదీ తొలుత రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాం«దీకి ఘనంగా నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఎర్రకోటకు బయలుదేరి వెళ్లారు. → పంద్రాగస్టు వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. మోదీ ఈసారి కాషాయ రంగు తలపాగా ధరించారు. తెల్లరంగు కుర్తా, కాషాయ రంగు బంద్గలా జాకెట్ ధరించి, జాతీయ జెండా ఎగురవేశారు. ఆయన గత 12 ఏళ్లుగా స్వాతంత్య్ర దినోత్సవాల్లో దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేర్వేరు రంగులు తలపాగాలు ధరిస్తున్నారు. → స్వాతంత్య్ర దినోత్సవాల ప్రసంగాల విషయంలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును మోదీ తిరగరాశారు. మోదీ వరుసగా 12 ఏళ్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఈ విషయంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాతి స్థానం మోదీదే కావడం విశేషం. నెహ్రూ ఎర్రకోట నుంచి వరుసగా 17 సార్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి హోదాలో మొత్తం 16 సార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించగా, ఇందులో వరుసగా ప్రతిఏటా చేసిన ప్రసంగాలు 11 మాత్రమే. → ఈసారి వేడుకలకు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ప్రజలకు విశిష్టమైన సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలు, సర్పంచ్లు, లఖ్పదీ దీదీలతోపాటు వినూత్న సాగు పద్ధతులతో గుర్తింపు పొందిన రైతులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విజేతలుగా నిలిచివారికి కూడా ఆహా్వనం పలికింది. త్వరలో స్పెషల్ ఒలింపిక్స్లో పాల్గొన్నబోతున్న భారత క్రీడాకారులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సేవలందించిన వాలంటీర్లు, పారిశుధ్య కారి్మకులు సైతం హాజరయ్యారు. → వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1,500 మంది తమ సంప్రదాయ వ్రస్తాలు ధరించి రావడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. → ప్రధానమంత్రి ప్రసంగం ఏకంగా 103 నిమిషాల పాటు సాగింది. → మోదీ తన ప్రసంగంలో పలు కవితలను ప్రస్తావించారు. ‘సమృద్ధ భారత్’కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ కష్టపడి పనిచేసేవారే చరిత్ర సృష్టిస్తారని కవిత రూపంలో చెప్పారు. ఉక్కు లాంటి రాళ్లను ముక్కలు చేసే సత్తా కలిగినవారికి కాలం కూడా సహకరిస్తుందని అన్నారు. కాలాన్ని మనకు అనువుగా మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని ఉద్ఘాటించారు. → రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత అయిన రాహుల్ గాంధీ ఈసారి ఎర్రకోట వద్ద వేడుకులకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
ఇంజినీర్లు, డాక్టర్లతో దేశాభివృద్ధి సులువు: కలాం
హైదరాబాద్: దేశంలోని ఇంజినీర్లు, డాక్టర్లను ప్రొత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని భారత మాజీ రాష్టపతి, ప్రముఖ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. కానీ వారు తమతమ వృత్తుల్లో చాలా బిజీగా ఉన్నారని అన్నారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన బయోమెడికల్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లతో దేశాభివృద్ధి సులువుగా సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాని యూనివర్శిటీలకు సూచించారు. సోలార్ పవర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అబ్దుల్ కలాం ఈ సందర్భంగా వివరించారు.