-
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
-
అసాధారణ సెలవు నిబంధనలు ఇలా..
పశ్చిమగోదావరి, నిడమర్రు : ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు–1933 ప్రకారం సర్వ సాధారణంగా ఉద్యోగులకు ఏ విధమైన ఆర్జిత సెలవు గాని అర్థవేతన సెలవు గానీ లేనిపక్షంలో అసాధారణ సెలవు కోసం అభ్యర్థిస్తారు. అసాధారణ సెలవు(ఎక్సాట్రార్డినరీ లీవ్) మరో విధంగా జీతం లేని సెలవు(లీవ్ ఆన్ లాస్ఆఫ్ పే)గా పరిగణిస్తారు. అంటే ఏ ఇతర సెలవు ఉద్యోగికి అర్హత లేనప్పుడు అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. ఈ అసాధారణ సెలవు నిబంధనలు తెలుసుకుందాం. ఇతర సెలవులు ఉన్నప్పుడు కూడా.. ఉద్యోగి లిఖితపూర్వక అభ్యర్థన మేరకు ఆర్జిత సెలవు, అర్థజీతపు సెలవు సదరు ఉద్యోగి ఖాతాలో నిల్వ ఉన్నప్పటికీ అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. అసాధారణ సేవల కాలానికి ఎలాంటి జీతభత్యాలు రావు. అసాధారణ సెలవు–ఇంక్రిమెంట్లు ♦ ప్రభుత్వ ఉద్యోగి తన శక్తికి మించి అసహాయ పరిస్థితుల్లో రోగ పీడితుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందిన పక్షంలో గాని, లేక పై చదువులకు గాని, సాంకేతికపరమైన చదువులకు గాని ♦ అసాధారణ సెలవు మంజూరు చేసిన యెడల, అట్టి అసాధారణ సెలవు ఇంక్రిమెంట్లు మంజూరు చేయుటకు పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సస్పెన్షన్కు గురైన ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణించినపుడు అట్టి కాలాన్ని వార్షిక ఇంక్రిమెంటుకు పరిగణించుటకు వీలు లేదు. ♦ ఉద్యోగి మెడికల్ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అసాధారణ సెలవుపై వెళ్లిన సందర్భాలలో సంబంధిత శాఖాధిపతి అట్టి సెలవు కాలాన్ని 6 నెలలకు మించకుండా వార్షిక ఇంక్రిమెంటు కోసం కలుపుకొనుటకు అనుమతించవచ్చు. అంతకు మించిన కాలానికి ప్రభుత్వ అనుమతి కావాలి. ♦ 2002 జీవో ప్రకారం ఉద్యోగి ప్రత్యేకంగా శాఖాధిపతికి అభ్యర్థన పత్రం సమర్పించనవసరం లేదు. శాఖధిపతి బా«ధ్యత వహించి అవసరమైన చోట ప్రభుత్వ అనుమతి పొంది, అసాధారణ కాలాన్ని ఇంక్రిమెంట్కు కలిపి వార్షిక ఇంక్రిమెంటులను విడుదల చేయాలి. అట్టి వివరాలు సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ♦ ఈ సెలవుకు మెడికల్ సర్టిఫికెట్లు ♦ అసాధారణ సెలవు మెడికల్ ధ్రువీకరణ పత్రం ఆధారంగా పొందుటకు, గెజిటెడ్ అధికారులైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగులైతే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి మెడికల్ సర్టిఫికెట్ పొందవచ్చు. ముఖ్య నిబంధనలు.. ♦ ఏ ఉద్యోగి కూడా మొత్తం సర్వీసులో ఇలాంటి సెలవులపై ఐదేళ్లు మించి వెళ్లకూడదు. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతిపై ఐదేళ్లు మించి వెళ్లవచ్చు.అసాధారణ సెలవు పరిమితులు ♦ సాధారణంగా 3 నెలల వరకూ తీసుకోవచ్చు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసినవారు మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 6 నెలలు వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు తీసుకోవచ్చు. ♦ ఏడాది సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగి క్షయ లేదా కుష్టు వ్యాధికి గురై, ఆస్పత్రులలో చేరినా లేదా ఔట్ పేషెంట్గా చికిత్స పొందుతున్న సందర్భంలో సంబంధిత మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన సర్టిఫికెట్ ఆధారంగా 18 నెలల వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు మంజూరవుతుంది. ♦ క్యాన్సర్, మానసిక వ్యాధులకు గురైన ఉద్యోగులు గుర్తింపు పొందిన వైద్య సంస్థ గాని లేక డాక్టరు జారీచేసిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా 12 నెలల వరకు ప్రభుత్వ అనుమతితో సెలవు ఇస్తారు. ♦ అసాధారణ సెలవు ఇతర సెలవులతో కలపి తీసుకొనవచ్చు. ♦ ఉద్యోగులు విదేశాల్లో ఉద్యోగం చేయుటకు కొన్ని షరతులకు లోబడి ఐదేళ్ల వరకు అసాధారణ సెలవు పొందవచ్చు. ♦ ఉద్యోగులు ఏ క్యాటగిరీకి చెందినవారైనప్పటికీ సాంకేతిక నిపుణులు, సాంకేతిక నిపుణులు గాని, లేక గుమస్తాలు గాని విదేశాల్లో ఉద్యోగం పొందుటకు దరఖాస్తు చేసుకుని వెళ్లుటకు అవకాశం కల్పించారు. ♦ కాని విదేశాలలో ఉద్యోగం అన్వేషించుటకు అసాధారణ సెలవు మంజూరు చేయకూడదు. ♦ ఉద్యోగ నియామక ఉత్తర్వులు పొందిన తర్వాత ఉద్యోగం చేయుటకు మాత్రమే సెలవు మంజూరు చేయవచ్చు. ♦ అసాధారణ సెలవు ఇంక్రిమెంట్కు, జీతభత్యాలకు, సెలవు తదితరాలకు పరిగణించబడదు. ♦ ఉద్యోగి ప్రభుత్వానికి ఏ విధమైన బాకీలు ఉండకూడదు. ఉద్యోగిపై ఏవిధమైన కేసులు న్యాయస్థానాలలో పెండింగ్లో ఉండకూడదు. ♦ ఇట్టి అసాధారణ సెలవు పూర్తికాల సర్వీసులో ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ♦ విదేశాల్లో పనిచేయుటకు ఐదేళ్లలో, ఒక్కసారి గాని లేక విడతల వారీగా గాని అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు. -
వేతన వేదన!
సకాలంలో జీతాలందక వైద్య, ఆరోగ్య శాఖలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విలవిల మూడునెలలకోసారి విడుదల చేస్తున్న వైనం జీతాల పెంపుపైనా మీనమేషాలు ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు జిల్లా ఆస్పత్రిలో వీరిదే కీలకపాత్ర సాధారణంగా ఉద్యోగం చేసే సగటు వ్యక్తికి ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు జీతం డబ్బులు చేతికొచ్చేస్తాయి. కానీ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి మాత్రం నెలనెలా వేతనాలు అందని ద్రాక్షే. కనిష్టంగా మూడునెలలు దాటిన తర్వాతే వేతనాలు రావడం వారికి పరిపాటిగా మారింది. సర్కారు నిర్లక్ష్యం.. దానికితోడు అధికారుల ఉదాసీన వైఖరితో వారికి క్రమం తప్పకుండా జీతం రాని పరిస్థితి తలెత్తింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : తాండూరులోని జిల్లా ఆస్పత్రితో సహా పలు క్లస్టర్ ఆస్పత్రుల్లో రెండు వందలకుపైగా ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరికి నెలావారీగా వేతనాలు అందక విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మూడు నెలలు గా జీతాలు అందలేదు. నాలుగో తరగతి కేటగిరీలోని ఆయా తదితరులకు ఆర్నెళ్లుగా వేతనాలు విడుదల కాకపోవడంతో అప్పులుచేసి పూటగడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి వేతనాలకు సంబంధించి దాదాపు రూ.25 లక్షల బకాయిలున్నట్లు అంచనా. జిల్లాలో వైద్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది కీలక బాధ్యతలే నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్యంతోపాటు ఎక్స్రే, డార్క్రూం అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఈసీజీ టెక్నీషియన్ తదితర కేటగిరీల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందే ఉన్నారు. కొన్నిచోట్ల రెగ్యులర్ ఉద్యోగులున్నప్పటికీ పనిఒత్తిడిని బట్టి వీరిని ఎంపిక చేసుకున్నారు. ప్రాధాన్యత ఉన్న విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతన చెల్లింపుల్లో జాప్యం చేయడంతో వారంతా సమ్మె బాటపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనున్నట్లు సంఘనేత శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. సమ్మె చేపడితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు స్తంభించిపోనున్నాయి. పెంపులోనూ నిర్లక్ష్యమే.. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనపెంపులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిన సమయంలో ఇతర కేటగిరీల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు పెంచాలి. కానీ ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదు. గతంలో రెండుసార్లు పీఆర్సీతోపాటే వేతనాలు పెంచగా.. ఇప్పుడు సర్కారు వేతన పెంపుపై మౌనం వహించిందని ఫార్మసిస్టు అనీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. శమదోపిడీ జరుగుతోంది.. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నప్పటికీ.. వేతనాలు మాత్రం ఉపాధి కూలీల కంటే తక్కువగా చెల్లిస్తోంది. తాండూరు జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగికి రూ.50వేల వేతనం ఇస్తుండగా.. అదే ఆస్పత్రిలో అదే ఉద్యోగం చేస్తున్న నాకు రూ.9,200 ఇస్తోంది. మా ఇద్దరి మధ్య వేతనాల విషయంలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇంతే. గతంలో రెండుసార్లు పీఆర్సీ అమలు చేశారు. కానీ ఈసారి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్సీ అమలు చేయకుండా నిలుపుదల చేసింది. - శ్రీనివాస్, డార్క్రూమ్ అసిస్టెంట్, తాండూరు ఆస్పత్రి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement