breaking news
Illegal transfer
-
మీ బదిలీ ఎందుకు రద్దు చేయొద్దు
టీచర్లకు షోకాజ్ నోటీసులుఅక్రమ బదిలీల వ్యవహారంలో మరికొందరు ఉపాధ్యాయులపై వేటు పడింది. ఇప్పటికే డీఈఓ, ముగ్గురు డిప్యూటీ డీఈఓలపై వేటు పడిన విషయం విధితమే. బదిలీల వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతుండగానే పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ మరో తొమ్మిది మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు. - 9మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు - వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలి - ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ - అక్రమ బదిలీ వ్యవహారం.. విద్యారణ్యపురి : జిల్లాలోని తొమ్మిది మంది ఉపాధ్యాయులయకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు షోకాజ్ నోటీస్లు జారీ చేశారు. ఈఏడాది జూలైలో చేపట్టిన టీచర్ల బదిలీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు బదిలీఅయ్యాక వేరేచోటుకు మాడిఫికేషన్ చేయించుకున్నారని, మరికొందరు స్పౌజ్ కేటగిరీలోనూ నిబంధనలు అతిక్రమించారనే తదితర ఆరోపణలు వచ్చిన విషయం విదితమే ఈ వ్యవహారంపై తొలుత విద్యాశాఖ అడిషనల్ జాయింట్ డెరైక్టర్ సత్యనారాయనరెడ్డి విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవమేనంటూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్కు నివేదించారు. తదుపరి పరిణామాల క్రమంలో డీఈవో చంద్రమోహన్ సస్పెండయ్యూరు. డిప్యూటీ డీఈవోలు రవీందర్రెడ్డి, అబ్దుల్హైనీని ఆదిలాబాద్, మరో డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తిని కరీంనగర్ జిల్లా డైట్ కళాశాలలకు బదిలీ చేశారు. బదిలీ అక్రమాల వ్యవహారంపై ఓవైపు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో 9మంది టీచర్లకు తాజాగా షోకాజ్ నోటీస్లు జారీచేశారు. డీఈవో కార్యాలయం నుంచి ఎంఈవోల ద్వారా ఉపాధ్యాయులకు వీటిని అందిస్తున్నారు. ‘షోకాజ్’లు వీరికే.. లింగాలఘనపురం మండలం నవాబ్పేట ఎంపీపీఎస్ ఎస్జీటీ ఎ.భీమా, చేర్యాల పెద్దమ్మగడ్డ పీఎస్ ఎస్జీటీ బి.కనకయ్య, దేవరుప్పల మండలంలోని ఎస్జీటీ శ్రీకాంత్, డోర్నకల్ మండలం చిలుకోడు జెడ్పీఎస్ఎస్ టీచర్లు రవీందర్, రజనీ, జనగామాలోని ఎస్జీటీ శిరోమణి, దేవరుప్పల మండలం మారముల్ల పాఠశాల ఎస్జీటీ అరుణకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరు తమ మాడిఫికేషన్ను ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యూయి. అలాగే కొడకండ్ల మండలం అవుతాపరం ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నీరజ తొర్రూరు మండలంలో పనిచేస్తున్న తన భర్త మండలానికి లేదా సమీప మండలాలకు స్పౌజ్ కేటగిరీ వినియోగించుకుని విన్నవించాల్సి ఉండగా, సంగెం మండం కాట్రపెల్లికి ఎలా బదిలీ అయ్యారనేది తెలియడంలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ బదిలీ ఎందుకు రద్దు చేయరాదో చెప్పాలంటూ నీరజకు నోటీస్ జారీ అయింది. దీంతో ఉపాధ్యాయులు ఇచ్చే వివరణ కీలకంగా మారింది. నోటీసులు అందిన వారంరోజుల్లో సంజారుుషీ ఇవ్వాలని పేర్కొంటూ షోకాజ్ నోటీస్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. వీరితో కొందరు ఇప్పటికే షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వీటికి జవాబు ఎలా ఇవ్వాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. -
తహశీల్దార్ల బది‘లీలలు’
రాజకీయ ఒత్తిడితో నిబంధనలకు పాతర విజయవాడ సిటీ : జిల్లాలో దాదాపు 15 మంది తహశీల్దార్లను ఎక్కడి వారిని అక్కడ నియమించకుండా ఇష్టారాజ్యంగా బదిలీ చేయడంపై టీడీపీ నేతల హస్తం ఉందని పలువురు రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇటీవల జరిగిన అక్రమ బదిలీలపై రెవెన్యూశాఖలో నిరసన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ అండదండలతో జిల్లా యంత్రాంగం జరిపిన అడ్డగోలు బదిలీలు ఈ విధంగా ఉన్నాయి. జల్లాలో ఇటీవల జరిగిన అక్రమ బదిలీలపై తహశీల్దార్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రాజకీయ ఒత్తిడితో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని పలువురు తహశీల్దార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విన్నవించుకోవడానికి కూడా అవకాశం లేకుండా నియంతృత్వంగా బదిలీలు జరిగాయని తహశీల్దార్లు గగ్గోలు పెడుతున్నారు. బదిలీలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోయినా ఎన్నికల విధులనుంచి తిరిగి జిల్లాలకు వచ్చిన 50 మంది తహశీల్దార్లను ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నేతలు తమతమ ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో కనీసం 15మందిని ఎమ్మెల్యేలు, మంత్రుల కోరికపై అక్రమంగా బదిలీచేశారని ఆరోపణలున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు తమకు ఇష్టంలేని వారిని జిల్లా ముఖ్య అధికారికి చెప్పి అక్రమ పోస్టింగ్లు వేయించడం వివాదాస్పదమైంది. పలువురు తహశీల్దార్లు కూడా ఫైరవీలు చేసి పోస్టింగ్లు వేయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కేవలం కృష్ణాజిల్లాలోనే ఈ విధంగా అక్రమ బదిలీలు జరపడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగింది ఇదీ.. దీనికి సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. గత మార్చిలో ఎన్నికల కోడ్ ప్రకారం జిల్లా నుంచి 50మంది తహశీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం వారు గత నెలలో తిరిగి జిల్లాకు వచ్చారు. నిబంధనల ప్రకారం ఎక్కడి వారిని అక్కడే నియమించాల్సి ఉంది. ఇతర విభాగాల్లో పనిచేసేవారిని ఆ శాఖ ఉన్నతాధికారుల అనుమతితోనే బదిలీ చేయాల్సి ఉంటుంది. సాధారణ బదిలీల జీవో విడుదల కాకుండానే ఈ ప్రక్రియ పూర్తిచేయడంపై ఆవేదన చెందుతున్నారు. టీడీపీ నేతల హస్తం ... ఈ బదిలీల వెనుక టీడీపీ నేతలు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులపై పలువురు టీడీపీ నాయకులు కక్షగట్టి బదిలీలు చేయించినట్లు ఆరోపణలున్నాయి