-
ఇక తెరుసుడే..
వేగంగా బిల్ట్ పునరుద్ధరణ {పోత్సాహకాలపై స్పష్టత ఐఐడీఎఫ్ ద్వారా రూ.30 కోట్లు ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాలోని ఏకైక భారీ పరిశ్రమ బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) పునరుద్ధరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించిన ఒక్కరోజులోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్సిడీపై ముడి కలప, కరెంటు సరఫరా... నిరంతరంగా బొగ్గు సరఫరా అంశాలపై స్పష్టత ఇస్తూ పరిశ్రమల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్), బిల్ట్కు ప్రస్తుతం ఒక మెగావాట్ విద్యుత్ను సరఫరా చేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 25 శాతం టారిఫ్కే మూడు మెగావాట్ల కరెంటును సరఫరా చేయనుంది. సాధారణ ధర కంటే తక్కువకు విద్యుత్ సరఫరా చేయడం వల్ల సబ్సిడీ గరిష్టంగా రూ.9 కోట్లు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. బిల్ట్లో ఉత్పత్తి చేసే కాగితపు గుజ్జుకు ముడి సరుకుగా వినియోగించే జామాయిల్, వెదురు కలపను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీపై సరఫరా చేయనున్నారు. ముడి సరుకు సబ్సిడీ కోసం ఏటా రూ.30 కోట్లు ఇవ్వనున్నారు. కరెంటు, ముడి సరుకులకు సంబంధించి గరిష్ట సబ్సిడీ రూ.30 కోట్లు మించకుండా ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. బిల్ట్కు కేటాయించే సబ్సిడీ మొత్తాన్ని పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి నిధులు(ఐఐడీఎఫ్) నుంచి ఇవ్వనున్నారు. పరిశ్రమల శాఖ కమిషనర్ ద్వారా రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థకు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థలకు ఈ నిధులు చెల్లిస్తారు. పరిశ్రమకు ఇతర ఆర్థిక సమస్యలు ఉండకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్కు రూ.30 కోట్ల చొప్పున ఏడేళ్లు సబ్సిడీ ఇవ్వనుంది. నిర్దేశించిన నియమాలను, ఒప్పం దంలో పేర్కొన్న అంశాలను ఉల్లంఘిస్తే.. సబ్సిడీల కొనసాగింపుపై పునరాలోచిస్తామ ని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బిల్ట్ పునరుద్ధరణపై వేగంగా నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్కు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. ఉప ము ఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాల యానికి వెళ్లారు. బిల్ట్ విషయంలో ప్రభు త్వ నిర్ణయూన్ని జిల్లా ప్రజలు హర్షిస్తున్నారని సీఎంకు తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని డిప్యూటీ సీఎం అన్నారు. బిల్ట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం తనకు ఎంతో సంతోషం కలి గిస్తోంద ని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. బిల్ట్కు ప్రోత్సాహకాలు ఇస్తూ విడుదల చేసిన ఉత్తర్వుల కాపీని చూసి తనకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు. -
మౌలికానికి ఐఎల్అండ్ఎఫ్ఎస్ అండ
న్యూఢిల్లీ: దేశీ మౌలిక రంగానికి అవసరమైన నిధులను అందించేందుకు వీలుగా ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఇన్ఫ్రా డెట్ ఫండ్(ఐఐడీఎఫ్) ఐదు సాధారణ బీమా ప్రభుత్వ రంగ సంస్థలతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. దీనిలో భాగంగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలు ఐఎల్అండ్ఎఫ్ఎస్ ఐడీఎఫ్తో కలసి దేశీయంగా మౌలిక రంగ అభివృద్ధికి కృషి చేస్తాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ సమక్షంలో ఎంవోయూపై ఆయా కంపెనీల సీఈవోలు సంతకాలు చేశారు. ఇన్ఫ్రా ప్రాజెక్ట్లకు అవసరమయ్యే నిధులను చౌకగా సమీకరించేందుకు ఈ కొత్తతరహా విధానం ఉపయోగపడుతుందని మాయారామ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎంవోయూ కుదుర్చుకున్న ప్రతీ సంస్థా 20% వరకూ నిధులను(కార్పస్) సమకూర్చనున్నట్లు తెలిపారు. ఇకపై ఇన్ఫ్రా నిధుల సమీకరణలో బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ కీలకంగా నిలిచే అవకాశమున్నదని తెలిపారు. ఇప్పటికే ఐఎల్అండ్ఎఫ్ఎస్లో ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 125 కోట్లను ఇన్వెస్ట్ చేసింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బీజేవైఎం నిరసన గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
సీఎం యోగిని టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు?
సైబర్ కేటుగాళ్లు దోచేశారు.. ఆర్బీఐ ఉద్యోగినికి రూ.24.5లక్షల టోకరా
వరల్డ్ కప్ నే కాళ్ళ కింద పెట్టుకున్న కెప్టెనే ఇలా అంటే..
Vishnu Priya Photos: టీవీ స్టార్లు కూడా ఎక్కడా తగ్గట్లేదుగా! (ఫొటోలు)
గాజాలో జరుగుతోంది మారణహోమం కాదు: జో బైడెన్
IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement