-
ఉత్తర తెలంగాణలో ఆదర్శగ్రామంగా మల్లంపల్లి
ములుగు: కృషి, పట్టుదలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు పాలకవర్గం అధికారులు కష్టపడితే మారుమూల గ్రామం సైతం ఆదర్శంగా మారుతుంది. అనడానికి జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామం ఉదహరణగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది మల్లంపల్లి రాష్ట్ర స్థాయిలో పోటీపడి ఎస్ఎస్ఐపీ (సెల్ఫ్ సఫీసియంట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ పంచాయతీ) విభాగంలో అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్ లో అవార్డుల ప్రదానోత్సవం ములుగు జిల్లా ఏర్పాటు అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న 27 జీపీల సర్పంచులు, కార్యదర్శులతో కలిసి మల్లంపల్లి పాలకవర్గం, జిల్లా యంత్రాంగం నేడు హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ రాష్ట్ర స్థాయి అవార్డును మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి, కార్యదర్శి పి.రాజు అందుకోనున్నారు. రూ.2.66కోట్లతో మౌలిక వసతులు జిల్లాలోని ములుగు మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ 365, 163 జాతీయ రహదారిపై ఉన్నప్పటికీ సాధారణ జీపీగానే అందరికీ తెలుసు. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.66 కోట్ల నిధులను మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ అవార్డుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి డ్యాక్యు మెంటరీని అధికారులు సమర్పించారు. మండల, జిల్లా స్థాయిలో అవార్డును గెలుచుకున్న మల్లంపల్లి రాష్ట్రస్థాయి అవార్డు కోసం చేసిన డాక్యుమెంటరీలో డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఏర్పాటు, గ్రంథాలయం, కమ్యూనిటీ సెంటర్, విలేజ్ పార్కు, ప్లే గ్రౌండ్, ఈ పంచాయతీ, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక మరుగుదొడ్లు వంటి స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ కింద ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిటీ మల్లంపల్లిని రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లాలో 174 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల 27 గ్రామ పంచాయతీలు 9 అంశాలలో 3 గ్రామ పంచాయతీల చొప్పున 27 పంచాయతీలు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. మల్లంపల్లి వివరాలు ఇళ్లు 1,250 వార్డులు 12 జనాభా 4,670 సహకరించిన వారికి కృతజ్ఞతలు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి కొండా వెంకటయ్య సహకారంతో ఎప్పటికప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రణాళిక రూపొందించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సక్రమంగా పూర్తిచేశాం. పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్, క్రిమిటోరియం, తడి, పొడి చెత్త వేరుచేయడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇటీవల ములుగులో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకున్నాం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. - చందా కుమారస్వామి, సర్పంచ్ మల్లంపల్లి బాధ్యత పెరిగింది మల్లంపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీ అవార్డుకు ఎంపిక కావడంతో గతం కంటే ప్రస్తుతం మరింత బాధ్యత పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాయతీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రతీ పనిని బాధ్యతతో పూర్తి చేశాం. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుని పనులు పూర్తి చేశాం. కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ ప్రజలు అభివృద్ధి పనుల్లో సహకరించారు. ఇక ముందు మల్లంపల్లిని గంగదేవిపల్లిలా ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం. ఇందుకోసం పాలకవర్గం గ్రామ పెద్దలతో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. పి.రాజు, పంచాయతీ కార్యదర్శి మల్లంపల్లి -
పాతికేళ్లుగా మద్యం, మాంసానికి దూరం.. అలా ఎలా సాధ్యమంటే..
సాక్షి, తలమడుగు(ఆదిలాబాద్): మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టకుండా.. నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా. గొడవలు లేకుండా.. ఠాణా మెట్లెక్కకుండా ఐక్యతతో మందుకు సాగుతున్నారు ఈ గ్రామస్తులు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఈ పంచాయతీపై ప్రత్యేక కథనం. నాడు (1997లో) తండాలో పలువురు మద్యానికి బానిసయ్యారు. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో వారి కుటుంబాలు ఛిద్రమయ్యాయి. అప్పుడే తండా పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరూ మద్యం ముట్టవద్దని.. అమ్మవద్దని తీర్మాణం చేశారు. అదే సమయంలో గ్రామానికి నారాయణ బాబా విచ్చేశారు. ఆయన ప్రబోధాలతో మాంసానికి సైతం దూరమయ్యారు. ఆధ్యాత్మికానికి చేరువయ్యారు. ఆధ్యాత్మికం వైపు... గ్రామ జనాభా 800 వరకు ఉంటుంది. నారాయణ బాబా మరణానంతరం గ్రామంలో ఆయన పేరిట 13 ఏళ్ల క్రితం ఆలయం నిర్మించుకున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడం.. అన్నదానాలు చేయడం.. ఏటా దత్తజయంతి ఉత్సవాలను సమష్టిగా ఘనంగా నిర్వహించుకోవడం వీరికి ఆనవాయితీ. సమష్టి నిర్ణయాలతో గ్రామ అభివృద్ధిలోనూ అందరూ భాగస్వాములవుతున్నారు. వృద్ధులను ఆదుకోవాలనే ఉద్దేశంతో శ్రీసద్గురు నా రాయణబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం సైతం నిర్మించి పలువురికి ఆశ్రయం కల్పిస్తున్నారు. సంస్థాన్ అధ్యక్షుడు జాదవ్ కిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నూతన పంచాయతీ... ఇటీవల ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయగా పల్సి తండా అందులో భాగమైంది. సమష్టి నిర్ణయంతో ఏకగ్రీవం బాటపట్టింది. ఎన్నిక లేకుండానే సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకున్నారు ఇక్కడి వారు. మద్యానికి దూరంగా ఉండడంతోనే ఐక్యత నెలకొందని, అంతేకాకుండా గొడవలు లేకుండా శాంతియుతంగా కలిసిమెలిసి ఉంటున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఏకగ్రీవంగానే.. మా గ్రామంలో సర్పంచ్, వార్డుమెంబర్ల ఎన్నికలు జరుగలే. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. ఏకగ్రీవం చేయాలని నిర్ణయించుకున్నాం. సర్పంచ్గా నన్ను ఎన్నుకున్న రు. అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి నా వంతుగా కృషి చేస్తున్నా. – చౌహన్ ఆంగుర్, సర్పంచ్ ఒకే మాటపై ఉంటాం.. గ్రామ జనాభా 800 దాకా ఉంటది. అందరం ఒకే మాటపై ఉంటాం. దానికి కారణం గ్రామంలో పాతికేళ్లుగా మద్యం, మాంసం ముట్టుకోకపోవడమే. పండుగలు, శుభకార్యాలను కలిసిమెలిసి జరుపుకుంటాం. – జాదవ్ కిషన్, నారాయణబాబా సంస్థాన్ అధ్యక్షుడు ఠాణా మెట్లు ఎక్కలే.. మద్యానికి దూరంగా ఉండడంతో ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి గొడవలు జరిగిన సంఘటనలు లేవు. ఠాణా మెట్లు కూడా ఎక్కలే. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. – జాదవ్ విజయ్కుమార్, టీచర్ -
ఈ గ్రామంలో మందు ముట్టరు.. స్టేషన్ మెట్లెక్కరు!
పచ్చని అడవి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఎన్నో ఆదర్శాలకు మారుపేరు. ఆ ఊళ్లోని వారెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు పోలీస్స్టేషన్ మెట్లెక్కింది లేదు. చిన్నా చితకా తగాదాలొచ్చినా.. కూర్చుని మాట్లాడుకుంటారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం గ్రామ ప్రత్యేకతలివీ.. సాక్షి, బయ్యారం: పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవçహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్స్టేషన్కు వెళ్లింది లేదు. తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పునకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు. గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. పదేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల మాదిరిగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిన్నల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. ఈ గ్రామస్తులు అన్నింటా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు. అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అందరికీ మరుగుదొడ్లు మైదాన ప్రాంతంలోనే పూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం జరగని పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న మొట్లతిమ్మాపురంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పల్లె బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఐకమత్యంగా ఉండే ఆ గ్రామంలో అన్ని రాజకీయపార్టీల సానుభూతిపరులు ఉన్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటున్నా.. రాజకీయపరమైన విభేదాలు, పోటీల జోలికి వెళ్లరు. ఎన్నికలప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చే పార్టీ అభ్యర్థికే సమష్టిగా ఓట్లు వేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఒకచోట కూర్చొని సమస్యలను చర్చించుకుంటున్న గ్రామస్తులు పోటీలేదు.. ఇతర పంచాయతీల్లో అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడి డబ్బు ఖర్చుపెట్టి పదవులు కొనుక్కొంటున్న పరిస్థితి.. అందుకు భిన్నంగా నాపై నమ్మకంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నా. – బిజ్జ స్వరూప, సర్పంచ్ గ్రామస్తులు కలసికట్టుగా ఉంటారు కొత్తగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన నాకు మొట్లతిమ్మాపురంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. వివాదాల జోలికి వెళ్లరు. సమస్య వస్తే ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటారు. ఊరిలో మద్యం అమ్మకాల్లేవు. – బానోత్ నరేష్, పంచాయతీ కార్యదర్శి, మొట్ల తిమ్మాపురం రాజకీయాలతో సంబంధం లేదు మా ఊర్లో అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. అయితే ఆ జెండాలు మా మధ్య ఏనాడూ గొడవలు సృష్టించలేదు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నాం. అందుకే మా ఊరి వాసులు పోలీస్స్టేషన్కు వెళ్లే పరిస్థితి ఎదురుకాలేదు. – బూర్క పాపయ్య, గ్రామ వాసి చెప్పినట్లు వింటారు చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు పెద్దమనుషులు చెప్పినట్లు వింటారు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఒక అభిప్రాయంతో పరిష్కరించుకుంటాం. సారా, మద్యం లేకపోవటంతో ఊరు ప్రశాంతంగా ఉంది. – బిజ్జ విశ్వనాథం, గ్రామ వాసి -
ఇబ్రహీంపూర్.. సూపర్
సాక్షి, సిద్దిపేట: ‘ఊరంటే ఇలా ఉండాలి.. ప్రభుత్వం చేపట్టిన ప్రతీ సంక్షేమ పథకం ఇక్కడ అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలయ్యే నిధుల్లో ప్రతీ పైసా సద్వినియోగం అవుతోంది. ఉపాధి హామీ పథకం అమల్లో ఇబ్రహీంపూర్ గ్రామం దేశాని కే ఆదర్శంగా నిలిచింది. మీ నాయకుడు హరీశ్రావు ప్రత్యేక శ్రద్ధకు, మీ అందరి ఐక్యతకు అభినందనలు.. మీ గ్రామం నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం’ అని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో దేశంలోని 15 రాష్ట్రాల నుంచి వచ్చిన చీఫ్ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హరియాణా విధాన సభ స్పీకర్ సహా మొత్తం 61 మందితోపాటు, 25 మంది ఐఏఎస్లు సిద్దిపేట నియోజకవర్గంలోని హరీశ్రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్ గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వారికి స్వాగతం పలికారు. ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టే 26 పనులు ఇబ్రహీంపూర్లో సంపూర్ణంగా అమలు జరగడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతీ పని గురించి ఫొటోలు తీసుకున్నారు. హరియాణా స్పీకర్ కుంపర్పాల్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడి పథకాలను తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని చెప్పారు. గ్రామస్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనడానికి ఇబ్రహీంపూర్ గ్రామం నిదర్శనమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాపురాజయ్య పెయింటింగ్లు, మహిళా ప్రతినిధులకు సిద్దిపేట జిల్లాకు ప్రత్యేకతగా నిలిచే గొల్లభామ చీరలను అందజేశారు. ఐకమత్యంతోనే సాధ్యపడింది.. గ్రామస్తుల ఐకమత్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం ప్రవేశపెడితే దానిని ఇక్కడ అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. దక్షిణ భారత దేశంలోనే నగదు రహిత క్రయవిక్రయాలు అమలు చేసిన గ్రామంగా ఈ ఊరుకు పేరుందని చెప్పారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు రావడం సంతోషంగా ఉందన్నారు. కొందరు విదేశీ ప్రతినిధులు కూడా గ్రామాన్ని సందర్శించి వెళ్లారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్రహీంపూర్ గ్రామం గురించి చర్చ జరగడం ఈ గ్రామస్తుల అదృష్టంగా ఆయన అభివర్ణించారు. గ్రామంలోని చిన్నా.. పెద్దా ఐక్యంగా ఉండటం అభినందనీయమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. భవిష్యత్లో కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిస్తామని చెప్పారు. -
ఆదర్శ గ్రామంగా వన్నెల్(బి)
బాల్కొండ నిజామాబాద్ : నేరాల నియంత్రణకు పోలీసులతో సహకరించడంలో మండలంలోని వన్నెల్(బి) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని సీపీ కార్తికేయ అన్నారు. గ్రామస్తులు రూ.2.7 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్మూర్ డివిజన్లో నేరాల నియంత్రణ కోసం గ్రామస్తులే స్వంతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో వన్నెల్(బి) ముందుందన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో ప్రజలు అందరూ పోలీసులతో సహకరించాలన్నారు. అప్పుడే నేర రహిత సమాజం ఏర్పడుతుందన్నారు. సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనలు ఉన్నాయని వివరించారు. కోర్టుల్లో పోలీసులు ప్రవేశపెడుతున్న సాక్ష్యాలకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇతర గ్రామాల్లో కూడా వన్నెల్(బి) గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తులను చైతన్యవంతులు చేసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేల కృషి చేసిన బాల్కొండ ఎస్ఐ స్వామీగౌడ్ను, గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, ఆర్మూర్ రూరల్ సీఐ రమణరెడ్డి, స్థానిక సర్పంచ్ తాళ్ల భూషణ్, ఎంపీటీసీ రాజు, బాల్కొండ సహకార సంఘం అధ్యక్షుడు తూర్పు రమేశ్రెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కమ్యూనికేషన్ కార్యాలయం ప్రారంభం నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): జిల్లా కేంద్రంలోని పోలీస్లైన్లో ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ కార్యాలయాన్ని శుక్రవారం సీపీ కార్తికేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని సిబ్బంది చక్కగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నూతన భవనంలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని చక్కగా వినియోగిస్తూ నేరాల నియంత్రణ కోసం వాడాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ఎన్ఐబీ, ఏఆర్ ఏసీపీలు సీహెచ్ మహేశ్వర్, రవీందర్, ఎస్బీ సీఐ రాజశేఖర్, ఆర్ఐ శేఖర్, శైలేందర్, రాంనిరంజన్, కమ్యూనికేషన్, ఎస్ఐలు నవీన్కుమార్, ఆర్ చంద్రబోస్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కొల్లు రవీంద్రకు పేర్నినాని సవాల్
బజాజ్ ఫైనాన్స్కు ఆర్బీఐ ఉపశమనం
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
భారీగా పట్టుబడ్డ టీడీపీ, జనసేన డబ్బు..!
YSRCPని గెలిపించండి అని సభ సాక్షిగా చంద్రబాబు
Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ
గాంధీల కంచుకోటలో టికెట్ ఎవరికి ?
నితీశ్ రెడ్డి మెరుపులు..సన్రైజర్స్ అనూహ్య గెలుపు (ఫొటోలు)
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement