breaking news
ICC World XI team
-
హార్దిక్ పాండ్యా స్థానంలో షమీ
లార్డ్స్ మైదానంలో గురువారం వెస్టిండీస్తో తలపడే ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు నుంచి భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తప్పుకున్నాడు. అనారోగ్యం కారణంగా దూరమైన అతని స్థానంలో పేసర్ మొహమ్మద్ షమీకి చోటు లభించింది. మరో భారత ఆటగాడు దినేశ్ కార్తీక్తో కలిసి షమీ బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ను కూడా ఎంపిక చేశారు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్ను నిర్వహిస్తోంది. -
ఐసీసీ వరల్డ్ ఎలెవన్ తుది జట్టు ఇదే!
దుబాయ్ : వెస్టిండీస్తో తలపడే వరల్డ్ ఎలెవన్ తుది జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇప్పటికే క్రికెట్ ఆడే దేశాల నుంచి తొమ్మిది మంది ఆటగాళ్ల పేర్ల ప్రకటించిన ఐసీసీ తాజాగా న్యూజిలాండ్ క్రికెటర్లు లూక్ రోంచి, మిచెల్ మెక్లినగన్లను ఎంపిక చేసింది. ఇంగ్లండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ సారథిగా వ్యవహరించనున్న వరల్డ్ ఎలెవన్ జట్టు ఈ నెల 31న లార్డ్స్లో వెస్టిండీస్తో జరిగే టి20 మ్యాచ్లో తలపడుతుంది. గతేడాది హరికేన్ బీభత్సంతో కరేబియన్ స్టేడియాలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ధ్వంసమైన స్టేడియాలను నవీకరించడానికి నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్ను నిర్వహిస్తున్నారు. ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి ఆల్రౌండర్ హర్ధిక్ పాండ్యా, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్లు ఈ చారిటీ మ్యాచ్ ఆడనున్నారు. ఈ టి20కి ఐసీసీ ఇదివరకే అంతర్జాతీయ హోదా ఇచ్చింది. పాక్ తరఫున అఫ్రిది, షోయబ్ మాలిక్, బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, లంక నుంచి తిసార పెరీరా, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ ఎంపికయ్యారు. కార్లోస్ బ్రాత్వైట్ కెప్టెన్గా సామ్యూల్ బద్రీ, క్రిస్గేల్లతో కూడిన 13 మంది ఆటగాళ్ల జాబితాను వెస్టీండీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ ఎలెవన్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, తిసార పెరీరా, రషీద్ ఖాన్, హర్దీక్ పాండ్యా, లూక్ రోంచి, మెక్లినగన్ వెస్టిండీస్: కార్లోస్ బ్రాత్వైట్, రయాద్ ఎమ్రిత్, ఆండ్రూ ఫ్లెచర్, క్రిస్గేల్, ఎవిన్ లూయిస్, అశ్లే నర్స్, కీమోపాల్, రోవ్మాన్ పొవెల్, దినేష్ రామ్డిన్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, సామ్యుల్ బద్రీ, మార్లాన్ సామ్యుల్స్, కెస్రిక్ విలియమ్స్ -
ప్రపంచకప్ ఎలెవన్కు కెప్టెన్ మెకల్లమ్
దుబాయ్: ఐసీసీ ప్రపంచకప్ ఎలెవన్ జట్టులో భారత్, పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ జట్టుకు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్ సారథి క్లార్క్ కాకుండా న్యూజిలాండ్ ఓపెనర్ బ్రెండన్ మెకల్లమ్నే కెప్టెన్గా ఎంపిక చేశారు. ‘దూకుడైన ఆటతీరే కాకుండా వినూత్న, స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఈ మెగా టోర్నీలో మెకల్లమ్ ఆకట్టుకున్నాడు. అందుకే ఈ జట్టుకు అతడినే కెప్టెన్గా ఎంపిక చేశాం’ అని ఐసీసీ తెలిపింది. టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో రాణించిన ఆటగాళ్లను పలువురు క్రీడా నిపుణులు కలిసి ఓ జట్టుగా ఎంపిక చేశారు. ప్రపంచకప్ ఎలెవన్ జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), గప్టిల్, స్మిత్, అండర్సన్, వెటోరి, బౌల్ట్, సంగక్కర (వికెట్ కీపర్), డివిలియర్స్, మ్యాక్స్వెల్, స్టార్క్, మోర్కెల్, బ్రెండన్ టేలర్ (12వ ఆటగాడు).