breaking news
Hyder Ali
-
విచిత్రరీతిలో రనౌట్ అయిన పాక్ బ్యాటర్
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ విచిత్రరీతిలో స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పిన్నర్ బ్రిగ్స్ వేసిన ఫుల్ లెన్త్ బంతిని బాదేందుకు క్రీజులో నుంచి బయటికి వచ్చి బీట్ అయ్యాడు హైదర్. అయితే, బంతిని పట్టడంలో మొదట బర్మింగ్హామ్ కీపర్ అలెక్స్ డేవియస్ తడబడ్డాడు. గ్లవ్లో తొలుత సరిగా ఒడిసిపట్టలేకపోయి, రెండో ప్రయత్నంలో పట్టుకున్నాడు. ఆలోగానే హైదర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అయితే బంతి కీపర్ అలెక్స్ చేతిలో ఉందని గమనించని హైదర్ అలీ పరుగులు తీసేందుకు క్రీజు దాటి మళ్లీ ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో వికెట్లను గిరాటేశాడు కీపర్ అలెక్స్. దీంతో షాకైన హైదర్ అలీ (48 పరుగులు).. స్టంపౌట్గా పెవిలియన్ చేరాడు. హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను విటాలిటీ బ్లాస్ట్.. ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు హైదర్ అలీని ట్రోల్ చేస్తున్నారు. హైదర్ మందు కొట్టినట్టున్నాడంటూ ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. అతడి కెరీర్లాగే హైదర్ అలీ తికమకపడ్డాడని మరో యూజర్ రాసుకొచ్చారు. అలీ దిమ్మతిరిగిందని మరికొందరు ట్రోల్ చేశారు. ఈ మ్యాచ్లో డెర్బీషైర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్హామ్ బియర్స్ 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో డెర్బీషైర్ చేజ్ చేసింది. డెర్బీ షైర్ కెప్టెన్ డు ప్లూయీ (25 బంతుల్లో 66, నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. సిక్సర్ల మోత మోగించి చివరి వరకు ఉండి సత్తాచాటాడు. Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ — Vitality Blast (@VitalityBlast) June 7, 2023 చదవండి: సిరాజ్కు కోపం తెప్పించిన స్మిత్ చర్య -
ప్రజల గుండెల్లో వైఎస్ చెరగని ముద్ర
మిడ్జిల్ : ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారని వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు హైదర్అలీ అన్నారు. ఆదివారం మిడ్జిల్లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కషి చేయాలన్నారు. పార్టీ పటిష్టానికి కార్యకర్తలు, నాయకులు ముందుండాలన్నారు. వైఎస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జి మరియమ్మ, పార్టీ నాయకులు రాంమోహన్, రామకష్ణారెడ్డి, రాఘవేందర్, అనిల్గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు. -
ఆసరా అందక రాలిన పండుటాకులు
ఒకరు ఆత్మహత్య : ఆరుగురు మృతి సాక్షి నెట్వర్క్: పింఛన్ రాలేదని మనస్తాపం చెంది నల్లగొండ జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు వృద్ధులు మరణించారు. నల్లగొండ జిల్లా పెన్పహాడ్ మండలం లింగా ల గ్రామానికి చెందిన జూకూరి లింగయ్య(60) మానసిక వికలాంగుడు. ఏ ఆసరా లేని లింగయ్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకో గా, మంజూరు కాలేదు. మనస్తాపం చెంది శుక్రవారం క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా, శనివారం చనిపోయా డు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం హరి పురం గ్రామానికి చెందిన తుమ్మల పెద్ద రాజయ్య(70) పేరు జాబితాలో లేకపోవడంతో కలత చెందాడు. నాలుగు రో జులు ఆహారం మానేసిన రాజయ్య శనివారం మృతి చెందాడు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటకు చెందిన ఎండీ హైదర్ అలీ (70)కి గతం లో పింఛన్ వచ్చేది. కొత్త జాబితాలో పేరు లేకపోవడంతో మనో వేదనకు గురై, శనివారం మరణించాడు. సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన రావుల లచ్చమ్మ(84)కు కూడా పింఛన్ వచ్చేది. ప్రస్తుతం ఆసరా అందకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైంది. శనివారం మృతి చెందింది. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపా డు శివారు కొత్త తండాకు చెందిన నూనావత్ బిక్షం(90) పేరు పింఛన్ జాబితాలో లేకపోవడంతో ఎలా బతకాలని ఆలోచిస్తూ శుక్రవా రం రాత్రి చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన దారం చిన్ననాగయ్య(70)కు పిం ఛన్ వచ్చేది. జాబితాలో పేరు లేదని తెలుసుకొని బెంగపెట్టుకున్నాడు. శనివారం ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ప్రాణాలు వది లాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన మంగలి శివరాములు(65) కుమార్తె సాయమ్మ (25) మానసిక వికలాంగురాలు. గతంలో ఈమెకు పింఛన్ వచ్చేది. ప్రస్తుత జాబితాలో కుమార్తె సాయమ్మ పేరులేదు. దీనికి తోడు శివరాములు కూడా ఏడాదిన్నర క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు. సదరం క్యాంపులకు వెళ్లినా వికలాంగ ధ్రువీకరణ రాలేదు. దీంతో నిరాశలో ఉన్నాడు. తాజాగా, పింఛన్ జాబితాలో కుమార్తె పేరు లేదని కలత చెందాడు. వికలాంగురాలైన కుమార్తెను ఎలా పోషించాలో తెలియక మనోవేదనతో గుండె పోటుకు గురయ్యాడు. పింఛన్ కోసం అన్నపానీయాలు బంద్ రెండు రోజులుగా వృద్ధురాలి నిరసన ఆందోళనలో కుటుంబ సభ్యులు తూప్రాన్: ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా అందిస్తున్న పింఛన్ జాబితాలో తన పేరు లేదని ఓ వృద్ధురాలు రెండు రోజులుగా అన్నపానీయాలు మానేసి నిరసన తెలుపుతోంది. మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పిట్ల పోచమ్మ (85) వితంతువు. కాగా.. అప్పులబాధతో పన్నెండేళ్ల క్రితం కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అత్త, కోడళ్లు వితంతు పింఛన్ తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఆసరా’ పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు రూ.1000 అంది స్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం గ్రామ పంచాయతీ వద్ద వీఆర్ఓ అరుణ గ్రామానికి చెందిన అర్హుల జాబితా అతికిం చింది. అందులో గ్రామానికి చెందిన 09 మంది కి చెందిన వితంతువుల పేర్లు లేవు. విషయం తెలుసుకున్న పిట్ల పోచమ్మ తనకున్న ఒక్క ఆసరా రాకుండా పోయిందని బాధపడుతూ శుక్రవారం నుంచి అన్నపానీయాలు మానేసింది. కుటుంబ సభ్యులు ఎంత బతిమిలాడినా ఏమీ తీసుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శి పింఛన్లు రాని వారికి తిరిగి వచ్చే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినా వృద్ధురాలు మాత్రం అన్నపానీయాలు ముట్టుకోవడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉధృతంగా పింఛన్ పోరు వరంగల్: జిల్లావ్యాప్తంగా పింఛన్ పోరు ఉ దృతమైంది. అర్హులైన తమకు పింఛన్లు అందజేయూలని పలు ప్రాంతాల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆందోళన చేపట్టారు. హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని సుబ్బయ్యపల్లిలో ఎల్.శంకరయ్య అనే వృద్ధు డు శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నిం చాడు. దరఖాస్తులు తిరస్కరించడంపై దరఖాస్తుదారులు నిరాహార దీక్ష చేపట్టారు. ఖానాపురం మండలంలోని మంగళవారిపేటలో వికలాంగులు రాస్తారోకో నిర్వహించారు. కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్టేషన్ఘన్పూర్ మండలం పల్లగుట్ట లో జీపీ ఎదుట నిరసన తెలిపారు. పిల్లలకూ పింఛన్లు! మహబూబ్నగర్ జిల్లాలో పింఛన్ల మంజూరులో గందరగోళం గట్టు: వృద్ధులకు రావాల్సిన పింఛన్లు పిల్లలకు మంజూరయ్యాయి. తాము అర్హులం మొర్రో.. పింఛన్లు ఇవ్వండని వేలాదిమంది వృద్ధులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా మంజూరుకాని పింఛన్లు పిల్లల పేరిట మంజూరు కావడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్దొడ్డి గ్రామంలో కొత్తగా 226 మందికి వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మికులకు సంబంధించిన పింఛన్లను అధికారులు మంజూరు చేశారు. అయితే ఈ జాబితాలో ఉన్న వరుస సంఖ్య 03 నాగప్ప, 30 ఈడిగ నాగప్ప, 110 జాబితాలో సాకలి ఈరమ్మల పేర్లపై ఇద్దరికి వృద్ధాప్య, ఒకరికి చేనేత పింఛన్ మంజూరైంది. ఈ పేర్లతో గ్రామంలో వృద్ధులు, చేనేత కార్మికులు ఉన్నారు. అయితే, జాబితాలో మాత్రం పిల్లల పేర్ల వద్ద వారి ఫొటోలే ఉండడంతో అవి పిల్లలకు ఎలా మంజూరు చేశారోనని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జరిగిన పొరపాట్లపై అధికారులు విచారణ చేయించే పనిలో ఉన్నారు. పింఛన్ కోసం వెళ్లి.. కోమాలోకి.. కిందపడిన వృద్ధుడు ఆపరేషన్ కోసం రూ. 3 లక్షలు అవసరమన్న వైద్యులు సాయం కోసం ఎదురుచూపు సిరిసిల్ల: కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన పండుగ బాలయ్య(70)కు పింఛన్ వచ్చిన ఆనందం అరగంట కూడా నిలువలేదు. మొన్నటిదాకా పింఛన్ వస్తుందో లేదోనని ఆందోళన చెందిన బాలయ్య జాబితాలో పేరు రావడంతో ఎంతో ఆనందించాడు. రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ వద్దకు వెళ్లి రెండు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులు రూ. 2వేలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై కాలుజారి పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్కు రూ. 3లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ చేసినా ప్రాణానికి హామీ ఇవ్వలేమని చెప్పడంతో బాలయ్య కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు. బాలయ్య భార్య రామవ్వ గతంలోనే మరణించగా, కొడుకు నర్సయ్య జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వె ళ్లాడు. ఇద్దరు కూతుళ్లు బాలవ్వ, పోశవ్వ ఉన్నారు. ప్రస్తుతం కోమాలో ఉన్న బాలయ్యను బిడ్డలే చూసుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి బాలయ్యకు వైద్య సహాయం అందించాలని ఆ కుటుంబం కోరుతోంది. -
ఫలించిన పోలీస్ వేట
చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాద కార్యకలాపాలతో తమిళనాడును బెంబేలెత్తించిన అల్-ఉమ్మా తీవ్రవాది హైదర్ అలీ అరెస్టయ్యాడు. రాష్ట్ర సీబీసీఐడీ పోలీసులు ఇతని కోసం 21 ఏళ్ల నుంచి గాలిస్తుండగా కేరళలో మంగళవారం పోలీసులకు పట్టుబడ్డాడు. కోయంబత్తూరులో 1989 సెప్టెంబరు 1న వీరగణేష్ అనే హిందూ సంస్థకు చెందిన నేత దారుణ హత్యకు గురయ్యూడు. అతని అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై కూడా దాడులు జరిగాయి. కోవై విన్సెంట్ రోడ్డుకు చెందిన అల్-ఉమ్మా తీవ్రవాది హైదర్ అలీ సహా మొత్తం 12 మందిపై పోలీసులు హత్య, హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లోకి నెట్టారు. అదే ఏడాది బెయిల్పై వెలుపలికి వచ్చిన హైదర్ అలీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 1993 చెన్నైలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబుపేలి 11 మంది దుర్మరణం చెందారు. ఆ తరువాత కూడా రాష్ట్రంలో వరుసగా హిందూ నేతలపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల వెనుక హైదర్ అలీ, బాషా అనే మరో తీవ్రవాది సహా మొత్తం 20 మందిపై కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఈ ముఠాకోసం పోలీసులు గాలించని ప్రదేశం లేదు. తీవ్రవాది హైదర్ అలీ కేరళలో దాక్కుని ఉన్నట్లు సమాచారం అందింది. తన ఉనికి తెలియకుండా పాల్ఘాట్లోని ఒక వస్త్రదుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్న రాష్ట్ర సీబీసీఐడీ పోలీసులు మంగళవారం ఆకస్మికంగా దుకాణాన్ని ముట్టడించి హైదర్ అలీని అరెస్ట్ చేశారు. కోవై కోర్టులో 1989లో బెయిల్పై బైటకు వచ్చిన హైదర్ అలీ 8 ఏళ్లపాటూ సౌదీ ఆరేబియాలో తలదాచుకున్నాడు. ఆ తరువాత కేరళకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. ఇతనితోపాటూ సిద్దిక్ అనే తీవ్రవాది కోసం 19 ఏళ్లుగా పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై సెంట్రల్లో గువాహటి ఎక్స్ప్రెస్ బోగీలో పేలుడుపై జరుగుతున్న విచారణ లో ఇంతవరకు నిందితుని ఆచూకీ తెలియలేదు. పట్టుపడిన హైదర్ అలీకి ఇందులో ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేరళలో మంగళవారం పట్టుబడిన హైదర్ అలీని బుధవారం కోయంబత్తూరు కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించారు. కోర్టు అనుమతితో అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా ఇతర కేసుల్లోని మిస్టరీని ఛేదించే దుకు, అజ్ఞాతంలో ఉన్న సిద్దిక్, బాషాల అచూకీ తెలుసుకునేందుకు సీబీసీఐడీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.