breaking news
houstan
-
హుస్టన్లో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
భారత్పై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలను సరికొత్త పదంతో నిర్వచించారు అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్చే దోస్త్'(అన్నింటికంటే మంచి మిత్రదేశాలు) అని అన్నారు. ఈ ఇంటర్వ్యూ ఇంకా ప్రసారం కాకపోయినా ఇందుకు సంబంధించిన క్లిప్ లీక్ అయి వైరల్ అవుతోంది. అయితే ట్రంప్ భారత్తో సంబంధాలపై ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ బరిలోకి దిగుతారని, అందుకే భారతీయుల పట్ల అత్యంత సానుకూలంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్కు మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 2019లో మోదీ రెండోసారి భారత ప్రధానిగా ఎన్నికైన అనంతరం ఇద్దరూ కలిసి అమెరికా హ్యూస్టన్లో 'హౌదీ మోదీ' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భారత సంతతి వ్యక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ 'ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్' అని ట్రంప్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 2020లో కరోనా సంక్షోభానికి ముందు ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. గజరాత్లో ఇద్దరు నిర్వహించిన రోడ్ షోకు దాదాపు లక్ష మంది జనం తరలివచ్చారు. అనంతరం ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. చదవండి: బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా? -
మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట 8మంది మృతి
-
ఇంట్లో ‘ఈగలు’... బయట పల్లకీలు!
‘‘సంపద సృష్టి జాతీయసేవ. కనుక సంపద సృష్టికర్తలను అనుమానంతో చూడకూడదు. సంపద సృష్టి అయితేనే కదా దాన్ని పంపిణీ చేయగలం. దేశంలో సంపద సృష్టికర్తలు సంపన్నులే, కాబట్టి వారిని మనం గౌరవించాలి’’. – ప్రధాని నరేంద్రమోదీ,స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ‘‘అమెరికాలో సంపన్నులపై పన్ను రాయితీల ఫలితంగా నేను నా ప్రైవేట్ కార్యదర్శి కన్నా తక్కువ పన్ను చెల్లిస్తుంటాను’’. – వారెన్ బఫెట్, అగ్రగామి అమెరికన్ బిలియనీర్ ఏ దేశ నాయకుడైనా, ప్రధానమంత్రి అయినా జీవితంలో ఎన్ని దేశాలు తన పదవీకాలం ముగిసేలోపు తిరిగి వచ్చాడన్నది ప్రధానం కాదు. తిరిగి తిరిగి ఏం సాధించాడన్నదే చివరికి గణనలోకి వస్తుంది. ప్రజాస్వామ్యం ముసుగులో దేశీయ వ్యవస్థల్ని ఆచరణలో ఎలా భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేస్తూ రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూల్చుతూ వస్తున్నారన్నది గమనించాల్సిన అవసరం ఎప్పటికంటే నేడు ఎక్కువగా ఉంది. అమెరికాలోని ప్రవాస భారతీయులు ఎక్కువగా కేంద్రీకరించి ఉన్న టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో జరిగే మోదీ సభకు, ప్రెసిడెంట్ ట్రంప్ హాజరు కావడం వేరు. అలాంటి సభకు మోదీ మూడవసారి అమెరికా పర్యటన పేరిట హాజ రవడం వేరు. నిన్న మొన్నటిదాకా అమెరికా చదువుకోసం, ఉన్నత విద్యావకాశాల కోసం ఎగబాగుతున్న మన పిల్లల అవసరాల్ని తుంచే ప్రక్రియలో భాగంగా హెచ్– 1బి వీసాలకు మధ్యమధ్యలో ట్రంప్ బ్రేక్ వేస్తూ రావడం మనకు తెలిసిందే. అమెరికా పాలకుల ఆంక్షలపై తన తీవ్ర నిరసనను బాహాటంగా మోదీ ప్రకటించిన ఉదాహరణ లేదు. పైగా మొదటిసారిగా, అమెరికా పర్యటించినప్పుడు ఇండి యాను కొల్లగొట్టిపోయిన వాస్కోడిగామాలాగా అమెరికా గుత్త పెట్టు బడిదారులంతా వాస్కోడిగామాలై తరలిరండి అని ఆహ్వానించిన సంగతీ మరవరాదు. ఆ పెట్టుబడులతో ఇండియాలో సరుకులు ఉత్పత్తి చేసి పెట్టమని (మేక్ ఇన్ ఇండియా) మోదీ కోరినా ఆశించిన లాభాలు లేనిదీ వ్యాపారి వరదన పోడన్న సామెతను అమెరికా గుత్తే దారులు రుజువు చేశారు. మరో వైపున అక్కడ అమెరికా యువతలో పెరిగిపోతున్న నిరుద్యోగ తీవ్రతకు పరిష్కారంగా అటు డెమోక్రాట్ నాయకుడు ఒబామా అయినా ఇటు రిపబ్లికన్ ట్రంప్ అయినా చేస్తున్న పని అమెరికన్ ఓటర్లకు బుజ్జగింపు ఎత్తుగ డగా హెచ్–1 బి వీసాలను క్రమంగా నిరోధిస్తున్నామని ఎర చూపుతున్నారు. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను గత అయిదేళ్లలో లేని తీవ్ర సంక్షోభానికి గురిచేస్తూ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం మరింతగా దిగజార్చుతూ అర్ధంతరంగా, అనాలోచితంగా, ఆకస్మికంగా చెలామ ణిలో ఉన్న పెద్దనోట్లను రద్దుచేసి, మరింత తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దాని దుష్ఫ లితాలను చిన్న పారిశ్రామికులు, పేద, మధ్య తరగతి ప్రజలు, పేద రైతు, కార్మిక ప్రజా బాహుళ్యం కిక్కురుమన కుండా అనుభవించాల్సి వచ్చింది. దీని ఫలితంగా బ్యాంకులు, ఏటీఎంలు మూతపడితే వాటి వద్ద పడిగాపులు పడిన సందర్భంగా 125 మంది బ్యాంక్ ఖాతాదార్లు సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోతే 125 కోట్లమంది భారత ప్రజలు తనకు అండగా నిలిచారని మోదీ ప్రగ ల్భించారు. దేశ ప్రజలు తమ ప్రయోజనాల కోసం నిర్మించుకున్న అగ్ర శ్రేణి రిజర్వు బ్యాంకు నిర్వహణపై బీజేపీ–ఆరెస్సెస్ నిరంకుశ అజమాయిషీ కాస్తా బెడిసి కొట్టింది. రాజ్యాంగం నిర్దేశించిన బాధ్య తల అధ్యాయాన్ని పక్కకునెట్టి పాలకులు వ్యవహరిస్తూ వచ్చారు. చీలుబాటల రాజకీయం ఆధారంగా పార్లమెంటరీ సంప్రదాయా లను, అందులో అంతర్భాగమైన పార్లమెంటరీ కమిటీలను నిర్వీర్య పరిచారు. కశ్మీర్లో ‘370’వ నిబంధన రద్దుతోపాటు, కొన్ని ఈశాన్య భారత రాష్ట్రాలలో భారతదేశ పౌరులనే నువ్వెవరో, నీ పౌరసత్వాన్ని నిరూపించుకోమని ప్రశ్నించే దశకు పాలకులు దిగజారి పోయారు. వీటన్నింటి పర్యవసానంగా–ముగ్గురు రిజర్వ్బ్యాంక్ గవర్నర్లు, మరి ముగ్గురు ‘నీతి ఆయోగ్’ (ప్రణాళికా సంఘాన్ని చంపి) ఉన్న తాధికారులూ గత అయిదేళ్లలోనూ తప్పుకోవలసి వచ్చింది. ఈ ‘ఈగల మోత’కు తాళ లేక మరోమారు నాయకుడు విదేశంలో ‘పల్లకీ మోత’ను ఆశ్రయించవలసి వచ్చింది. మళ్లీ అవే పెట్టుబడుల కోసం అభ్యర్థన. మన నాయకుడికి హ్యూస్టన్లో అభి నందన సూచకంగా ‘హలో’ (హౌడీ: ‘హలో’ అనీ, ఆహ్వానమనీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తాజా నిఘంటువు అర్థం) చెప్పడం మనం హర్షించదగినదే. కానీ ‘హలో’ చెప్పేవారికి, ఉపాధి కోసం ఉద్యోగార్థులై అక్కడే ఉండిపోయి స్వదేశం వైపు తిరిగి చూడని వారికి, స్థిరాస్తులు, చరాస్తులు రెండు చేతులా సంపాదించి స్థిరపడిన వారికి మన దేశంలో ప్రజా బాహుళ్యం, ఆర్థిక వ్యవస్థ అనుభవిస్తున్న సంక్షోభ పరిణామాలపై కన్నెత్తి చూసే తీరిక ఉండదు కాబోలు పాపం. స్వయంగా అమెరికాలోని గూగుల్, స్టార్ బక్స్ లాంటి అత్యంత గుత్తేదారుల కంపెనీలు అమెరికా విడిచి ఐర్లాండ్ దేశంలో ఎందుకు స్థిరపడా లనుకుంటున్నాయో ఆలోచించాలి. పాపం, ఈ ‘పేద’ కంపెనీలకు అమెరికాలో ఇచ్చే పన్ను రాయితీలు చాలడం లేదట. అందుకని తక్కువ పన్నురేట్లు ఉన్న ఐర్లాండ్కు తరలుతున్నాయట. దీన్నే అమెరికన్లు ‘లాభాల పునాదులు చెక్కు చెదరని ఏర్పాటు’ (బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్) అంటారు. అంటే మోదీ, వారెన్ బఫెట్ సంరక్షించగోరుతున్న పెక్కుమంది ‘సంపద సృష్టిక ర్తలు’ తమ లాభాల గురించే ఎక్కువ ఆలోచిస్తారు గానీ, తమ జాతీ (దేశ) ప్రజా సంక్షేమాన్ని గురించి అంతగా ఆలోచించరని సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలయిన కేంద్రీయ సామాజిక శాస్త్రాల అధ్యయన సంస్థ, ఢిల్లీ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్స్ మాల్కోమ్ ఆదిశేషయ, ఆస్తా అహుజా తేల్చి చెప్పారు. బహుశా అందుకనే మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ మహాసభకు హాజరైనా, దేశంలో ఇన్ని రకాలుగా ఆర్థిక రంగంలో జరుగుతున్న అవకతవకల్ని, అవినీతిని, మోసాల్ని ఇంతకు ముందెన్నడూ ఆర్థిక వ్యవస్థ చూడలేదనీ, గుణ పాఠం నేర్వలేదనీ వాపోవాల్సి వచ్చింది. అంతేగాదు, బీజేపీ పాలనలో తొలి అయి దేళ్లలో ప్రజల చేతుల్లో డబ్బు చెలామణి కాక పోవడంవల్ల ఏర్పడిన సంక్షోభాన్ని గత 70 ఏళ్లలో దేశం ఎదుర్కొని ఎరగదని మోదీ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘నీతి ఆయోగ్’ విధాన నిర్ణయ సంస్థ అధిపతి రాజీవ్ కుమార్ విమర్శించాల్సి వచ్చిందని మరవ రాదు. హిందూత్వ రాజకీయం మినహా చరిత్ర, సామాజిక శాస్త్రాల అధ్యయనం నుంచి బీజేపీ–ఆరెస్సెస్ పాలకులు దూరమైనందుననే దేశానికి ఈ దుస్థితి దాపురించిందని భావించడం అతిశయోక్తి కాజాలదు. ఇదే నిజం కాక పోతే, దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలకులతో సుదీర్ఘకాలంపాటు దేశ స్వాతంత్య్ర సాధన కోసం జరిపిన పోరాటాల ద్వారా, ప్రజల అసంఖ్యాక త్యాగాల ద్వారా గడిం చిన అనుభవం నుంచి తొలి దీపశిఖ దాదాభాయ్ నౌరోజీ ప్రబో ధించిన ‘డ్రెయిన్ థియరీ’ (పరాయి పాలకులు దేశం నుంచి ఊడ్చు కుపోయిన దేశీయ సంపద) చాలు– బుద్ధిగల పాలకులు స్వతంత్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించుకునే సత్తా పొందడానికి. దేశ పౌరులు తాము ఈ దేశం వారమేనని నిరూపించు కోవాల్సిన దారుణ వ్యవ స్థను, సుప్రీంకోర్టును సహితం ధిక్కరించి పాలకులు రుద్దే స్థితికి దేశాన్ని దిగజార్చుతున్నారు. ఎప్పుడైతే ప్రధాని మోదీ.. సంపద స్వయంకర్తలు బడా సంపన్న వర్గాలని తాజాగా ప్రకటించి, జాతీయ జీవనంలో వివిధ రంగాలలోని రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీ వుల్ని, ఇతర ఉద్యోగ, సద్యోగ కష్ట జీవుల సమష్టి శ్రమను కించ పరచడం పాలకుల నైజంగా మారిందో– ఆనాడే సామాజిక ఆర్థిక రంగాలలో దోపిడీ వ్యవస్థలకు పునాది ఏర్పడి బలపడుతూ వచ్చింది. బహుశా అందుకనే అమెరికాలో తిరిగి సోషలిజంవైపు యువత మొగ్గుచూపే ధోరణి కనపడుతోందని ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తుకోవడానికి గల కారణాల్ని ప్రసిద్ధ సామాజిక విశ్లేషకుడు పాల్ స్ట్రీట్ (అమెరికా) ఇలా విశ్లేషించాడు: ‘‘అమెరికా, అమలులో ఉన్న ప్రజాస్వామ్యమని మీరనుకుంటారు, కానీ అది కాదు. ఆ మాటకొస్తే మన దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యమే కాదు. మరెందులో? ఆరోగ్య బీమాలోనా? కాదు, మానసిక ఆరోగ్య భాగ్య విధానంలోనా? కాదు, కార్మిక సంఘాల సంఘటిత హక్కులలోనా? కాదు, పోనీ క్రిమినల్ న్యాయ వ్యవస్థలోనా? కాదు, దేశ సంపద, ఆదాయ వనరుల పరి రక్షణలోనా? కాదు, నిజం చెప్పాలంటే– జన జీవితానికి చెందిన, వారి నిజమైన ప్రయోజనా లను రక్షించగలది కాదు అమెరికా ప్రజా స్వామ్యం (అమెరికన్ ఇన్ఫర్మేషన్ క్లియరింగ్ హౌస్ సౌజన్యంతో). ఇదేదో ఉగ్రవాదుల మేనిఫెస్టో అనుకునే ప్రమాదం ఉంది మరి. అమెరికాలో మెజారిటీ ప్రజలు యువతకు ఉద్యోగాల కల్పనను, వేతనాల పెంపును, నిరుద్యోగభృతిని, సార్వత్రిక వైద్యబీమాను కోరుకుంటు న్నారు. ఈ మాత్రపు ఆందోళనకారుల్నే ట్రంప్ ‘సోషలిస్టులు’గా భావించి ‘అమెరికా ఎప్పటికీ సోషలిస్టు దేశం కాబోదని అమెరికా పార్లమెంట్ శపథం చేయాల’ని కోరాడు నిజానికి, 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి తెరలేపింది అమెరికా పాలకులు, దాని ఒరలో ఇరుక్కు పోయిన ఇండియా లాంటి వర్ధమాన దేశాల పాలకులు. ఆ ఒర నుంచి బయటపడగల ప్రతివ్యూహాన్ని పన్నడంలో విఫలమై, దేశ సంపద సృష్టికి పునాది సామాన్య ప్రజల శ్రమశక్తీ, కార్మిక శక్తేనని గుర్తించక, ‘సంపన్నులే సంపద సృష్టికర్తలనీ, రెండో దఫా ప్రధాని పదవి నుంచి సిద్ధాంతీకరించి దానిపైన ఓ ‘తాతాచార్యుల ముద్ర’ గుద్దేసినంతమాత్రాన భారత ప్రజా బాహుళ్యం సమ్మతించడానికి సిద్ధపడదు– ‘తాజ్మహల్ నిర్మాణానికి, దేవాలయ కట్టడాలకు రాళ్లె త్తిన కూలీలెవ్వరు/ ప్రభువెక్కిన పల్లకీకాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?’ అని ప్రశ్నోపనిషత్ను తెరవకుండా ఉండ జాలరు. కష్టజీవి శ్రమ ఆగిపోతే కాలానికి కళ్లమే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ట్రంప్ హాజరవడం ఆనందంగా ఉంది: మోదీ
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యాటనలో భాగంగా సెప్టెంబర్ 22న జరగబోయే ‘హౌడీ-మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. హూస్టన్లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ-మోదీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అత్యధికంగా 50 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొననున్నారు. ఈ సభకు ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హజరుకానున్నట్లు ఆదివారం వైట్ హౌజ్ అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయం పై స్పందించారు. ‘ఈ మెగా కార్యక్రమానికి ట్రంప్ హాజరవడం ఆనందంగా ఉంది. దీంతో ఇండియా-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను’ అంటూ ప్రధాని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మోదీ, ట్రంప్ కలిసి భేటి కావడం ఇది మూడోసారి. మొదటి, రెండుసార్లు జపాన్లో జరిగిన జీ-20 సదస్సు, జూలైలో జీ-7 సదస్సుకు వీరిద్దరు కలిసి హాజరయ్యారు. కాగా ఇద్దరు నాయకులు కలిసి ఒకే సభలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. కావున ఈ సభకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రంప్ అదికారులకు సూచించారు. ఒక మీడియా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం జూలైలో జరిగిన సదస్సులో వీరిద్దరు పాల్గొన్నప్పుడు ప్రధాని మోదీ.. ట్రంప్ను ఈ సభకు హాజరు కావాలని కోరినట్లు సమాచారం. -
మోదీ అమెరికా సభకు అనుకోని అతిథి!
టెక్సాస్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చేవారం అమెరికా పర్యటనలో భాగంగా హూస్టన్ నగరంలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. హూస్టన్లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) ‘హౌడీ, మోదీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 22న ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. దీనిని భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు. హూస్టన్ నగరాన్ని ఇప్పటికే మోదీ మేనియా కమ్మేసింది. బాగున్నారా మోదీ అంటూ అక్కడ ఈ కార్యక్రమం కోసం ప్రవాస భారతీయులు వేచిచూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉత్తర అమెరికాలో ఓ విదేశీ నాయకుడు పాల్గొనే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకాబోవడం ఇదే మొదటిసారని, పోప్ ఫ్రాన్సిస్ మినహా విదేశీ నేతలు పాల్గొనే సభకు గతంలో ఈ స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని అంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో అనుకోని అతిథి ప్రత్యక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావొచ్చని తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఈ కార్యక్రమానికి ట్రంప్తో సహా 60 మంది అమెరికా చట్టసభ సభ్యులు కూడా హజరుకానున్నారు. ‘హౌడీ, మోదీ’ కార్యక్రమం విజయవంతం కావడానికి ఒక పేరుపొందిన ఇండియన్-అమెరికన్ ముస్లిం సంస్థ క్రియాశీలక మద్దతు అందిస్తోంది. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హూస్టన్ (ఐఎంఏజీహెచ్) ప్రధాన వెల్కమ్ పార్టనర్లలో ఒకటిగా ఉంది. (చదవండి : సినిమా ఇంకా మిగిలే ఉంది: మోదీ) -
హ్యూస్టన్లో 'యాత్ర' సంబరాలు
-
హౌస్టన్లో ఘనంగా బోనాలు
హౌస్టన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హౌస్టన్ (టాగ్) ఆధ్వర్యంలో ప్రవాసులు బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా బోనాలను హౌస్టన్లో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఈ ఏడాది బోనాల వేడుకను స్థానిక సాయి బాబా జలరం మందిర్లో అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకలో దాదాపు ఆరు వందల మంది భక్తులు పాల్గొన్నారు. పోతురాజు నృత్యాలతో కార్యక్రమం అంతా కోలాహలంగా మారింది. పద్మ కొత్తకొండ అమ్మవారి బోనాలను అందంగా అలంకరించారు. స్థానిక బిర్యానీ పాట్ యజమాని శ్రీధర్ కాంచనకుంట్ల అక్కడికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. టాగ్ అధ్యక్షులు విజయ్ దేవిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరేందర్ వచ్చిన భక్తులందరికి ధన్యవాదాలు తెలిపారు. టెక్సాస్ డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ కులకర్ణి పాల్గొని భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. -
హైహీల్ తో భర్తను కొట్టి చంపిన భార్య
ఆయన మరీ మెతక... ఈమె చాలా ముతక. ఆయన పెట్టమారి మగడు. ఈమెది పట్టరాని కోపం. అయ్యగారి పేరు ఆల్ఫ్ స్టీఫాన్ అండర్సన్. అమ్మగారి పేరు అనా ట్రుజిల్లో. ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. కానీ వాళ్లది కలహాల కాపురం. ఓ రోజు ఉన్నట్టుండి ట్రుజిలోకి ఆండర్సన్ మీద కోపం వచ్చింది. అంతే అతడిని ఎడాపెడా బాదింది. అయినా ఆమె కోపం చల్లారలేదు. అతడిని ఎత్తి కుదేసి, ఛాతీ మీద కూచుని, తన పాయింటెడ్ హై హీల్ షూతో ముఖం మీద బాదేసింది. మొనదేలిఉన్న హీల్ ముఖమంతా గుర్చుకుని రక్తం కారిపోయింది. చివరికి గాయాల వల్ల అతను చనిపోయాడు. అతని ముఖంపై 25 గాయాలున్నాయి. ఇప్పుడు ట్రుజిల్లో పై కేసు నమోదైంది. లక్ష డాలర్లు ధరావత్తుగా చెల్లించి ఆమె బెయిల్ పొందారు. 'అతనే నాపై దాడి చేశాడు. నేను అందుబాటులో ఉన్న ఏకైక ఆయుధంతో ఆత్మరక్షణ చేసుకున్నానంతే.' అంటోంది ట్రుజిల్లో అమాయకంగా మొఖంపెట్టి. అమెరికా లోని హౌస్టన్ లో ఈ సంఘటన జరిగింది.