-
నో క్యూర్..
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైన పటారం.. లోన లొటారం అనే రీతిలో బయట సూపర్స్పెషాలిటీ బోర్డులతో పాటు రకరకాల వైద్య నిపుణుల పేర్లు ఉంటున్నాయి. లోపల అడుగు పెడితే మాత్రం అందుకు విరుద్ధంగా ఒకరిద్దరు వైద్యులు మాత్రమే ఉంటారు. అర్హత లేకున్నా అన్నీ తామై వైద్య చికిత్సను ప్రారంభిస్తారు. కనీస సౌకర్యాలు లేకున్నా నాసిరకం వైద్యం అందిస్తూ కార్పొరేట్ స్థాయిలో ఫీజులు లాగుతారు. అవసరం లేకున్నా రకరకాల పరీక్షల పేరిట దండుకుంటారు. రోగి పరిస్థితి చేయిదాటితే వరంగల్, హైదరాబాద్లకు రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటారు. మెజారిటీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇదే తంతు జరుగుతున్నా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇటీవల నెక్కొండలోని ఓ ప్రైవేట్ సర్జికల్ ఆసుపత్రిలో ఓ మహిళ వైద్యురాలిపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ఆస్పత్రి ప్రిస్పిక్షన్ పైన సైతం సదరు వైద్యాధికారి పేరు మీద ఉంది. కానీ ఆ వైద్యురాలు అందులో వైద్య సేవలు అందించడం లేదు. జిల్లా వైద్య అధికారుల తనిఖీలో వెలువడ్డ నిజాలు ఇవి. సదరు ఆస్పత్రిపై పలు ఆరోపణలు రావడంతో ఇటీవల డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు. ఆ ఆస్పత్రిలో సర్జికల్ క్లీనిక్ నడిపే వైద్యాధికారి లేకుండా అర్హతలేని వైద్యులు సర్జికల్లు నిర్వహిస్తున్నారని తేలింది. దీంతో సదరు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారి నోటీసులు అందించారు. ఇతర దేశాల్లో చదువులు.. జిల్లాలో అర్హతలేని వైద్యుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏ అర్హత లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ దవాఖానాలు ప్రారంభించి చికిత్స అందిస్తున్నారు. ఎంసెట్ రాసిన అభ్యర్థులకు వారికి వచ్చిన మార్కుల ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తారు. మెడికల్ సీటుకు అర్హత సాధించని వారు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజు చెల్లించి ఎంబీబీఎస్ పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉన్న కళాశాలలల్లో మాత్రమే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిని మాత్రమే వైద్యులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. స్థానికంగా ఎంబీబీఎస్ సీట్లు రాని వారు రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ఫీజు తక్కువ కావడంతో చదువు సాగిస్తున్నారు. అక్కడ ఎంబీబీఎస్ లేకపోవడంతో ఎండీ చదివినట్లు అక్కడి ప్రభుత్వాలు సర్టిఫికెట్లు అందజేస్తాయి. విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించిన వారుదేశ వ్యాప్తంగా ఢిల్లీలో నిర్వహించే పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇక్కడి ప్రభుత్వాలు వైద్యుడిగా గుర్తిస్తాయి. ఏటా దేశం నుంచి 15వేల మందికి పైగా విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్నవారు ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్షల్లో పాసయిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇక్కడ ఆస్పత్రిపై ఏర్పాటు చేసిన బోర్డుపై పెద్ద అక్షరాలతో ఎండీ రష్యా, ఉక్రెయిన్ అని రాసి బ్రాకెట్లో ఎంబీబీఎస్ అని పెట్టుకోవాలి. కానీ రష్యా, ఉక్రెయిన్లో చదివినా ఇక్కడికి వచ్చిన తర్వాత జిల్లాల్లో ఎండీ వైద్యులుగా చెలామణి అవుతున్నారు. ఎండీగా ఇక్కడి ప్రభుత్వాలు గుర్తించాలంటే ఎంబీబీఎస్ తర్వాత మూడేళ్ల కోర్సు చేయాలి. కానీ ధనార్జనే ధ్యేయంగా వైద్య వృత్తిని చేపట్టిన కొందరు అర్హత లేని వైద్యులు చేస్తున్న పనులు వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకవస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 41 నర్సింగ్ హోంలు, రిజిస్టర్ ఇన్ పేషెంట్ ఆస్పత్రులు ఉన్నాయి. బోర్డులకే పరిమితం.. జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పలు వైద్యశాలల్లో డాక్టర్లు లేకున్నా వారి పేర్లు బయట బోర్డులపై రాస్తున్నారు. విజిటింగ్ వైద్యులు ఆయా ఆసుపత్రుల్లో వచ్చి వైద్యసేవలు అందించినప్పుడు వారు వచ్చే రోజు సమయం తప్పకరాయాలి. కానీ వైద్యశాల వద్ద ఏర్పాటు చేస్తున్న బోర్డులో 24 గంటల పాటు సదరు వైద్యుడు అక్కడే ఉన్నట్లు అర్థం వస్తుంది. ఆస్పత్రిలో ఇస్తున్న ఓపీ చిటీలో స్థానికంగా లేని వైద్యుల పేర్లు రాస్తున్నారు. మరికొన్ని ఆస్పత్రులు సూపర్ స్పెషాలిటీ పేరిట ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. అత్యవసర సేవల పేరుతో బోర్డులు ఏర్పాటు చేసిన అత్యవసర కేసులు వస్తే వరంగల్, హైదరాబాద్లకు రీఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల తనిఖీల కోసం కమిటీలు వేశాం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద.. అందుబాటులో ఉండేది మరొకరని మా దృష్టికి వచ్చింది. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసేందుకు రెండు కమిటీలను వేశాం. నర్సంపేటకు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, పరకాల, వర్ధన్నపేటలకు డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్యామ్ నీరజలను తనిఖీ అధికారులుగా నియమించాం. ఈ కమిటీ మూడు రోజు ల్లో తనిఖీ చేసి నివేదిక అందిస్తారు. ఈ నివేదికల ప్రకారం వాటిపై చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
ప్రసవం కోసం మహిళ పడిగాపులు
కంగ్టి, న్యూస్లైన్: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పురిటినొప్పులతో వచ్చిన ఓ గర్భిణి తీవ్ర అవస్థలు పడింది. వైద్యం కోసం గంటపాటు పడిగాపులు గాసింది. ఆమె పురిటి బాధలను చూసి చలించి ఓ మహిళ వైద్య అధికారికి ఫోన్చేయడంతో ఏఎన్ఎం హుటాహుటిన వచ్చి వై ద్యం ప్రారంభించింది. ఈ ఘటన ఆదివారం కంగ్టి పీహెచ్సీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని బోర్గికి చెందిన లక్ష్మి(25) పురిటి నొప్పులతో బాధ పడుతుండగా ఆమె బంధువులు ఆటోలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం ఉదయం 11గంటలకు తీసుకొచ్చారు. అయితే తెరచే ఉన్న స్థానిక ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. గంట పాటు సిబ్బంది కోసం వారు పడిగాపులు కాశారు. ప్రసవానికి సకాలంలో వైద్యం అందక మహిళా అవస్థలు పడింది. ఇదేసమయంలో మరో పేషెంటు సాధారణ చికిత్స కోసం ఆస్పత్రికి రాగా ప్రసవం కోసం లక్ష్మీ పడుతున్న బాధను చూసి చలించి సంబంధిత వైద్యాధికారి, ఫార్మాసిస్ట్కి ఫోన్ చేసింది. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూర్చున్న చోటే నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని స్థానికులు పడకపై పడుకోబెట్టారు. పది నిమిషాల తర్వాత డ్యూటీ ఏఎన్ఎం హుటా హుటిన ఆస్పత్రికి చేరుకొని లక్ష్మీకి వైద్య చికిత్సలు ప్రారంభించారు. అయితే ఇంకాస్త ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉండేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ ప్రసవించి ఆడపిల్లను జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
Advertisement