breaking news
Home Minister Nayani
-
'మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా'
చందంపేట (నల్లగొండ) : వచ్చే వేసవినాటికి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటు చేసి మంచి నీళ్లు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తన సొంతూరు నేరడుగొమ్ములో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మిషన్ భగీరథను పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీటి కుళాయిని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతంలో కృష్ణా పుష్కరఘాట్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే పుష్కరఘాట్లు ఏర్పాటు చేసి మౌలికవసతులు కల్పిస్తోందన్నారు. -
కాంగ్రెస్ పిచ్చెత్తినట్లు మాట్లాడుతోంది
హోంమంత్రి నాయిని విమర్శ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేపడుతున్న కార్యక్రమాలను చూసి కాళ్ల కింద భూమి కదిలిపోతున్న కాంగ్రెస్ పిచ్చెత్తినట్లు మాట్లాడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమ్మూద్ అలీ, మంత్రులు జగదీశ్వర్రెడ్డి, చందూలాల్లతో కలిసి ఆయన గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సీఎంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని, అడ్డగోలుగా, ఇష్టమున్న రీతిలో మాట్లాడడం ఆపకపోతే బాగుండదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెల్లని రూపాయి, దానికి విలువ లేదని, ప్రజలు ఎప్పుడో ఆ పార్టీని పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించారు. నగరంలో పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వాలని, అవసరమైన చోట ఇళ్లు కట్టివ్వాలని ఆల్ పార్టీ మీటింగులో తీసుకున్న నిర్ణయమని వివరించారు. కాంగ్రెస్ నేతలు ఇళ్ల నిర్మాణం విషయంలో వర్సిటీ విద్యార్ధులను రెచ్చగొడుతున్నారని మంత్రి జగదీశ్వర్రెడ్డి ఆరోపించారు. కబ్జాలు చేసి, పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టామని, గ్రేటర్ ఎన్నికల కోసం కాదని మహమ్మూద్ అలీ తెలిపారు.