breaking news
Home Minister Naini narashimareddy
-
జాతీయ పండుగగా గుర్తిస్తాం
ఎస్ఎస్ తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటున్నామని, వచ్చే జాతర నాటికి జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి మేడారంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి జరిగే జాతరకు రూ. కోట్లు వెచ్చించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. గోదావరి పుష్కరాల అనుభవంతో ఈ జాతరను విజయవంతం చేసేందుకు కలెక్టర్, ఎస్పీలు కృషి చేస్తున్నారన్నారు. ప్రశాంత వాతవారణంలో భక్తులు దేవతలను దర్శించుకునేలా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు. -
అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆర్థిక సహాయం చేశారు. శనివారం సచివాలయంలో ఐదు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన కె.వెంకటేశ్వరరావు, ఎన్.నాగభూషణం, ఎస్.నర్సింగరావు, పి.విజయ్ కుటుంబ సభ్యులకు, 2001 మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన చెట్టి కనకయ్యలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో అమరవీరుల కుటుంబాల నుంచి 23 దరఖాస్తులు అందాయని, వాటిలో 8 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. ఎంత డబ్బు ఇచ్చినా వారిని తిరిగి తీసుకురాలేమని, కానీ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తమ ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందన్నారు. ఇళ్లు లేనివారికి ఇళ్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వడం వంటి నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించిందన్నారు. జిల్లా మంత్రులు వారి జిల్లాల్లో అమరవీరులను గుర్తించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. జీఓను సవరించి 1969లో చనిపోయిన వారికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా అమరవీరుల కోటా కింద దరఖాస్తు చేసుకోదలిస్తే సంబంధిత కలెక్టర్ కార్యాలయంలో చేయవచ్చని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై పెట్టిన వెయ్యి కేసులు ఎత్తివేశామన్నారు. ఇంకేమైనా కేసులు పెండింగ్లో ఉంటే వాటిని కూడా ఎత్తివేసే ప్రయత్నం చేస్తామన్నారు. రైల్వే కేసులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్ఓ అశోక్కుమార్, ఆర్డీఓ నిఖిల, తహశీల్దార్లు శ్రీనివాస్రెడ్డి, సుజాత, అనురాధ పాల్గొన్నారు. -
కలుషిత జలాలకు చెక్ పెడదాం
- పైపులైన్ లీకేజీల నివారణకు చర్యలు - హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి - జలమండలి పథకాలపై ఉన్నతస్థాయి కమిటీ సమీక్ష - ఈనెల 6న తిరిగి సమావేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కలుషిత జలాలు, మంచినీటి పైప్లైన్లకు తరచూ ఏర్పడుతున్న లీకేజీలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని, త్వరలో ఈ సమస్యలకు చెక్ పెడతామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. గురువారం జలమండలి ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ఎక్సైజ్శాఖ మంత్రి పద్మారావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాణిజ్య టారిఫ్కు బదులుగా వ్యవసాయ రంగం తరహాలోజలమండలికి రాయితీ ధరపై విద్యుత్ సరఫరా చేసే అంశంపై ప్రభుత్వానికి నివేదిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నాలాల్లో పరిమితికి మించి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. బోర్డులో 1480 ఉద్యోగ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రభుత్వ దష్టికి తీసుకెళతామన్నారు. ఉదయం అత్తాపూర్, తేజస్వినగర్, పల్లెచెరువు, మైలార్దేవ్పల్లి, ఇమ్లిబన్పార్క్ నాలాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. జలమండలి పథకాలపై బోర్డు ఎండీ ఎం. జగదీశ్వర్ సభ్యులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు కేశవరావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రకాశ్గౌడ్, డెరైక్టర్లు తదితరులున్నారు. పేదలకు బిల్లు బకాయిలు మాఫీ చేయాలి జలమండలికి రూ.661 కోట్ల నీటి బిల్లు బకాయిలుండగా..అందులో బీపీఎల్ కింద ఉన్న నిరుపేదల బకాయిలు రూ.71 కోట్లను తక్షణం మాఫీ చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ కోరారు. రూ.3800 కోట్ల వ్యయంతో చేపడుతున్న గోదావరి మంచినీటి పథకానికి అవసరమైన నీటిని ఏ ప్రాజెక్టు నుంచి సేకరిస్తారో స్పష్టంచేయాలని నిలదీశారు. దీనిపై అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎంపీ కేకే కల్పించుకుని సర్ధిచెప్పారు. సమావేశంలో చర్చించినఅంశాలివే.. రామచంద్రాపురం, పటాన్చెరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కాప్రా, ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1523 కోట్లతో మంచినీటి సరఫరా నెట్వర్క్, స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి కేంద్రంతో చర్చించి పరిపాలన అనుమతులు సాధించాలి. బోర్డులో నిర్వహణ వ్యయానికి నిధుల పెంపు, విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేయాలని నిర్ణయం. నీటి బిల్లుల వసూలుకు జీహెచ్ఎంసీ సిబ్బంది వినియోగం. రక్షిత నీటి సరఫరా ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు. కత్భుల్లాపూర్, అల్వాల్, ఉప్పల్, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలో నీటి సరఫరాకు రూ.1132 కోట్లతో పనులు రూ.1250 కోట్లతో నగరవ్యాప్తంగా 1150 కి.మీ పరిధిలో ఉన్న పురాతన, దెబ్బతిన్న పైప్లైన్లమార్పు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు నెలకు రూ.47 కోట్లు ఖర్చు చేస్తుండగా.. కృష్ణా మూడోదశతో రూ.8 కోట్లు, గోదావరి మొదటిదశ పూర్తితో మరో రూ.30 కోట్ల విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. 33.47 శాతం నీటి సరఫరా నష్టాలను తగ్గించాలి. పురాతన మంజీరా ఫేజ్-1,2 పైప్లైన్ల మార్పిడి, ఉస్మాన్సాగర్ కాండ్యూట్, ఫిల్టర్బెడ్ల ఆధునికీకరణ. శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.3195 కోట్లతో మంచినీటి సరఫరా నెట్వర్క్. రూ.2867 కోట్ల అంచనా వ్యయంతో డ్రైనేజి ఏర్పాటుకు నిధుల సేకరణపై దృష్టి. రూ.1240 కోట్లతో డ్రైనేజి వసతుల కల్పన. జలమండలి పరిధిలో దశలవారీగా రూ.20,775 కోట్ల వ్యయంతో వివిధ పథకాలు చేపట్టాలి.