breaking news
holding company
-
వీటి ‘హోల్డింగ్’ వ్యూహాత్మకమే!
హోల్డింగ్ కంపెనీల్ని మార్కెట్ పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే సొంతగా పెద్ద వ్యాపారమేదీ ఉండదు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... వాటిపై వచ్చే డివిడెండ్లే ఆదాయంగా నెట్టుకొస్తూ ఉంటాయి. ఆ వాటాల విలువ పెరిగితే... ఈ కంపెనీల విలువా పెరుగుతుంది. అంతే. కాబట్టే నేరుగా వ్యాపారం చేసే కంపెనీల షేర్లపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి సొంతగా మంచి వ్యాపారం చేస్తూనే, ఇతర సంస్థల్లోనూ వాటాలున్న కంపెనీల సంగతేంటి? ఒకవైపు ప్రధాన వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంది. మరోవైపు పెట్టుబడులపై డివిడెండ్లూ వస్తాయి. భవిష్యత్తులో ఆ కంపెనీల వాటా విలువ పెరిగితే... అదో అదనపు ప్రయోజనం. వీటన్నిటికీ తోడు... ఇలాంటి కంపెనీలు కొన్నిసార్లు వాటి మొత్తం ఆస్తుల విలువతో పోలిస్తే (బుక్ వేల్యూ) మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంటాయి. అంటే.. వ్యాపారమూ ఉంది. పెట్టుబడులూ ఉన్నాయి. భవిష్యత్తులో విలువ అన్లాక్ అయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి ఇవి సాధారణ హోల్డింగ్ కంపెనీలు కావు. వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీలు. ఇలాంటి కంపెనీల గురించి వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్... ఇన్ఫో ఎడ్జ్... ఈఐడీ ప్యారీ... మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో... ఇవన్నీ ఇన్వెస్టర్లకు సుపరిచితమైన కంపెనీలే. విశేషమేంటంటే ఇన్వెస్టర్లు చాలామంది వీటి ప్రధాన వ్యాపారాన్నే చూస్తుంటారు. ఎప్పటికప్పుడు అవి ప్రకటించే ఫలితాలను విశ్లేషిస్తుంటారు. కానీ వీటికి రకరకాల కంపెనీల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? ఆ కంపెనీల్లో వాటాల విలువ మాటేంటి? ఆ విలువంత ఈ కంపెనీ షేర్లలో ప్రతిఫలిస్తోందా? అనేది పెద్దగా చూడరు. అలా చూసి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మెరుగైన రాబడులొస్తాయనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కంపెనీల షేర్లను కొంటే... వాటికి ఇన్వెస్ట్మెంట్లున్న మొత్తం ఎకో సిస్టమ్లో పెట్టుబడి పెట్టినట్లే. కాబట్టి దాని విలువ పెరిగే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి కంపెనీల గురించి వివరంగా చూద్దాం.ది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీకి అచ్చమైన ఉదాహరణ మురుగప్ప గ్రూప్నకు చెందిన ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే బీఎస్ఏ ఎస్ఎల్ఆర్తో పాటు మోంట్రా, హెర్క్యులిస్ వంటి సైకిళ్లన్నీ ఈ కంపెనీ బ్రాండ్లే. వీటి తయారీతో పాటు లిస్డెట్ కంపెనీలైన సీజీ పవర్, శాంతి గేర్స్లో దీనికి మెజారిటీ వాటాలున్నాయి. శాంతి గేర్స్ను ఈ మధ్యనే డీలిస్ట్ చేశారు కూడా. వీటితో పాటు మోంట్రా ఎలక్ట్రిక్, క్లీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థల్లో మెజారిటీ వాటాలున్నాయి. సైకిళ్లతో పాటు ఇంజినీరింగ్, మెటల్ ఉత్పత్తులు, మొబిలిటీ, ఈవీ, పారిశ్రామిక పరికరాల తయారీని వంటి వ్యాపారాలను కంపెనీ నేరుగా నిర్వహిస్తోంది కూడా. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రస్తుతం సీజీ పవర్ మార్కెట్ విలువ ఒక్కటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ విలువను దాటేసింది. మరి సీజీ పవర్లో దాదాపు 56 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కు... ఇతర కంపెనీల్లోని వాటాలను, సొంత వ్యాపారాలను జోడిస్తే విలువ పెరుగుతుంది కదా? అంటే హోల్డింగ్ కంపెనీ తరహాలో మార్కెట్ దీనికి తక్కువ విలువే ఇస్తోందని స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ అన్లిస్టెడ్ కంపెనీలు లిస్ట్ అయినా... వాటి విలువ పెరిగినా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర కూడా పెరుగుతుందనటంలో అతిశయోక్తి లేదు కదా? అందుకే దీన్ని ఇన్వెస్ట్మెంట్కు తగిన వ్యూహాత్మ హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) నౌఖ్రీ, 99 ఏకర్స్, జీవన్సాథీ, శిక్షా వంటి ఇంటర్నెట్ సంస్థలు ఈ కంపెనీ సొంతం. ఇవన్నీ ఆయా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నవే. మంచి ఆదాయాన్ని సాధిస్తున్నవే. ఏఐ వచ్చాక వీటి వ్యాపారాలు కొద్దిమేరకు తగ్గుతున్న మాట వాస్తవమే అయినా... ఏఐలో ఇన్వెస్ట్మెంట్లు చేయటం ద్వారా కంపెనీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. పైపెచ్చు జొమాటో, పాలసీ బజార్, అడ్డా 247, షాప్ కిరాణాతో సహా బోలెడన్ని స్టార్టప్స్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జొమాటో, పాలసీ బజార్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికే బ్లాక్ బస్టర్ ఫలితాలనిచ్చాయి. మిగతా వాటిలోనూ కొన్నింటి విలువ బాగా పెరిగింది. ఒకరకంగా దీన్ని లిస్టెడ్ వెంచర్ క్యాపిటల్ ప్లాట్ఫామ్గా భావించవచ్చు. దాంతోపాటు లాభాలిచ్చే అర్థవంతమైన వ్యాపారాలూ ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ షేరు బాగా పెరిగి... ప్రస్తుతం ఏఐ బూమ్లో కొంత కరెక్షన్కు గురైంది. ఈఐడీ ప్యారీ.. తక్కువ ధరకే..? ఈ కంపెనీని చాలామంది షుగర్ తయారీ కంపెనీగానే చూస్తారు. చక్కెర, బెల్లం, న్యూట్రాస్యూటికల్స్, బయో ఉత్పత్తుల్ని విక్రయించే ఈ కంపెనీకి సొంత చక్కెర రిఫైనరీ ఉంది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వీటన్నిటినీ మించి... ఎరువుల తయారీలో అగ్రగామి అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్లో ఈ కంపెనీకి దాదాపుగా 56 శాతానికిపైగా వాటా ఉంది. ఆ వాటా విలువ ఒక్కటే దాదాపుగా రూ.35వేల కోట్లు. పైపెచ్చు ఇండియన్ పొటాష్ కంపెనీలో సైతం దాదాపుగా రూ.400 కోట్ల విలువైన వాటాలున్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఈఐడీ ప్యారీ షేరు ధర తక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈఐడీ ప్యారీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపుగా రూ.13వేల కోట్ల దగ్గర్లో ఉంది. మరి కోరమాండల్లో రూ.35వేల కోట్లు, ఇండియన్ పొటాష్ లో రూ.400 కోట్ల పెట్టుబడులతో పోల్చినా ఇది తక్కువే కదా? పైపెచ్చు షుగర్ కంపెనీగా దేశవ్యాప్తంగా చక్కటి వ్యాపారం ఉంది. లాభాలు ఆర్జిస్తోంది. అందుకే వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు ఇలాంటి సంస్థలు మెరుగైనవన్నది నిపుణుల సూచన. మహీంద్రా అండ్ మహీంద్రా... ఎం అండ్ ఎం మాత్రం వీటన్నింటికీ భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే దీనికి హోల్డింగ్ కంపెనీగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులతో పాటు... బలమైన వ్యాపారమూ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సరీ్వసెస్, మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్, ఎస్ఎంఎల్ ఇసుజు వంటి లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ వాటాలు ఎం అండ్ ఎం సొంతం. ఇక టెక్ మహీంద్రా, సీఐఈ ఆటోమోటివ్ ఎగ్జిట్లో మైనారిటీ వాటాలున్నాయి. ఇవికాక చాలా అన్లిస్టెడ్ సంస్థలు దీనికి నూరుశాతం అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి. ఈ పెట్టుబడులు, వాటాలను పక్కనబెడితే... ఎం అండ్ ఎం వాహనాల తయారీలో అగ్రగామి. ట్రాక్టర్లలో లీడర్. ఈవీ మొబిలిటీలో కంపెనీ వేగంగా ఎదుగుతోంది. అంటే.. ఒక ఎం అండ్ ఎం షేరు కొంటే దాదాపుగా కంపెనీకి చెందిన గ్రూపు సంస్థలన్నింటినీ హోల్డ్ చేస్తున్నట్లే లెక్క. భవిష్యత్తులో వీటి వాటాల విలువ పెరగటంతో పాటు అన్లిస్టెడ్ కంపెనీలు కూడా లిస్టయితే ఎం అండ్ ఎం విలువ కూడా పెరుగుతుంది కదా!. అందుకే దీన్ని వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు తగిన హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. లార్సన్ అండ్ టూబ్రో ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఇది లీడర్. ఈపీసీ కాంట్రాక్టుల్లో అగ్రగామి. మెట్రో రైళ్లతో సహా భారీ నిర్మాణాల్లో కంపెనీది తిరుగులేని రికార్డు. వీటన్నిటితో పాటు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఫైనాన్స్, ఎల్ అండ్ టీ సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలున్నాయి. ప్రస్తుత విలువను బట్టి చూస్తే ఎల్ అండ్ టీ షేరును దాని వాస్తవ వ్యాపారాన్ని బట్టే విలువ కడుతున్నారన్నది నిపుణుల మాట. మరి దీని వాటాల విలువను కూడా లెక్కిస్తే!!. భవిష్యత్తులో కూడా ఈ విలువలు పెరుగుతూ ఉంటాయి కనక దీన్ని వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇవే కాదు. ఇలా విశ్లేషిస్తూ వెళితే చాలా హోల్డింగ్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కు తగినవిగానే కనిపిస్తాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ను తీసుకుంటే దీనికి ఓలియో కెమికల్స్, కెమికల్స్ వ్యాపారాలతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ సహా ఇతర గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్కు సొంత వ్యాపారాలతో పాటు కిర్లోస్కర్ గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కల్యాణి ఇన్వెస్ట్మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, కేశోరామ్ ఇండస్ట్రీస్.. వీటన్నిటిదీ ఇదే స్టోరీ. కేశోరామ్ ఎప్పటికప్పుడు తన ఇన్వెస్ట్మెంట్లను అన్లాక్ చేస్తూ షేర్ హోల్డర్ల వాటా విలువ పెంచుతోంది. కాబట్టి ఇవన్నీ వాచ్లిస్ట్లో పెట్టుకోవాల్సినవే. హోల్డింగ్కంపెనీలు తక్కువ ధరకే ఎందుకు వస్తాయంటే... → క్యాపిటల్ గెయిన్స్ పన్నును కూడా మార్కెట్లు పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే ఒక కంపెనీకి వేరొక కంపెనీలో ఉన్న మొత్తం వాటాను విక్రయించేసిందనుకోండి. ఆ వచి్చన సొమ్ముపై దాదాపు 12.5 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను చెల్లించాలి. అంటే ఆ మేరకు వాటాల విలువను తక్కువగానే చూడాలి కదా!. → హోల్డింగ్ కంపెనీలు తమ వాటాలను విక్రయించటం అంత తేలికకాదు. దాదాపుగా అసాధ్యం కూడా. మరి హోల్డింగ్ చేయటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులున్నపుడు వాటికి పూర్తిగా విలువ కట్టడమెందుకన్నది మార్కెట్ భావన. అందుకే హోల్డింగ్ కంపెనీలు దాదాపుగా వాటి విలువకన్నా 30–40 శాతం తక్కువకే ట్రేడవుతూ ఉంటాయి. → కాబట్టి ఇన్వెస్టర్లు వీటిని విశ్లేషించేటపుడు దానికి లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న వాటాల విలువెంత? అన్లిస్టెడ్ సంస్థల్లో ఉన్న వాటాల విలువెంత? సొంతగా అది చేస్తున్న వ్యాపార విలువెంత? అనేది చూడాలి. క్యాష్– ఇన్వెస్ట్మెంట్లు– రుణాలు, హోల్డింగ్ కంపెనీకి మార్స్క్ ఇచ్చే 30–40% డిస్కౌంట్ అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే ఆ కంపెనీ విలువను నిర్ణయించుకోవాలి. అప్పటికీ తక్కువ ఉంటే... దాన్ని తక్షణ ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా చూడొచ్చు. లేనిపక్షంలో భవిష్యత్తులో అన్లాక్ అయ్యే విలువను దృష్టిలో పెట్టుకుని అందులో పెట్టుబడి పెట్టొచ్చు. రమణమూర్తి మంథా -
హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) క్రమంగా హోల్డింగ్ కంపెనీగా ఆవిర్భవించే అవకాశమున్నట్లు ఫిన్టెక్ గ్రూప్ క్రెడిట్సైట్స్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రధాన బిజినెస్ విభాగాల్లో స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా నిలిచే వీలున్నట్లు అంచనా వేసింది. ఆర్ఐఎల్ విషయంలో కంపెనీ చీఫ్ బిలియనీర్ ముకేశ్ అంబానీ అమలు చేస్తున్న విజయవంతమైన ప్రణాళికల ద్వారా పటిష్ట క్రెడిట్ ప్రొఫైల్ను సొంతం చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది. టెలికం, రిటైల్ విభాగాలు అత్యుత్తమ ఫలితాలు సాధించనుండటంతో చమురు విభాగం బలహీన ఔట్లుక్ పెద్దగా ప్రభావం చూపబోదని అభిప్రాయపడింది. అధిక ధరల నేపథ్యంలో చమురుశుద్ధి యూనిట్, భారీ పెట్టుబడి అవసరాలు వంటి అంశాలు చమురు విభాగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఇటీవల ఆర్ఐఎల్ వివిధ బిజినెస్ల విజయవంతమయ్యే ప్రణాళికలపైనే దృష్టి సారించింది. చైర్మన్ ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం ఆకాశ్, ఈషా, అనంత్లను సంస్థ బోర్డులో డైరెక్టర్లుగా చోటు కల్పించింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ మరో ఐదేళ్లు చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ప్రణాళికాబద్ధంగా.. ‘పలువురు ఇన్వెస్టర్లకు ముకేశ్ అంబానీ బాధ్యతల నుంచి వైదొలగే అంశంపై ఆందోళనలు నెలకొని ఉండవచ్చు. అయితే ముకేశ్ అంబానీ విజయవంతమైన ప్రణాళికలను సానుకూలంగా పరిగణించాలి. ముగ్గురికీ ఆర్ఐఎల్ ప్రధాన బిజినెస్ యూనిట్ల (టెలికం, రిటైల్, నూతన ఇంధన) యాజమాన్య బాధ్యతలను అప్పగించారు. తద్వారా భవిష్యత్లో ఎలాంటి వివాదాలూ తలెత్తకుండా స్పష్టమైన విభజనను చేపట్టారం’టూ క్రెడిట్సైట్స్ నివేదికలో వివరించింది. దీంతో ముకేశ్ ఉన్నట్లుండి బాధ్యతల నుంచి తప్పుకోవడం అనే రిస్కుకు చెక్ పెట్టారని పేర్కొంది. అంతేకాకుండా తదుపరి తరం యాజమాన్య నిర్వహణలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మరింత అభివృద్ధి చెందేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి ప్రధాన బిజినెస్ విభాగాలు స్వతంత్రంగా ఎదిగేందుకు దారి చూపుతూ హోల్డింగ్ కంపెనీగా ఆర్ఐఎల్ ఆవిర్భవించనున్నట్లు క్రెడిట్సైట్స్ పేర్కొంది. -
విడిగా వివిధ బిజినెస్ల లిస్టింగ్: అనిల్ అగర్వాల్ మెగా ప్లాన్
న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గ్రూప్లోని బిజినెస్లను విడిగా లిస్ట్ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్ చీఫ్ అనిల్ అగర్వాల్ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్ వీటన్నిటికీ హోల్డింగ్ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్లో దూసుకుపోతున్న భారత్: ఈ నంబర్ ప్లేట్ల గురించి తెలుసా?) వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్ అండ్ మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితరాలను విడిగా లిస్ట్ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్..బీఅలర్ట్: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?) తొలుత 2021 నవంబర్లో అగర్వాల్ బిజినెస్ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు. రెండు దశాబ్దాలుగా.. గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్ అండ్ గ్యాస్తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్ అండ్ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు. -
హోల్డింగ్ కంపెనీగా శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్
చెన్నై: శ్రీరామ్ గ్రూపు హోల్డింగ్ కంపెనీగా ఇప్పటి వరకు ఉన్న శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్తోపాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్లో విలీనం కానున్నట్టు శ్రీరామ్ గ్రూపు ప్రకటించింది. శ్రీరామ్ క్యాపిటల్కు హోల్డింగ్ కంపెనీ అయిన శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేటు లిమిటెడ్.. విలీనానంతర కంపెనీకి ప్రమోటర్గా మారుతుందని, ఫైనాన్షియల్, బీమా సేవలన్నీ దీని కింద ఉంటాయని ప్రకటించింది. శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్(ఎస్ఎఫ్వీపీఎల్)కు సహ యజమానులుగా శ్రీరామ్ ఓనర్షిప్ ట్రస్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్ఎఫ్వీపీఎల్కు వైస్ చైర్మన్, ఎండీగా శ్రీరామ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డీవీ రవి వ్యవహరిస్తారు. శ్రీరామ్ క్యాపిటల్ సీఎఫ్వో శుభశ్రీ శ్రీరామ్, నోవాక్ టెక్నాలజీ డైరెక్టర్, సీఈవో ఎన్ఎస్ నంద కిషోర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతలు చేపడతారని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ ప్రకటించింది. -
రెండు కంపెనీలుగా శాంసంగ్!
సియోల్: ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో నలుగుతున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కంపెనీని రెండుగా విడగొట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఉత్పత్తి .. నిర్వహణకు ఒక సంస్థను, హోల్డింగ్ కంపెనీగా మరొకదాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చని శాంసంగ్ వివరించింది. అంతర్జాతీయ కార్పొరేట్ అనుభవం ఉన్న స్వతంత్ర బోర్డు సభ్యుడు ఒక్కరినైనా నామినేట్ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. షేర్హోల్డర్లకు డివిడెండ్ చెల్లింపులను గతేడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా 3.4 బిలియన్ డాలర్ల మేర చెల్లించనున్నట్లు శాంసంగ్ తెలిపింది. ఒక వైపు లోపభూరుుష్టమైన బ్యాటరీలతో గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలిపోరుున ఉదంతాలు, మరోవైపు దేశీయంగా రాజకీయ వివాదాలు శాంసంగ్ను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్ను స్థాపించిన లీ కుటుంబ వారసుడు, వైస్ చైర్మన్ లీ జే యాంగ్కు అధికారాలు బదలారుుంచే ప్రక్రియ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది.


