-
‘ప్రతి ఏడాది అడవిలో 5 రోజులుండేవాడిని’
న్యూఢిల్లీ : ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్నప్పుడు వంట చేయడమే కాక పాత్రలను కూడా శుభ్రం చేసివాడినంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఫేస్బుక్ పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘పదిహేడేళ్ల వయసులో హిమాలయాలకు వెళ్లి దాదాపు రెండేళ్లపాటు అక్కడే గడిపాను. ఈ పర్యట వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నా జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. ‘ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అహ్మదాబాద్ వెళ్లాను. అంత పెద్ద నగరంలో జీవించడం అదే మొదటిసారి. అక్కడ ఉన్న మా బంధువుల క్యాంటీన్లో కొన్ని రోజులు పనిచేశాను. అదే సమయంలో ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి ప్రచారక్గా మారాను. అప్పుడే ప్రజల జీవితాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఇతరులతో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని శుభ్రం చేయడం.. టీ,ఆహారం తయారు చేయడం, పాత్రలు శుభ్రం చేయడం లాంటి పనులన్ని చేసేవాడిన’న్నారు. అయితే రోజువారి కార్యక్రమాలలో పడిపోయి జీవితంలో సంపాదించుకున్న ప్రశాంతతను కోల్పోకూడదని భావించేవాడిని. అందుకే కొన్ని రోజుల పాటు అడవిలోకి వెళ్లి ఒంటరిగా గడిపేవాడనని తెలిపారు మోదీ. ఈ విషయం గురించి మోదీ మాట్లాడుతూ.. ‘యువకుడిగా ఉన్నప్పుడు ఏటా దీపావళి సమయంలో ఐదు రోజుల పాటు అడవిలోకి వెళ్లిపోయి, ఎవ్వరూ లేని చోటుకు వెళ్లి ప్రశాంతంగా గడిపేవాడిని. దీనికోసం స్వచ్ఛమైన నీరు ఉన్న చోటును ఎంచుకునేవాడిని. అంతేకాక 5 రోజులకు సరిపడా ఆహారం వెంట తీసుకెళ్లేవాడిని. ఈ ఐదు రోజులు రేడియో, దినపత్రికలు ఏమీ లేకుండా గడిపేవాడినని తెలిపారు మోదీ. ఇలా చేయడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు మోదీ. అయితే కొద్ది రోజుల తర్వాత తాను అడవికి వెళ్తున్నానే విషయం మిగతా వారికి తెలిసి పోయిందన్నారు. దాంతో వారు నన్ను ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అడిగేవారు. అందుకు నేను ‘నన్ను నేను తెలుసుకునేందుకు వెళ్తున్నాను’ అని చెప్పేవాడినని తెలిపారు మోదీ. యువతకు కూడా ఇదే సలహా ఇచ్చారు మోదీ. రోజువారీ హడావుడి జీవితాలకు విరామం ఇచ్చి.. కొంత సమయం మీతో మీరు గడిపితే అది ఎంతో ఉపయోగపడుతుందంటూ మోదీ యువతకు సలహా ఇచ్చారు. అప్పుడే నిజమైన ప్రపంచంలో జీవించడం మొదలుపెడతారన్నారు. అప్పడు మీపై మీకు నమ్మకం పెరుగుతుందని, ఇతరులు మీ గురించి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోగలుగుతారని సూచించారు. మీకు మీరే ప్రత్యేకమని, ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూడొద్దని మోదీ పేర్కొన్నారు. -
ఆ ప్రశ్నలకు జవాబు చెప్పను!: రజనీ
సాక్షి, శ్రీనగర్: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రాన్ని ప్రకటించినా.. పార్టీ పేరు గానీ, విధి విధానాలు గానీ ఖరారు చేయలేదు. పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు హిమాలయాలకు పర్యటనకు వెళ్లారు రజనీ. అందులో భాగంగా ముందుగా హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాలను రజనీ దర్శించుకుంటున్నారు. శివ్ఖోరి, రియాసిలో కొందరు మీడియా ప్రతినిధులు రజనీని కలిసి రాజకీయాలపై ప్రశ్నించారు. ఎంతో చిర్రెత్తుకొచ్చినా రజనీ చాలా ప్రశాంతంగా బదులిచ్చారు. ‘నేను ఆధ్యాత్మిక వ్యక్తిని. జమ్ముకశ్మీర్ నుంచి తర్వాత రిషికేష్ వెళ్తాను. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి ప్రవేశిస్తానో.. ఆ రోజు మీరు అడిగిన రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను. అప్పటివరకూ నేను ఏ రాజకీయ ప్రశ్నలు, పరిస్థితులపై స్పందిచాలని భావించడం లేదని’ రజనీ స్పష్టం చేశారు. కాగా, తాను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా హిమాలయాలకు వెళ్లి బాబా ఆశీస్సులు పొందే రజనీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో హిమాలయ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. పర్యటనలో భాగంగా సిమ్లా, ధర్మశాలను సందర్శించుకున్న రజనీ తర్వాత రిషికేశ్కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక రాజకీయ పార్టీ పేరు, సిద్ధాంతాలు ప్రకటిస్తారని తమిళ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
హిమాలయాలకు రజనీకాంత్!
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈయన ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఒక్క సినిమాల విషయంలోనే కాదు.. ఆయన వ్యకిగత జీవితానికి కూడా వర్తిస్తుంది. మనసు బాగోలేకపోతే అందరూ గుడికి వెళతారు కానీ రజనీ మాత్రం హిమాలయాలకు వెళతారు. రోజుల కొద్ది అక్కడే ధ్యానం చేస్తూ గడుపుతారు. ఇప్పుడు కూడా హిమాలయాలకు ప్రయాణమవుతున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఇంత వరకు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించని రజనీ తన రాజకీయ ప్రయాణానికి ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనుకుంటున్నారు. కొద్ది రోజులు హిమాలయాల్లోని బాబా గుహల్లో గడపనున్నారు. చెన్నై నుంచి సిమ్లాకు, అక్కడి నుంచి కేదారినాధ్ మీదుగా హిమాలయాల్లోని బాబా గుహలకు చేరుకుంటారు. -
నా చిత్రాన్ని అడ్డుకునే కుట్ర
నా చిత్ర విడుదలను అడ్డుకునే కుట్ర జరుగుతోందని నటుడు శింబు ఆరోపించారు. ఈయన నటించిన ఇదు నమ్మ ఆళు, వాలు చిత్రాలు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగిన ఈ చిత్రాల్లో ఒకటైన వాలు చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వలన ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు మేలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ విషయం తెలిసిన ఆ చిత్ర హీరో శింబు ఆవేదనకు గురయ్యారు. ఆయన మాట్లాడుతూ తాము చేసే వృత్తిపై ఇతరులకు నమ్మకం ఉంటుందో లేదో తెలియదు గానీ తనకు మాత్రం పూర్తి నమ్మకం ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయినా దీనిపై తాను భయపడనన్నారు. శింబు చిత్రం విడుదలై చాలా కాలమైంది. దీంతో మనస్థాపానికి గురైన శింబు వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం పుట్టిస్తున్నాయి. ఆ మధ్య వివాదాలకు గురైన శింబు మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల అలాంటి సంఘటనలకు దూరంగా ఉన్నారు. తాజాగా మళ్లీ ఆయన కుట్ర లాంటి వ్యాఖ్యలతో వార్తల్లోకి రావడం విశేషం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement